అన్వేషించండి

Economic Survey 2023: రైతులకు మోదీ సర్కార్‌ చేసిందేంటి! వ్యవసాయానికి మద్దతు ధరల పవర్‌!

Economic Survey Highlights: దేశంలో వ్యవసాయం వృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆర్థిక సర్వే తెలిపింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో వ్యవసాయం, అనుబంధ రంగాలు మెరుగైన ప్రదర్శన చేశాయని వెల్లడించింది.

Economic Survey Highlights:

దేశంలో వ్యవసాయం వృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆర్థిక సర్వే తెలిపింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో వ్యవసాయం, అనుబంధ రంగాలు మెరుగైన ప్రదర్శన చేశాయని వెల్లడించింది.

ఆరేళ్లుగా వ్యవసాయ రంగం 4.6 శాతం వార్షిక వృద్ధిరేటుతో దూసుకెళ్తోందని ఆర్థిక సర్వే పేర్కొంది. కనీస మద్దతు ధర (MSP) పెంపు, వ్యవసాయ రుణాలు, ఆదాయ వృద్ధి పథకాలు, వ్యవసాయ బీమా వంటివి ఇందుకు దోహదం చేశాయని వివరించింది.

భారీగా మద్దతు ధరల పెంపు

ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో కొన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను పెంచింది. 22 ఖరీఫ్‌, రబీ పంటలు, ఇతర వాణిజ్య పంటలకు 50 శాతం కనీస మద్దతు ధరలను పెంచిందని ఆర్థిక సర్వే తెలిపింది. 2018-19 నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న సగటు వ్యవసాయ ఖర్చుల ఆధారంగా దీనిని అమలు చేశారు. పెరుగుతున్న ఆహార అలవాట్లను దృష్టిలో ఉంచుకొని స్వయం సమృద్ధి సాధించేందుకు పప్పులు, నూనె గింజల కనీస మద్దతు ధరలను పెంచింది.

ఆర్థిక సర్వేలో వ్యవసాయ రంగంపై ప్రధాన అంశాలు

  • 2020-21లో వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు 9.3 శాతానికి చేరాయి.
  • 2020-21లో వ్యవసాయ ఎగుమతులు జీవన కాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. వీటి విలువ 50.2 బిలియన్‌ డాలర్లు.
  • 2022-23 ఏప్రిల్‌-జులైలో పీఎం కిసాన్‌ కింద 11.3 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు.
  • 2021-22లో వ్యవసాయ రంగంలో వ్యవస్థాగత రుణాలు 18.6 లక్షల కోట్లకు పెరిగాయి.
  • 2021-22లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 315.7 మిలియన్‌ టన్నులుగా నమోదైంది.
  • 2023 ఏడాదిలో జాతీయ ఆహార భద్రత చట్టం కింద 81.4 కోట్ల మంది ఉచితంగా ఆహార ధాన్యాలు పొందుతారు.
  • పంట కోతల తర్వాత రైతులకు భరోసాగా వ్యవసాయ మౌలిక నిధుల కింద రూ.13,681 కోట్లు విడుదల చేశారు.
  • జాతీయ వ్యవసాయ మార్కెట్లు (e-NAM) పరిధిలో 1.74 కోట్ల మంది రైతులు, 2.39 లక్షల మంది ట్రేడర్లు ఆన్‌లైన్‌, పారదర్శక బిడ్డింగ్‌ వ్యవస్థలో పాల్గొంటున్నారు.
  • పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన (PKVY) కింద, రైతు ఉత్పత్తుల సంస్థల ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రమోట్‌ చేస్తున్నారు.
  • అంతర్జాతీయ చిరుధాన్యాల ఏడాది సందర్భంగా చిరుధాన్యాల ఉపయోగాన్ని భారత్‌ ప్రచారం చేస్తోంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంటులో ఆర్థిక సర్వే (2022-23)ను ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం తర్వాత నివేదికను విడుదల చేశారు. స్థూల ఆర్థిక సవాళ్ల వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 6-6.8 శాతంగా ఉండొచ్చని సర్వే అంచనా వేసిందన్నారు. మూడేళ్లలో ఇదే కనిష్ఠమని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉందని సర్వే తెలిపింది. ఇది ప్రైవేటు వినియోగాన్ని తగ్గించేంత ఎక్కువ కాదని అలాగే పెట్టుబడులను బలహీనపరిచేంత తక్కువ కాదని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద దేశం భారత్‌ మాత్రమేనని వెల్లడించింది. కొనుగోలు శక్తిలో (PPP) ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని తెలిపింది. మారకం రేటు ప్రకారం ఐదో అతిపెద్ద వ్యవస్థగా పేర్కొంది.

