అన్వేషించండి

Olectra Greentech: లాభాల్లో ఈవీ బస్‌ల తయారీ సంస్థ ఒలెక్ట్రా, Q3 ఫలితాల ప్రకటన

Electric Buses in Hyderabad: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికంలో  ఓలెక్ట్రా ఆదాయం 33 శాతం పెరిగి 342.4 కోట్లకు చేరింది.

Olectra Greentech Limited: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (OGL) ఈ ఆర్ధిక సంవత్సరం డిసెంబర్ 31, 2023తో ముగిసిన మూడో త్రైమాసికానికి తొమ్మిది నెలల ఏకీకృత ఆర్థిక ఫలితాలను సోమవారం ప్రకటించింది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో డైరెక్టర్ల బోర్డు అధికారికంగా ఫలితాలను ఆమోదించింది. గత ఏడాది ఇదే సమయంలో 142 బస్సులను సరఫరా చేయగా ఈ ఏడాది వాటి సంఖ్య 178 కి చేరింది. 

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికంలో  ఓలెక్ట్రా ఆదాయం 33 శాతం పెరిగి 342.4 కోట్లకు చేరింది.  బస్సుల సరఫరా సంఖ్య పెరగటంతో  ఈ గణనీయమైన ఆదాయ అభివృద్ధి నమోదు అయిందని కంపెనీ తెలిపింది. కంపెనీ ఇప్పటి వరకు 1,615 ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేయగా 8,088 బస్సుల ఆర్డర్ సంస్థ వద్ద ఉంది. వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 56.10 కోట్లుగా ఉంది. గత సంవత్సరం కంటే ఇది 52 శాతం పెరుగుదలను నమోదు చేసింది. పన్నుకు ముందు లాభం రూ. 33.84 కోట్లకు పెరిగింది, గత ఆర్థిక సంవత్సరం రూ. 20.46 కోట్లతో పోలిస్తే ఇది 65% పెరుగుదలగా నమోదు అయింది. పన్ను తర్వాత లాభం  రూ. 27.11 కోట్లుగా  నమోదు అయింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 15.30 కోట్లతో పోలిస్తే ఇది 77 శాతం పెరిగింది. డిసెంబరు 31, 2023తో ముగిసిన తొమ్మిది నెలలకు కంపెనీ ప్రతి షేరుకు రూ.7.69 ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే సమయానికి రూ.4.70గా ఉంది.

డిసెంబర్ 31 2023 నాటికి 9 నెలల పనితీరు హైలైట్‌లు

 2023-24 ఆర్ధిక సంవత్సరం 9 నెలల ఓలెక్ట్రా ఆదాయం రూ.865.33 కోట్లు, ఇది గత ఏడాది కంటే 21% పెరిగింది. కంపెనీ యొక్క EBITDA 9 నెలల్లో రూ.142.67 కోట్లకు చేరుకుంది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే గణనీయమైన 40 శాతం పెరుగుదలను సూచిస్తుంది. పన్నుల చెల్లింపునకు ముందు లాభం రూ.85.67 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం రూ.54.38 కోట్లతో పోలిస్తే ఇది 58 శాతం పెరుగుదల నమోదైందని కంపెనీ తెలిపింది. పన్నుల చెల్లింపు తరువాత లాభం గత ఆర్థిక సంవత్సరం రూ. 39.40 కోట్లతో పోలిస్తే 62% పెరిగి రూ. 63.76 కోట్లుగా ఉంది.

ఫలితాలపై  ఓ జి ఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె వీ. ప్రదీప్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి 9 నెలల మా ఏకీకృత ఆదాయంలో బలమైన వృద్ధిని నివేదించడం మాకు సంతోషంగా ఉంది. మా బస్సుల ఉత్పత్తి సామర్థ్యాన్ని, మా సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి సారిస్తాం. మాకు బలమైన ఆర్డర్ బుక్ కూడా ఉంది. 150 ఎకరాల విస్తీర్ణంలో సీతారాంపూర్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు   సాగుతున్నాయి. వచ్చే నెల నుంచి ఈ ప్రాంగణం నుంచి పాక్షిక ఉత్పత్తిని ప్రారంభిస్తున్నాము. ఈ ఫ్యాక్టరీతో మా ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరుగుతుంద’’ని ఆయన తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Reaction: కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?

వీడియోలు

Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం
Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Reaction: కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
Chandrababu in Tamilnadu: చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
Pawan Kalyan Kotappakonda Visit: కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
Embed widget