అన్వేషించండి

Housing sales 2022: హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ జోరు - ఇటుకలు కొన్నంత ఈజీగా ఇళ్లను కొనేస్తున్నారు

ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు 34% పెరిగి 3,12,666 యూనిట్లకు (ఫ్లాట్‌/ఇల్ల్లు) చేరుకున్నాయి. కార్యాలయ ప్రాంగణాల లీజులు 36% పెరిగి 51.6 మిలియన్ చదరపు అడుగులకు చేరుకున్నాయి.

Housing sales 2022: కొవిడ్ మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థలో మళ్లీ పూర్వ స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కావడంతో, స్థిరాస్తి వ్యాపారం బాగా పుంజుకుంది. 2022లో, అటు వాణిజ్య పరంగా, ఇటు నివాస పరంగా రియల్‌ ఎస్టేట్‌ సేల్స్‌ బాగా పెరిగాయి.

దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో (ముంబయి, NCR దిల్లీ, బెంగళూరు, పుణె, హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌) చేసిన సర్వే ఆధారంగా, నైట్ ఫ్రాంక్ ఇండియా (Knight Frank India) ఒక రిపోర్ట్‌ విడుదల చేసింది. 

ఈ రిపోర్ట్ ప్రకారం.. 2022లో, ఈ ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు 34% పెరిగి 3,12,666 యూనిట్లకు (ఫ్లాట్‌/ఇల్ల్లు) చేరుకున్నాయి. కార్యాలయ ప్రాంగణాల లీజులు 36% పెరిగి 51.6 మిలియన్ చదరపు అడుగులకు చేరుకున్నాయి.

గృహ విక్రయాల్లో వృద్ధి 

ఇటు ఇళ్ల ధరలు, అటు గృహ రుణాల మీద వడ్డీ రేట్లు రెండూ పెరిగినప్పటికీ, 2022లో గృహ విక్రయాలు వృద్ధిని నమోదు చేశాయని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ వెల్లడించారు.

నైట్ ఫ్రాంక్ ఇండియా డేటా ప్రకారం.. 2022లో రెసిడెన్షియల్ సేల్స్‌లో 85,169 యూనిట్లతో ముంబై ముందంజలో ఉంది, మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఇది 35% పెరిగింది. 

దిల్లీ-NCRర్‌లో అమ్మకాలు 67% వృద్ధితో 58,460 యూనిట్లకు చేరుకోగా, బెంగళూరులో 40% వృద్ధితో 53,363 యూనిట్లకు చేరుకున్నాయి.

పుణెలో గృహాల విక్రయాలు 17% పెరిగి 43,410 యూనిట్లకు చేరుకున్నాయి.

హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ సేల్స్‌ జోరు మీద ఉన్నాయి. 2022లో, హైదరాబాద్‌ పరిధిలో మొత్తం 43,847 కొత్త ఇళ్లను ప్రారంభించగా, అందులో 31,046 నివాసాలు అమ్ముడయ్యాయి. 2021తో పోలిస్తే, కొత్త గృహాల నిర్మాణంలో 23%, కొత్త ఇళ్ల అమ్మకాల్లో 28% వృద్ధి నమోదైంది. ఇళ్ల విక్రయాల్లో చదరపు అడుగు సగటు ధర రూ. 4,984 కు చేరింది. 2021తో పోలిస్తే 5.6% పెరిగింది. తెల్లాపూర్‌, కొల్లూరు, గండిపేట, నార్సింగిలో ఇళ్ల కొనుగోళ్ల కోసం డిమాండ్‌ పెరిగింది, అక్కడే ఎక్కువ కొత్త ప్రాజెక్టులు స్టార్ట్‌ అయ్యాయి.

చెన్నైలో 19% వృద్ధితో 14,248 యూనిట్లకు చేరుకోగా, అహ్మదాబాద్‌లో 58% వృద్ధితో 14,062 యూనిట్లకు చేరుకుంది.

కోల్‌కతాలో మాత్రం 10% క్షీణతతో 12,909 యూనిట్లకు పడిపోయింది.

నివాస గృహాల విభాగంలోనే కాదు, కార్యాలయాల విభాగంలోనూ 2022లో బలమైన డిమాండ్‌, అమ్మకాల్లో వృద్ధి కనిపించిందన నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది.

బలమైన ఆఫీస్ స్పేస్ డిమాండ్

2022లో, 14.5 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్‌తో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా, 8.9 మిలియన్ చదరపు అడుగులను NCR లీజుకు తీసుకుంది.

2022లో, హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌లో కమర్షియల్‌ స్పేస్‌ లీజింగ్‌ 12% పెరిగిందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదికలో వెల్లడైంది. మొత్తం 67 లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలాన్ని వ్యాపార సంస్థలు, కార్యాలయాలు లీజుకు తీసుకున్నాయి. ఈ విభాగంలో, 8 ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లోని కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌లో ప్రధాన పాత్ర ఐటీ కంపెనీలది. ఆఫీస్‌ స్పేస్‌ కోసం ఐటీ కంపెనీల నుంచి ఎక్కువ డిమాండ్‌ కనిపిస్తోంది. హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, మణికొండ, కూకట్‌పల్లి, రాయదుర్గం ప్రాంతాల్లో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లో చదరపు అడుగుకు సగటు అద్దె రూ. 65గా ఉంది, 2021తో పోలిస్తే 6% పెరిగింది.

హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారానికి ఐటీ రంగమే మూల స్తంభమని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా హైదరాబాద్‌ బ్రాంచ్‌ డైరెక్టర్‌ శామ్సన్‌ ఆర్థర్‌ చెప్పారు.

గత దశాబ్ద కాలంలో తొలిసారిగా అన్ని ప్రధాన రియల్ ఎస్టేట్ విభాగాల్లో ఏకకాలంలో వృద్ధి కనిపించిందని బైజల్ వెల్లడించారు. ఆఫీస్, రెసిడెన్షియల్, వేర్‌హౌసింగ్, రిటైల్ అన్నీ 2022లో గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయని ఆయన తెలిపారు. దేశీయ ఆర్థిక వృద్ధి కొనసాగడం వల్ల కొత్త సంవత్సరంలో స్థిరాస్తి వ్యాపార వృద్ధి వేగం ఎక్కువగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Embed widget