అన్వేషించండి

Reliance AGM 2022: ఈ నగరాల్లో మీరుంటే దీపావళి కల్లా రిలయన్స్‌ 5G మీ గుప్పిట్లోకి వస్తుంది

ఈ దీపావళి నాటికి దిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో 5జీ సేవలు ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది చివరికల్లా ప్రతి పట్టణంలోనూ 5జీ సర్వీసులు అందిస్తామని ముఖేష్‌ అంబానీ ప్రకటించారు.

దేశంలో 5జీ నెట్‌వర్క్‌ కోసం రూ.2 లక్షల కోట్లను వెచ్చించనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ప్రకటించింది. రిలయన్స్‌ ఛైర్మన్‌ & మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముఖేష్‌ అంబానీ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) మాట్లాడారు. మార్కెట్‌ ఎదురు చూస్తున్న చాలా అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ ఈవెంట్‌ను లక్షలాది మంది ఇన్వెస్టర్లు, ఎనలిస్ట్‌లు ఆసక్తిగా ట్రాక్ చేశారు. 

వరుసగా మూడో ఏడాది వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2021లో జరిగిన AGMలో, గ్రీన్ ఎనర్జీలోకి అడుగు పెట్టడంపై ముఖేష్‌ ప్రకటన చేశారు. 2020లో, గూగుల్‌ను మైనారిటీ పెట్టుబడిదారుగా ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ టెలికాం విభాగం (జియో), మరో రెండు నెలల్లో 5G సేవలను ప్రారంభించనుందని కంపెనీ ఇవాళ్టి వార్షిక సాధారణ సమావేశంలో ఛైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు.

ఈ దీపావళి నాటికి దిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో 5జీ సేవలు ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది చివరికల్లా ప్రతి పట్టణంలోనూ 5జీ సర్వీసులు అందిస్తామని ప్రకటించారు. వెయ్యి నగరాల్లో సేవలు అందించాలన్నది జియో లక్ష్యంగా చెప్పిన ముఖేష్‌, దానిని సాధించే సత్తా జియోకు ఉందన్నారు.

'మేడ్ ఇన్ ఇండియా' 5G కొలాబరేషన్‌లో తమకు ప్రపంచ ప్రముఖ టెక్ కంపెనీల భాగస్వామ్యం ఉందంటూ.. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎరిక్సన్, నోకియా, సామ్‌సంగ్, సిస్కో పేర్లను ప్రస్తావించిన ముఖేష్‌... క్వాల్‌కమ్‌తోనూ భాగస్వామ్యాన్ని ప్రకటించారు. 

భారతీయ మార్కెట్ కోసం సరసమైన ధరలో 5జీ స్మార్ట్ ఫోన్‌ను అభివృద్ధి చేయడానికి గూగుల్‌తో కలిసి కంపెనీ పని చేస్తోందని పేర్కొన్నారు.

రిలయన్స్‌ రిటైల్‌ గురించీ ఛైర్మన్‌ మాట్లాడారు. రూ.2 లక్షల కోట్ల టర్నోవర్, రూ.12,000 కోట్ల ఎబిటా రికార్డును సాధించినందుకు రిటైల్ నాయకత్వ బృందాన్ని అభినందించారు. రిలయన్స్ రిటైల్ ఆసియాలోని టాప్-10 రిటైలర్లలో ఒకటిగా ఉందని వెల్లడించారు.

పవర్ ఎలక్ట్రానిక్స్‌లో కొత్త గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖేశ్ అంబానీ చెప్పారు.

2035 నాటికి నెట్‌ కార్బన్ జీరోగా మారే లక్ష్యం దిశగా RIL సాగుతున్నట్లు తెలిపారు. నాలుగు గిగా ఫ్యాక్టరీలను స్థాపించడానికి జామ్‌నగర్‌లో ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు గత సంవత్సరం ముఖేష్‌ ప్రకటించారు. ఇవాళ, పవర్ ఎలక్ట్రానిక్స్ కోసం కొత్త గిగా ఫ్యాక్టరీని ప్రకటించాలని ప్రకటించారు. 

ఈ సంవత్సరం, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ వ్యాపారాన్ని ప్రారంభిస్తామని ఇషా అంబానీ ప్రకటించారు. ప్రతి భారతీయుడి రోజువారీ అవసరాలను తీర్చేలా మంచి నాణ్యత, సరసమైన ధరల్లో ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, అందించడమే ఈ వ్యాపారం లక్ష్యంగా ఇషా వివరించారు.

ఏజీఎం నేపథ్యంలో భారీ గ్యాప్‌ డౌన్‌ నుంచి కోలుకున్న రిలయన్స్‌ షేరు ధర ఒక దశలో రూ.2,655 వరకు వెళ్లింది. ముఖేష్‌ అంబానీ నుంచి ఆశించిన స్థాయిలో ప్రకటనలు లేకపోవడంతో ఏజీఎం సమయం నుంచి మళ్లీ దిగాలు పడింది. చివరకు 0.69% నష్టంతో రూ.2,600 వద్ద ముగిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
June 1 Rule Changes 2026:బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగులు పడతాయని వార్నింగ్
తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగుల వార్నింగ్
Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
NHAI Toll Exemption List: టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Embed widget