By: ABP Desam | Updated at : 28 Mar 2023 04:13 PM (IST)
Edited By: Arunmali
పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు
PAN-Aadhaar Link Deadline Extended: పాన్ కార్డ్హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం మరో ఊరట ప్రకటించింది. పాన్-ఆధార్ నంబర్ అనుసంధానం గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (CBDT) ప్రకటించింది, 2023 జూన్ 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది.
పాన్-ఆధార్ సంఖ్య అనుసంధానం గడువు పెంపుపై CBDT ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది. పన్ను చెల్లింపుదార్లకు ఉపశమనం కలిగించడానికి ఈ డెడ్లైన్ను (PAN-Aadhaar Link Deadline) 2023 మార్చి 31వ తేదీ నుంచి 2023 జూన్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడించింది.
In order to provide some more time to the taxpayers, the date for linking PAN & Aadhaar has been extended to 30th June, 2023, whereby persons can intimate their Aadhaar to the prescribed authority for PAN-Aadhaar linking without facing repercussions.
— Income Tax India (@IncomeTaxIndia) March 28, 2023
(1/2) pic.twitter.com/EE9VEamJKh
"ఆదాయపు పన్ను చట్టం -1961లోని నిబంధనల ప్రకారం, జులై 1, 2017 నాటికి పాన్ పొంది, ఆధార్ నంబర్ను పొందే అర్హత ఉన్న ఎవరైనా నిర్ణీత రుసుము చెల్లించి మార్చి 31, 2023లోపు ఆధార్ నంబర్ను ఆదాయ పన్ను సంస్థతో పంచుకోవాలి. ఈలోగా పాన్-ఆధార్ అనుసంధానం పూర్తి చేయకపోతే ఏప్రిల్ 1, 2023 నుంచి పన్ను చెల్లింపుదార్లు సంబంధిత చర్యకు బాధ్యతవుతారు, మరింత జరిమానా చెల్లించవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ గడువును 30 జూన్ 2023 వరకు పొడిగించడం జరిగింది. కొత్త గడువు వరకు లోగా పాన్ కార్డ్హోల్డర్ తన ఆధార్ను లింక్ చేయకపోతే, సంబంధిత వ్యక్తికి చెందిన పాన్ కార్డ్ నిష్క్రియంగా (నాన్-ఆపరేటివ్) మారుతుంది. తదనంతర పరిణామాల భారాన్ని అతను భరించవలసి ఉంటుంది" - CBDT
లింక్ పూర్తి కాకపోతే రిఫండ్ రాదు
కొత్త గడువు లోగా కూడా పాన్-ఆధార్ లింక్ చేయని పన్ను చెల్లింపుదార్లకు రిఫండ్ రాదు. PAN పని చేయని కాలానికి రిఫండ్పై వడ్డీ చెల్లించరు. అటువంటి పన్ను చెల్లింపుదార్ల నుంచి ఎక్కువ మొత్తంలో TDS, TCS వసూలు చేస్తారు.
పాన్తో ఆధార్ను లింక్ చేసి, రూ. 1,000 చెల్లించిన తర్వాత, 30 రోజుల్లో పాన్ మళ్లీ క్రియాశీలంగా మారుతుంది.
పాన్-ఆధార్ లింకేజ్ నుంచి వీళ్లకు మినహాయింపు
పాన్-ఆధార్ లింక్ నుంచి మినహాయింపు పొందిన వ్యక్తులు, వర్గాలపై ఇటువంటి చర్యలు ఉండవు. నిర్దిష్ట రాష్ట్రాల్లో నివసించే వ్యక్తులు, చట్ట ప్రకారం నాన్ రెసిడెంట్లు. భారతీయ పౌరులు కాని వాళ్లు, గత సంవత్సరం నాటికి 80 ఏళ్లు పైబడిన వాళ్లు మినహాయింపు వర్గంలోకి వస్తారు.
ఇప్పటి వరకు 51 కోట్ల పాన్లను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar లింక్ ద్వారా పాన్తో ఆధార్ అనుసంధానించవచ్చు.
Cryptocurrency Prices: ఆదివారం లాభాల్లోనే! బిట్కాయిన్ @రూ.22.43 లక్షలు
IT Scrutiny Notice: ఇన్కమ్ టాక్స్ నోటీసులకు స్పందించడం లేదా! కొత్త గైడ్లైన్స్తో పరేషాన్!
Germany Economic Recession: రెసెషన్లో జర్మనీ - భారత్కు ఎంత నష్టం?
Tata Punch vs Hyundai Exter: రూ. 10 లక్షల్లోపు మంచి బడ్జెట్ కార్లు - ఏది బెస్టో తెలుసా?
Cryptocurrency Prices: మిక్స్డ్ నోట్లో క్రిప్టోలు - బిట్కాయిన్కు మాత్రం ప్రాఫిట్!
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!