By: ABP Desam | Updated at : 13 Aug 2021 07:58 AM (IST)
పెట్రోల్, డీజిల్ ధరలు (ఫైల్ ఫొటో)
దేశ ఆర్థిక రాజధాని ముంబయి, చెన్నై, బెంగళూరు సహా దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో దాదాపు గత 27 రోజులుగా ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్లో రెండు రోజుల క్రితం స్వల్ప వ్యత్యాసం కనిపించింది. నేడు సైతం హైదరాబాద్లో ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని ఇంధన మార్కెట్లో రెండు రోజుల క్రితం పెట్రోల్ లీటరుకు రూ.0.15 పైసలు పెరగడం తెలిసిందే. డీజిల్ ధర సైతం రెండు రోజుల క్రితం రూ.0.14 పైసలు చొప్పున తగ్గింది. తాజాగా ధరలు నిలకడగా ఉన్నాయి.
తెలంగాణలో ఆగస్టు 13న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్లో పెట్రోల్ ధర గత రెండు రోజులుగా నిలకడగా ఉంది. నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.105.83 కాగా.. డీజిల్ ధర రూ.97.96 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. కరీంనగర్లో పెట్రోల్ ధర గత రెండు రోజులుగా అదే ధరలో కొనసాగుతోంది. రెండు రోజుల కిందట ఇక్కడ 0.27 పైసలు తగ్గడంతో రూ.105.99గా ఉంది. డీజిల్ ధర నిన్న రూ.0.25 పైసలు పెరగడంతో రూ.98.09 కు చేరింది.
ఇక వరంగల్లో గత కొన్ని రోజులుగా పెట్రోల్ ధరలో ఏ మార్పులేదు. తాజాగా పెట్రోల్ ధర రూ.105.38 గా ఉండగా, డీజిల్ ధర రూ.97.53 వద్ద నిలకడగానే కొనసాగుతూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు ఇంధన ధరలు ఇదే తీరుగా ఉన్నాయి.
నిజామాబాద్లో పెట్రోల్ ధర లీటర్పై నిన్న సుమారు రూ.0.30 పైసల చొప్పున పెరిగింది. డీజిల్ ధర నిన్నటితో పోల్చితే రూ.0.28 పైసలు పెరిగింది. దీంతో నేడు పెట్రోల్ రూ.107.44 గా ఉంది. డీజిల్ ధర రూ.99.45గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్లో ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్లో ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్రోల్ ధర రూ.0.18 పైసలు పెరగడంతో ప్రస్తుతం రూ.108.17 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.28 పైసలు తగ్గి రూ.99.75కు చేరింది.
విశాఖపట్నం ఇంధన మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.04గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే రూ.0.24 పైసలు పెరిగింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో రూ.0.22 పైసలు పెరగడంతో రూ.98.65గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.25 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.
తిరుపతిలో భారీగా తగ్గుదల
తిరుపతిలో ఇంధన ధరల్లో భారీ మార్పు చోటు చేసుకుంది. పెట్రోల్ లీటరుకు రూ.1.05 పైసలు తగ్గగా.. డీజిల్ రూ.0.94 పైసలు తగ్గింది. దీంతో తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.108.12 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇక డీజిల్ ధర కూడా రూ.0.94 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.99.65 గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఆగస్టు 12 నాటి ధరల ప్రకారం 69.25 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను అలాగే ఉంచుతున్నాయి. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Adani Group Investment Plan: ఇన్ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు
Train Ticket: కన్ఫర్మ్డ్ ట్రైన్ టిక్కెట్ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్ ప్రయత్నించండి
Forex Reserves: వరుసగా రెండో వారంలోనూ పెరిగిన ఫారెక్స్ ఛెస్ట్ - ఇండియా దగ్గర 597.39 బిలియన్ డాలర్ల నిల్వలు
GST Data: GDPతో పోటీ పడిన GST, నవంబర్ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Telangana Results KCR : కాంగ్రెస్పై అభిమానం కన్నా కేసీఆర్పై కోపమే ఎక్కువ - తెలంగాణ ప్రజలు ఇచ్చిన సందేశం ఇదేనా ?
Winning Minister 2023: మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి విజయం- ఆయనతోపాటు గెలిచిన మంత్రులు వీళ్లే
Telangana constituency wise results: తెలంగాణ తీర్పు: ఏయే నియోజకవర్గంలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
/body>