అన్వేషించండి

Economic Survey 2023: రైతులకు మోదీ సర్కార్‌ చేసిందేంటి! వ్యవసాయానికి మద్దతు ధరల పవర్‌!

Economic Survey Highlights: దేశంలో వ్యవసాయం వృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆర్థిక సర్వే తెలిపింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో వ్యవసాయం, అనుబంధ రంగాలు మెరుగైన ప్రదర్శన చేశాయని వెల్లడించింది.

Economic Survey Highlights:

దేశంలో వ్యవసాయం వృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆర్థిక సర్వే తెలిపింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో వ్యవసాయం, అనుబంధ రంగాలు మెరుగైన ప్రదర్శన చేశాయని వెల్లడించింది.

ఆరేళ్లుగా వ్యవసాయ రంగం 4.6 శాతం వార్షిక వృద్ధిరేటుతో దూసుకెళ్తోందని ఆర్థిక సర్వే పేర్కొంది. కనీస మద్దతు ధర (MSP) పెంపు, వ్యవసాయ రుణాలు, ఆదాయ వృద్ధి పథకాలు, వ్యవసాయ బీమా వంటివి ఇందుకు దోహదం చేశాయని వివరించింది.

భారీగా మద్దతు ధరల పెంపు

ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో కొన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను పెంచింది. 22 ఖరీఫ్‌, రబీ పంటలు, ఇతర వాణిజ్య పంటలకు 50 శాతం కనీస మద్దతు ధరలను పెంచిందని ఆర్థిక సర్వే తెలిపింది. 2018-19 నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న సగటు వ్యవసాయ ఖర్చుల ఆధారంగా దీనిని అమలు చేశారు. పెరుగుతున్న ఆహార అలవాట్లను దృష్టిలో ఉంచుకొని స్వయం సమృద్ధి సాధించేందుకు పప్పులు, నూనె గింజల కనీస మద్దతు ధరలను పెంచింది.

ఆర్థిక సర్వేలో వ్యవసాయ రంగంపై ప్రధాన అంశాలు

  • 2020-21లో వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు 9.3 శాతానికి చేరాయి.
  • 2020-21లో వ్యవసాయ ఎగుమతులు జీవన కాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. వీటి విలువ 50.2 బిలియన్‌ డాలర్లు.
  • 2022-23 ఏప్రిల్‌-జులైలో పీఎం కిసాన్‌ కింద 11.3 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు.
  • 2021-22లో వ్యవసాయ రంగంలో వ్యవస్థాగత రుణాలు 18.6 లక్షల కోట్లకు పెరిగాయి.
  • 2021-22లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 315.7 మిలియన్‌ టన్నులుగా నమోదైంది.
  • 2023 ఏడాదిలో జాతీయ ఆహార భద్రత చట్టం కింద 81.4 కోట్ల మంది ఉచితంగా ఆహార ధాన్యాలు పొందుతారు.
  • పంట కోతల తర్వాత రైతులకు భరోసాగా వ్యవసాయ మౌలిక నిధుల కింద రూ.13,681 కోట్లు విడుదల చేశారు.
  • జాతీయ వ్యవసాయ మార్కెట్లు (e-NAM) పరిధిలో 1.74 కోట్ల మంది రైతులు, 2.39 లక్షల మంది ట్రేడర్లు ఆన్‌లైన్‌, పారదర్శక బిడ్డింగ్‌ వ్యవస్థలో పాల్గొంటున్నారు.
  • పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన (PKVY) కింద, రైతు ఉత్పత్తుల సంస్థల ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రమోట్‌ చేస్తున్నారు.
  • అంతర్జాతీయ చిరుధాన్యాల ఏడాది సందర్భంగా చిరుధాన్యాల ఉపయోగాన్ని భారత్‌ ప్రచారం చేస్తోంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంటులో ఆర్థిక సర్వే (2022-23)ను ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం తర్వాత నివేదికను విడుదల చేశారు. స్థూల ఆర్థిక సవాళ్ల వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 6-6.8 శాతంగా ఉండొచ్చని సర్వే అంచనా వేసిందన్నారు. మూడేళ్లలో ఇదే కనిష్ఠమని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉందని సర్వే తెలిపింది. ఇది ప్రైవేటు వినియోగాన్ని తగ్గించేంత ఎక్కువ కాదని అలాగే పెట్టుబడులను బలహీనపరిచేంత తక్కువ కాదని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద దేశం భారత్‌ మాత్రమేనని వెల్లడించింది. కొనుగోలు శక్తిలో (PPP) ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని తెలిపింది. మారకం రేటు ప్రకారం ఐదో అతిపెద్ద వ్యవస్థగా పేర్కొంది.

Also Read: వడ్డీరేట్లపై ఆర్థిక సర్వే హెచ్చరిక - ఇంకా పెంచాల్సిందేనంటూ సిగ్నల్‌!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Embed widget