Also Read: వడ్డీరేట్లపై ఆర్థిక సర్వే హెచ్చరిక - ఇంకా పెంచాల్సిందేనంటూ సిగ్నల్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: ఆర్టీసీ ప్రయాణికులకు సమ్మర్‌ ఎఫెక్ట్‌... మధ్యాహ్నం వేళ సిటీ బస్సులకు విశ్రాంతి
ఆర్టీసీ ప్రయాణికులకు సమ్మర్‌ ఎఫెక్ట్‌... మధ్యాహ్నం వేళ సిటీ బస్సులకు విశ్రాంతి
TTD News: జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
Gaami OTT Records: ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న 'గామి' - ZEE5లో విడుదలైన 72 గంటల్లోనే...
ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న 'గామి' - ZEE5లో విడుదలైన 72 గంటల్లోనే...
Rs 150 Flight Ticket: నిజమండీ బాబూ, 150 రూపాయలకే ఫ్లైట్‌ టిక్కెట్‌, బైక్‌ జర్నీ కన్నా చౌక
నిజమండీ బాబూ, 150 రూపాయలకే ఫ్లైట్‌ టిక్కెట్‌, బైక్‌ జర్నీ కన్నా చౌక
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Vijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!Dinesh Karthik Hitting vs SRH IPL 2024: ప్రపంచకప్ రేసులోకి ఉసేన్ బోల్ట్ లా వచ్చిన దినేష్ కార్తీక్RCB vs SRH IPL 2024: మీరేంటో మీ విధానాలేంటో.. ఆర్సీబీ స్ట్రాటజీలపై మరోసారి విపరీతంగా ట్రోల్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: ఆర్టీసీ ప్రయాణికులకు సమ్మర్‌ ఎఫెక్ట్‌... మధ్యాహ్నం వేళ సిటీ బస్సులకు విశ్రాంతి
ఆర్టీసీ ప్రయాణికులకు సమ్మర్‌ ఎఫెక్ట్‌... మధ్యాహ్నం వేళ సిటీ బస్సులకు విశ్రాంతి
TTD News: జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
Gaami OTT Records: ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న 'గామి' - ZEE5లో విడుదలైన 72 గంటల్లోనే...
ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న 'గామి' - ZEE5లో విడుదలైన 72 గంటల్లోనే...
Rs 150 Flight Ticket: నిజమండీ బాబూ, 150 రూపాయలకే ఫ్లైట్‌ టిక్కెట్‌, బైక్‌ జర్నీ కన్నా చౌక
నిజమండీ బాబూ, 150 రూపాయలకే ఫ్లైట్‌ టిక్కెట్‌, బైక్‌ జర్నీ కన్నా చౌక
Paris Olympics: నేటి నుంచే విశ్వ క్రీడల కౌంట్‌డౌన్‌ , ఒలింపియాలో కీలక ఘట్టం
నేటి నుంచే విశ్వ క్రీడల కౌంట్‌డౌన్‌ , ఒలింపియాలో కీలక ఘట్టం
Revanth Reddy: మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
RCB vs SRH Highlights : మీరేంటో మీ విధానాలేంటో.. ఆర్సీబీ స్ట్రాటజీలపై మరోసారి విపరీతంగా ట్రోల్స్
మీరేంటో మీ విధానాలేంటో.. ఆర్సీబీ స్ట్రాటజీలపై మరోసారి విపరీతంగా ట్రోల్స్
Joint Venture: కొత్త బిజినెస్‌లోకి జియో ఫిన్‌, ఇండస్ట్రీని షేక్‌ చేస్తుందట!
కొత్త బిజినెస్‌లోకి జియో ఫిన్‌, ఇండస్ట్రీని షేక్‌ చేస్తుందట!
Embed widget