అన్వేషించండి

RBI Warning: ప్రజలారా జాగ్రత్త - ఆర్బీఐ సంచలన నివేదిక.. ప్రమాదంలో దేశ ఆర్థిక స్థిరత్వం

Reserve Bank Of India: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్టులో బ్యాంకింగ్, ఎన్‌బిఎఫ్‌సిల రుణాల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసింది.

RBI Report: దేశంలోని బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టం చేసేందుకు వాటి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు సెంట్రల్ బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయబడింది. దీనికి తోడు ఇది దేశ ఆర్థిక వ్యవస్థ గాడితప్పకుండా చూసుకోవటంతో పాటు ద్రవ్యోల్బణం నియంత్రణలోనూ తన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా రిజర్వు బ్యాంక్ అందించిన రిపోర్ట్ దేశ ఆర్థిక వ్యవస్థలోని ప్రమాదాన్ని ముందుకు తీసుకొస్తోంది. 

తాజా నివేదిక ప్రకారం కరోనా మహమ్మారి తర్వాత దేశంలో పబ్లిక్ డెట్ భారీగా పెరిగిందని ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదికలో పేర్కొంది. అలాగే దేశ ప్రజల్లో గడచిన 10 ఏళ్లుగా పొదుపు సైతం భారీగా క్షీణించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలోని ప్రజలు తక్కువగా పొదుపు చేస్తూ ఎక్కువగా అప్పులు చేస్తున్నారని నివేదిక వెల్లడించింది. ఈ ధోరణి దేశ ఆర్థిక స్థిరత్వానికి పెద్ద ముప్పును తీసుకొచ్చే ప్రమాదం ఉందని ఆర్బీఐ హెచ్చరించింది. 

2023 ఆర్థిక సంవత్సరంలో దేశ ప్రజల పొదుపు జీడీపీలో 18.4 శాతం తగ్గుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. అయితే 2013-2022 మధ్య కాలంలో సగటున ప్రజల పొదుపు 39.8 శాతంగా ఉన్నట్లు ఐర్బీఐ నివేదిక పేర్కొంది. దీని ప్రకారం ప్రజల్లో వేగంగా తగ్గిపోయిన పొదుపు అలవాట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే 2023 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ప్రజల పొదుపు 28.5 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది. 2013- 2022 మధ్య ప్రజలు తమ ఆదాయంలో సగటున 8 శాతం జీడీపీకి ఆదా చేశారు. అయితే అది 2023లో ఈ సంఖ్య 5.3 శాతానికి పడిపోయింది. ఇదే క్రమంలో రుణాలకు సంబంధించిన డేటాను పరిశీలిస్తే.. భారతదేశంలో మెుత్తం రుణం జీడీపీలో 40.1 శాతానికి చేరుకుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇతర ఆర్థిక సంస్థల కంటే ఎక్కువ స్థాయి కావటం ప్రస్తుతం అటు ఆర్బీఐతో పాటు ఆర్థిక నిపుణులు కూడా పెరుగుతున్న రుణాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం..
మార్చి 2023 ప్రారంభంలో అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్‌తో సహా నాలుగు మధ్య తరహా బ్యాంకులు కుప్పకూలాయి. దీనికి అసలు కారణం సదరు బ్యాంకుల్లో డబ్బు ఉంచిన డిపాజిటర్లు వేగంగా నిధులను ఉపసంహరించుకోవటమే కారణం. ఇదే క్రమంలో అమెరికాలోని బ్యాంకులు ప్రజల సొమ్మును అధిక వడ్డీని సంపాదించేందుకు దీర్ఘకాలిక మెచ్యూరిటీ ఉండే సాధనాల్లో నిధులను పార్క్ చేసింది. ఇది సదరు బ్యాంకులను సంక్షోభంలోకి నెట్టేసింది. ఈ క్రమంలో దేశంలో ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఐదవ వంతు కంటే ఎక్కువగా ఉన్న ఎన్‌బిఎఫ్‌సి సెక్టార్‌లో బాధ్యతల(Liabilities) వైపు రిస్క్ పెరగడం గురించి ఆర్బీఐ ఇప్పుడు ఆందోళన చెందుతోంది.  IL&FS, SREI ఇన్‌ఫ్రా, దేవాన్ హౌసింగ్ వంటి పెద్ద వైఫల్యాలు గతంలో భారత ఆర్థిక వ్యవస్థలో పెద్ద కుదుపులకు దారితీసిన సంగతి తెలిసిందే. 

NBFCల పరిస్థితి ఆందోళనకరం.. 
ఆర్బీఐ తాజా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారం మార్చి 2024 చివరి నాటికి దేశంలోని NBFC సంస్థలు మెుత్తంగా భారీ రుణ భారాన్ని కలిగి ఉన్నాయి. ఇవి ఆర్థిక వ్యవస్థ నుంచి ఎక్కువగా నిధులను సమీకరించాలని ఆర్బీఐ పేర్కొంది. మార్చితో ముగిసిన కాలానికి ఈ సంస్థలకు స్థూల రాబడులు రూ.1.61 లక్షల కోట్లుగా ఉండగా.. అవి చెల్లించాల్సిన స్థూల మెుత్తం రూ.16.58 లక్షల కోట్లుగా ఉండటంపై సెంట్రల్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే క్రమంలో మార్కెట్లోని హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు సైతం భారీగా నిధులను ఆర్థిక వ్యవస్థ నుంచి సమీకరించాయి. ఇవి ఫెయిల్ అయితే ఆ ప్రభావం అంటువ్యాధిలా ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget