అన్వేషించండి

Banks Meeting: ప్రభుత్వ & ప్రైవేట్‌ బ్యాంకులకు కేంద్రం పిలుపు, కీలక స్కీమ్‌ కొనసాగింపుపై చర్చ!

ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా, 2020 మే నెలలో ECLGS ని ప్రకటించింది.

Banks Meeting: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి పిలుపు వచ్చింది.  ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, దేశంలోని నాలుగు అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు (Kotak Mahindra Bank) కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల (ఫిబ్రవరి‍) 22వ తేదీన ‍‌(బుధవారం), కేంద్ర ఆర్థిక శాఖతో ఈ బ్యాంకుల అత్యున్నత స్థాయి అధికారులు సమావేశం అవుతారు. దేశంలో అమలవుతున్న ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్‌పై (Emergency Credit Line Guarantee Scheme -ECLGS) సమీక్షించేందుకు ఈ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. 

ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ అంటే ఏంటి?                   
కరోనా లాక్‌డౌన్ల సమయంలో వ్యాపారాలు జరక్క నష్టపోయిన పారిశ్రామికవేత్తలకు సహాయం చేయడానికి ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా, 2020 మే నెలలో ECLGS ని ప్రకటించింది. ఆ సంవత్సరం మార్చిలో ప్రభుత్వం ప్రకటించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు) ప్రభావితమైనందున, ఆయా పరిశ్రమలకు సహాయం చేయడం లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రుణం తీసుకున్న పారిశ్రామికవేత్తలు తర్వాతి కాలంలో రుణాలు తిరిగి చెల్లించకపోతే బ్యాంకులు నష్టపోకుండా, కేంద్ర ప్రభుత్వమే 100% గ్యారంటీ కూడా ఇచ్చింది.

31 మార్చి 2023తో ముగియనున్న స్కీమ్ గడువు                
పథకం ప్రకటన సమయంలో ECLGS పరిమితి రూ. 3 లక్షల కోట్లు కాగా... తర్వాతి కాలంలో దానిని రూ. 4.5 లక్షల కోట్లకు పెంచారు. తాజాగా, 2022-23 కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులోనూ దీనిపై ప్రకటన చేశారు. 2022-23 కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించిన సమయంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) మార్చి 31, 2023 వరకు పొడిగించడం జరుగుతుందని ప్రకటించారు. దాని గ్యారెంటీ కవరేజ్‌ పరిమితిని రూ. 4.5 లక్షల కోట్లకు కోట్ల నుంచి రూ. 5 లక్షల కోట్లకు పెంచుతామని ప్రకటించారు. 130 లక్షలకు పైగా MSMEలకు ECLGS కింద అవసరమైన & అదనపు రుణాలు అందించామని ఆర్థిక మంత్రి తెలిపారు. మహమ్మారి ప్రతికూల ప్రభావం నుంచి ఉపశమనం పొందడానికి ఇది వారికి సహాయపడిందని చెప్పారు.

మార్చి 31, 2023 తర్వాత పథకాన్ని పొడిగించడంపై చర్చ                
ఈ నేపథ్యంలో, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం గడువు 31 మార్చి 2023తో ముగుస్తుంది. మార్చి 31, 2023 తర్వాత కూడా  ECLGS ను పొడిగించడంపై బ్యాంకుల సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు మరికొన్ని పథకాలపైనా సమీక్షలు జరగవచ్చు. ఈ సమావేశానికి బ్యాంకింగ్ సెక్రటరీ వివేక్ జోషి అధ్యక్షత వహిస్తారు.    

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget