అన్వేషించండి

Reliance AGM 2022: ఈ నగరాల్లో మీరుంటే దీపావళి కల్లా రిలయన్స్‌ 5G మీ గుప్పిట్లోకి వస్తుంది

ఈ దీపావళి నాటికి దిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో 5జీ సేవలు ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది చివరికల్లా ప్రతి పట్టణంలోనూ 5జీ సర్వీసులు అందిస్తామని ముఖేష్‌ అంబానీ ప్రకటించారు.

దేశంలో 5జీ నెట్‌వర్క్‌ కోసం రూ.2 లక్షల కోట్లను వెచ్చించనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ప్రకటించింది. రిలయన్స్‌ ఛైర్మన్‌ & మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముఖేష్‌ అంబానీ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) మాట్లాడారు. మార్కెట్‌ ఎదురు చూస్తున్న చాలా అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ ఈవెంట్‌ను లక్షలాది మంది ఇన్వెస్టర్లు, ఎనలిస్ట్‌లు ఆసక్తిగా ట్రాక్ చేశారు. 

వరుసగా మూడో ఏడాది వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2021లో జరిగిన AGMలో, గ్రీన్ ఎనర్జీలోకి అడుగు పెట్టడంపై ముఖేష్‌ ప్రకటన చేశారు. 2020లో, గూగుల్‌ను మైనారిటీ పెట్టుబడిదారుగా ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ టెలికాం విభాగం (జియో), మరో రెండు నెలల్లో 5G సేవలను ప్రారంభించనుందని కంపెనీ ఇవాళ్టి వార్షిక సాధారణ సమావేశంలో ఛైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు.

ఈ దీపావళి నాటికి దిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో 5జీ సేవలు ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది చివరికల్లా ప్రతి పట్టణంలోనూ 5జీ సర్వీసులు అందిస్తామని ప్రకటించారు. వెయ్యి నగరాల్లో సేవలు అందించాలన్నది జియో లక్ష్యంగా చెప్పిన ముఖేష్‌, దానిని సాధించే సత్తా జియోకు ఉందన్నారు.

'మేడ్ ఇన్ ఇండియా' 5G కొలాబరేషన్‌లో తమకు ప్రపంచ ప్రముఖ టెక్ కంపెనీల భాగస్వామ్యం ఉందంటూ.. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎరిక్సన్, నోకియా, సామ్‌సంగ్, సిస్కో పేర్లను ప్రస్తావించిన ముఖేష్‌... క్వాల్‌కమ్‌తోనూ భాగస్వామ్యాన్ని ప్రకటించారు. 

భారతీయ మార్కెట్ కోసం సరసమైన ధరలో 5జీ స్మార్ట్ ఫోన్‌ను అభివృద్ధి చేయడానికి గూగుల్‌తో కలిసి కంపెనీ పని చేస్తోందని పేర్కొన్నారు.

రిలయన్స్‌ రిటైల్‌ గురించీ ఛైర్మన్‌ మాట్లాడారు. రూ.2 లక్షల కోట్ల టర్నోవర్, రూ.12,000 కోట్ల ఎబిటా రికార్డును సాధించినందుకు రిటైల్ నాయకత్వ బృందాన్ని అభినందించారు. రిలయన్స్ రిటైల్ ఆసియాలోని టాప్-10 రిటైలర్లలో ఒకటిగా ఉందని వెల్లడించారు.

పవర్ ఎలక్ట్రానిక్స్‌లో కొత్త గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖేశ్ అంబానీ చెప్పారు.

2035 నాటికి నెట్‌ కార్బన్ జీరోగా మారే లక్ష్యం దిశగా RIL సాగుతున్నట్లు తెలిపారు. నాలుగు గిగా ఫ్యాక్టరీలను స్థాపించడానికి జామ్‌నగర్‌లో ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు గత సంవత్సరం ముఖేష్‌ ప్రకటించారు. ఇవాళ, పవర్ ఎలక్ట్రానిక్స్ కోసం కొత్త గిగా ఫ్యాక్టరీని ప్రకటించాలని ప్రకటించారు. 

ఈ సంవత్సరం, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ వ్యాపారాన్ని ప్రారంభిస్తామని ఇషా అంబానీ ప్రకటించారు. ప్రతి భారతీయుడి రోజువారీ అవసరాలను తీర్చేలా మంచి నాణ్యత, సరసమైన ధరల్లో ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, అందించడమే ఈ వ్యాపారం లక్ష్యంగా ఇషా వివరించారు.

ఏజీఎం నేపథ్యంలో భారీ గ్యాప్‌ డౌన్‌ నుంచి కోలుకున్న రిలయన్స్‌ షేరు ధర ఒక దశలో రూ.2,655 వరకు వెళ్లింది. ముఖేష్‌ అంబానీ నుంచి ఆశించిన స్థాయిలో ప్రకటనలు లేకపోవడంతో ఏజీఎం సమయం నుంచి మళ్లీ దిగాలు పడింది. చివరకు 0.69% నష్టంతో రూ.2,600 వద్ద ముగిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

టాప్ హెడ్ లైన్స్

Diamond Merchant Kidnap: మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
LIC Unclaimed Funds: ఎల్‌ఐసీలో రూ.7,318 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బు! మీ సొమ్ము ఉందేమో ఇలా చెక్ చేసుకోండి
ఎల్‌ఐసీలో రూ.7,318 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బు! మీ సొమ్ము ఉందేమో ఇలా చెక్ చేసుకోండి
Post Office RD Scheme: మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ
మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Mudragada Kapu Reservation Legacy: కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Embed widget