అన్వేషించండి

Economic Survey 2023: రైతులకు మోదీ సర్కార్‌ చేసిందేంటి! వ్యవసాయానికి మద్దతు ధరల పవర్‌!

Economic Survey Highlights: దేశంలో వ్యవసాయం వృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆర్థిక సర్వే తెలిపింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో వ్యవసాయం, అనుబంధ రంగాలు మెరుగైన ప్రదర్శన చేశాయని వెల్లడించింది.

Economic Survey Highlights:

దేశంలో వ్యవసాయం వృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆర్థిక సర్వే తెలిపింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో వ్యవసాయం, అనుబంధ రంగాలు మెరుగైన ప్రదర్శన చేశాయని వెల్లడించింది.

ఆరేళ్లుగా వ్యవసాయ రంగం 4.6 శాతం వార్షిక వృద్ధిరేటుతో దూసుకెళ్తోందని ఆర్థిక సర్వే పేర్కొంది. కనీస మద్దతు ధర (MSP) పెంపు, వ్యవసాయ రుణాలు, ఆదాయ వృద్ధి పథకాలు, వ్యవసాయ బీమా వంటివి ఇందుకు దోహదం చేశాయని వివరించింది.

భారీగా మద్దతు ధరల పెంపు

ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో కొన్ని పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను పెంచింది. 22 ఖరీఫ్‌, రబీ పంటలు, ఇతర వాణిజ్య పంటలకు 50 శాతం కనీస మద్దతు ధరలను పెంచిందని ఆర్థిక సర్వే తెలిపింది. 2018-19 నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న సగటు వ్యవసాయ ఖర్చుల ఆధారంగా దీనిని అమలు చేశారు. పెరుగుతున్న ఆహార అలవాట్లను దృష్టిలో ఉంచుకొని స్వయం సమృద్ధి సాధించేందుకు పప్పులు, నూనె గింజల కనీస మద్దతు ధరలను పెంచింది.

ఆర్థిక సర్వేలో వ్యవసాయ రంగంపై ప్రధాన అంశాలు

  • 2020-21లో వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు 9.3 శాతానికి చేరాయి.
  • 2020-21లో వ్యవసాయ ఎగుమతులు జీవన కాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. వీటి విలువ 50.2 బిలియన్‌ డాలర్లు.
  • 2022-23 ఏప్రిల్‌-జులైలో పీఎం కిసాన్‌ కింద 11.3 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు.
  • 2021-22లో వ్యవసాయ రంగంలో వ్యవస్థాగత రుణాలు 18.6 లక్షల కోట్లకు పెరిగాయి.
  • 2021-22లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 315.7 మిలియన్‌ టన్నులుగా నమోదైంది.
  • 2023 ఏడాదిలో జాతీయ ఆహార భద్రత చట్టం కింద 81.4 కోట్ల మంది ఉచితంగా ఆహార ధాన్యాలు పొందుతారు.
  • పంట కోతల తర్వాత రైతులకు భరోసాగా వ్యవసాయ మౌలిక నిధుల కింద రూ.13,681 కోట్లు విడుదల చేశారు.
  • జాతీయ వ్యవసాయ మార్కెట్లు (e-NAM) పరిధిలో 1.74 కోట్ల మంది రైతులు, 2.39 లక్షల మంది ట్రేడర్లు ఆన్‌లైన్‌, పారదర్శక బిడ్డింగ్‌ వ్యవస్థలో పాల్గొంటున్నారు.
  • పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన (PKVY) కింద, రైతు ఉత్పత్తుల సంస్థల ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రమోట్‌ చేస్తున్నారు.
  • అంతర్జాతీయ చిరుధాన్యాల ఏడాది సందర్భంగా చిరుధాన్యాల ఉపయోగాన్ని భారత్‌ ప్రచారం చేస్తోంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంటులో ఆర్థిక సర్వే (2022-23)ను ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం తర్వాత నివేదికను విడుదల చేశారు. స్థూల ఆర్థిక సవాళ్ల వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 6-6.8 శాతంగా ఉండొచ్చని సర్వే అంచనా వేసిందన్నారు. మూడేళ్లలో ఇదే కనిష్ఠమని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉందని సర్వే తెలిపింది. ఇది ప్రైవేటు వినియోగాన్ని తగ్గించేంత ఎక్కువ కాదని అలాగే పెట్టుబడులను బలహీనపరిచేంత తక్కువ కాదని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద దేశం భారత్‌ మాత్రమేనని వెల్లడించింది. కొనుగోలు శక్తిలో (PPP) ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని తెలిపింది. మారకం రేటు ప్రకారం ఐదో అతిపెద్ద వ్యవస్థగా పేర్కొంది.

Also Read: వడ్డీరేట్లపై ఆర్థిక సర్వే హెచ్చరిక - ఇంకా పెంచాల్సిందేనంటూ సిగ్నల్‌!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget