అన్వేషించండి

Reliance Capital: హిందూజా గ్రూప్‌ చేతికి రిలయన్స్ క్యాపిటల్‌ - ఎన్‌సీఎల్‌టీ నుంచి ఆమోదం

రిలయన్స్ క్యాపిటల్ దివాలా పరిష్కారం కేసులో, ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ప్రతిపాదించిన రూ.9,650 కోట్ల విలువైన రిజల్యూషన్ ప్లాన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదించింది.

Hinduja Group Will Be The New Owner Of Reliance Capital: ముకేష్‌ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్‌కు కొత్త యజమాని పేరు ఖరారైంది. హిందూజా గ్రూప్‌ (Hinduja Group) కంపెనీ అయిన ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (IndusInd International Holdings Limited) ఇప్పుడు కొత్త ఓనర్‌ అవుతుంది. రిలయన్స్ క్యాపిటల్ దివాలా పరిష్కారం కేసులో, ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ప్రతిపాదించిన రూ. 9,650 కోట్ల విలువైన రిజల్యూషన్ ప్లాన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదించింది. 

దివాలా పరిష్కార ప్రక్రియ కింద ఆర్డర్              
దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా రిలయన్స్ క్యాపిటల్‌ను చేజిక్కించుకునేందుకు IIHL (ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్) దాఖలు చేసిన దరఖాస్తును NCLT  (National Company Law Tribunal) ముంబై బెంచ్‌ ఆమోదించింది. 2023 జూన్‌లో, రెండో రౌండ్‌ బిడ్డింగ్‌ సందర్భంగా ఈ ప్రణాళికను IIHL సమర్పించింది. 

NCLT ఆమోదంతో, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం దొరికింది. ఎట్టకేలకు, అనిల్ అంబానీ ‍‌(Anil Ambani) ప్రమోటెడ్ కంపెనీని కొనుగోలు చేసేందుకు హిందూజా గ్రూప్‌నకు అనుమతి లభించింది. గత ఏడాది జూన్‌లో, రూ. 9661 కోట్ల అడ్వాన్స్ క్యాష్ బిడ్‌ రౌండ్‌లో, మానిటరింగ్ కమిటీ ద్వారా IIHL ఎంపిక జరిగింది. రిలయన్స్ క్యాపిటల్ అదనపు నగదు నిల్వ రూ. 500 కోట్లు కూడా రుణదాతలకు చేరనుంది.

పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు        
జస్టిస్ వీరేంద్ర సింగ్ బిష్త్ & టెక్నికల్ సభ్యుడు ప్రభాత్ కుమార్‌తో కూడిన NCLT ముంబై బెంచ్‌, IIHL రిజల్యూషన్ ప్లాన్‌ మౌఖికంగా ఆమోదించింది. ఈ రోజు (మంగళవారం) సాయంత్రం పూర్తి స్థాయి ఆర్డర్‌ కాపీ వెలువడుతుంది. టోరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్, హిందూజా గ్రూప్‌ బిడ్ల మధ్య వివాదం సుప్రీంకోర్టులో కొనసాగుతోంది కాబట్టి, ఈ ప్రణాళికను పర్యవేక్షించడానికి ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తారు.

అసలు విషయం ఇది           
పరిపాలన సంబంధిత సమస్యలు & రుణ ఎగవేతల కారణంగా, అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్‌లోని రిలయన్స్ క్యాపిటల్‌ (Reliance Capital) డైరెక్టర్ల బోర్డును 2021 నవంబర్‌లో, రిజర్వ్ బ్యాంక్ (RBI) రద్దు చేసింది. ఆ తర్వాత, వై నాగేశ్వరరావును అడ్మినిస్ట్రేటర్‌గా సెంట్రల్‌ బ్యాంక్‌ నియమించింది. ఈ కంపెనీని స్వాధీనం చేసుకోవడానికి 2022 ఫిబ్రవరిలో బిడ్లను ఆహ్వానించారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత, ఇప్పుడు, ఇది ఓ కొలిక్కి వచ్చింది.

రిలయన్స్ క్యాపిటల్‌కు రూ. 40,000 కోట్లకు పైగా అప్పు ఉంది. మొదట, కేవలం నలుగురు కంపెనీలే దరఖాస్తు చేశాయి, వాటితోనే బిడ్‌ నిర్వహించారు. అయితే, తక్కువ బిడ్ల కారణంగా రుణదాతల కమిటీ మొత్తం ఆ నాలుగు ప్లాన్లను తిరస్కరించింది. ఆ తర్వాత ఒక ఛాలెంజ్‌ మెకానిజాన్ని ప్రారంభించారు. దీనిలో IIHL, టోరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ పాల్గొన్నాయి.

మరో ఆసక్తికర కథనం: మార్చిలో బ్యాంక్‌లు 14 రోజులు పని చేయవు, హాలిడేస్‌ లిస్ట్‌ ముందే చూసుకోండి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR:  వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
Andhra Pradesh Latest News:ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
Delhi New CM:  మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం - పోరాటమే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా విజయ రహస్యం
మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం - పోరాటమే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా విజయ రహస్యం
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Qatar AL Thani Family Wealth | మోదీ ఎయిర్ పోర్ట్ కు వెళ్లారంటే అర్థమవ్వలేదా ఖతార్ అమీర్ రేంజ్ | ABPTrolls on Pawan kalyan Body | కుంభమేళా స్నానంపైనా కుళ్లు ట్రోలింగులు | ABP DesamKakinada Shilparamam Photo Shoots | ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ పెట్టిన శిల్పారామం ఇప్పుడు ఇలా | ABP DesamKTR Photo in Sircilla Tea Shop | టీ షాపునకు కేటీఆర్ ఫోటో..ఈ లోగా కలెక్టర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR:  వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
Andhra Pradesh Latest News:ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
Delhi New CM:  మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం - పోరాటమే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా విజయ రహస్యం
మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం - పోరాటమే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా విజయ రహస్యం
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
Trolls on Pawan kalyan Body | కుంభమేళా స్నానంపైనా కుళ్లు ట్రోలింగులు | ABP Desam
Trolls on Pawan kalyan Body | కుంభమేళా స్నానంపైనా కుళ్లు ట్రోలింగులు | ABP Desam
ABP Network Ideas of India Summit 2025: ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఫోర్త్ ఎడిషన్ -  ఆలోచనలు పంచుకోనున్న విభిన్న రంగాల దిగ్గజాలు
ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఫోర్త్ ఎడిషన్ - ఆలోచనలు పంచుకోనున్న విభిన్న రంగాల దిగ్గజాలు
HYDRA Success: వారెవ్వా హైడ్రా..! తీవ్ర వ్యతిరేకత, భారీ విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!
వారెవ్వా హైడ్రా..! తీవ్ర వ్యతిరేకత, భారీ విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!
CBSE Exams: సీబీఎస్‌ఈ అభ్యర్థులకు గుడ్ న్యూస్, వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షల నిర్వహణ
సీబీఎస్‌ఈ అభ్యర్థులకు గుడ్ న్యూస్, వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షల నిర్వహణ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.