అన్వేషించండి

Reliance AGM 2022: ఈ నగరాల్లో మీరుంటే దీపావళి కల్లా రిలయన్స్‌ 5G మీ గుప్పిట్లోకి వస్తుంది

ఈ దీపావళి నాటికి దిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో 5జీ సేవలు ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది చివరికల్లా ప్రతి పట్టణంలోనూ 5జీ సర్వీసులు అందిస్తామని ముఖేష్‌ అంబానీ ప్రకటించారు.

దేశంలో 5జీ నెట్‌వర్క్‌ కోసం రూ.2 లక్షల కోట్లను వెచ్చించనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ప్రకటించింది. రిలయన్స్‌ ఛైర్మన్‌ & మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముఖేష్‌ అంబానీ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) మాట్లాడారు. మార్కెట్‌ ఎదురు చూస్తున్న చాలా అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ ఈవెంట్‌ను లక్షలాది మంది ఇన్వెస్టర్లు, ఎనలిస్ట్‌లు ఆసక్తిగా ట్రాక్ చేశారు. 

వరుసగా మూడో ఏడాది వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2021లో జరిగిన AGMలో, గ్రీన్ ఎనర్జీలోకి అడుగు పెట్టడంపై ముఖేష్‌ ప్రకటన చేశారు. 2020లో, గూగుల్‌ను మైనారిటీ పెట్టుబడిదారుగా ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ టెలికాం విభాగం (జియో), మరో రెండు నెలల్లో 5G సేవలను ప్రారంభించనుందని కంపెనీ ఇవాళ్టి వార్షిక సాధారణ సమావేశంలో ఛైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు.

ఈ దీపావళి నాటికి దిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో 5జీ సేవలు ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది చివరికల్లా ప్రతి పట్టణంలోనూ 5జీ సర్వీసులు అందిస్తామని ప్రకటించారు. వెయ్యి నగరాల్లో సేవలు అందించాలన్నది జియో లక్ష్యంగా చెప్పిన ముఖేష్‌, దానిని సాధించే సత్తా జియోకు ఉందన్నారు.

'మేడ్ ఇన్ ఇండియా' 5G కొలాబరేషన్‌లో తమకు ప్రపంచ ప్రముఖ టెక్ కంపెనీల భాగస్వామ్యం ఉందంటూ.. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎరిక్సన్, నోకియా, సామ్‌సంగ్, సిస్కో పేర్లను ప్రస్తావించిన ముఖేష్‌... క్వాల్‌కమ్‌తోనూ భాగస్వామ్యాన్ని ప్రకటించారు. 

భారతీయ మార్కెట్ కోసం సరసమైన ధరలో 5జీ స్మార్ట్ ఫోన్‌ను అభివృద్ధి చేయడానికి గూగుల్‌తో కలిసి కంపెనీ పని చేస్తోందని పేర్కొన్నారు.

రిలయన్స్‌ రిటైల్‌ గురించీ ఛైర్మన్‌ మాట్లాడారు. రూ.2 లక్షల కోట్ల టర్నోవర్, రూ.12,000 కోట్ల ఎబిటా రికార్డును సాధించినందుకు రిటైల్ నాయకత్వ బృందాన్ని అభినందించారు. రిలయన్స్ రిటైల్ ఆసియాలోని టాప్-10 రిటైలర్లలో ఒకటిగా ఉందని వెల్లడించారు.

పవర్ ఎలక్ట్రానిక్స్‌లో కొత్త గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖేశ్ అంబానీ చెప్పారు.

2035 నాటికి నెట్‌ కార్బన్ జీరోగా మారే లక్ష్యం దిశగా RIL సాగుతున్నట్లు తెలిపారు. నాలుగు గిగా ఫ్యాక్టరీలను స్థాపించడానికి జామ్‌నగర్‌లో ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు గత సంవత్సరం ముఖేష్‌ ప్రకటించారు. ఇవాళ, పవర్ ఎలక్ట్రానిక్స్ కోసం కొత్త గిగా ఫ్యాక్టరీని ప్రకటించాలని ప్రకటించారు. 

ఈ సంవత్సరం, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ వ్యాపారాన్ని ప్రారంభిస్తామని ఇషా అంబానీ ప్రకటించారు. ప్రతి భారతీయుడి రోజువారీ అవసరాలను తీర్చేలా మంచి నాణ్యత, సరసమైన ధరల్లో ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, అందించడమే ఈ వ్యాపారం లక్ష్యంగా ఇషా వివరించారు.

ఏజీఎం నేపథ్యంలో భారీ గ్యాప్‌ డౌన్‌ నుంచి కోలుకున్న రిలయన్స్‌ షేరు ధర ఒక దశలో రూ.2,655 వరకు వెళ్లింది. ముఖేష్‌ అంబానీ నుంచి ఆశించిన స్థాయిలో ప్రకటనలు లేకపోవడంతో ఏజీఎం సమయం నుంచి మళ్లీ దిగాలు పడింది. చివరకు 0.69% నష్టంతో రూ.2,600 వద్ద ముగిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల

వీడియోలు

Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget