అన్వేషించండి

YS Jagan Meets Amaravati Farmers: జగన్ తో అమరావతి రైతుల సంచలన భేటీ - సమస్యలు చెప్పుకున్న రైతులు .. మీకు నేనున్నానంటూ జగన్ హామీ!

Jagan Amaravati Meeting: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు సమావేశం అయ్యారు. వారి సమస్యల పరిష్కారం కోసం అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Amaravati Farmers Demands To Jagan Mohan Reddy:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అరుదైన, అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు సమావేశం అయ్యారు.   అమరావతి రాజధాని విషయంలో ఇరుపక్షాల మధ్య తీవ్రమైన రాజకీయ, చట్టపరమైన పోరాటం నడవడం, తాజాగా మావిగన్ రాజధానిని ప్రతిపాదించిన సమయంలో  ఈ తాజా భేటీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.    

తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వచ్చిన అమరావతి జేఏసీ, రాజధాని ప్రాంత రైతు ప్రతినిధులు ఆయనతో సుదీర్ఘంగా ముచ్చటించారు. గతంలో  మూడు రాజధానుల నిర్ణయం వల్ల తమ భూములు, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారాయని రైతులు ఈ సందర్భంగా జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే నాటి నిర్ణయం వెనుక ఏ ప్రాంతానికీ అన్యాయం చేయాలనే ఉద్దేశం తనకు లేదని, అన్ని ప్రాంతాల సమాంతర అభివృద్ధే తన లక్ష్యమని జగన్ రైతులకు వివరించారు. గతంలో జరిగిన రాజకీయ పరిణామాలు, చేదు అనుభవాలను పక్కన పెట్టి, రాష్ట్ర హితం కోసం కలిసి ముందడుగు వేయాల్సిన సమయం వచ్చిందని జగన్ తెలిపారు. 

రైతులు జగన్ తో ఏమన్నారు? 

ఈ సమావేశంలో రైతులు తమకు ఎదురవుతున్న ప్రస్తుత క్షేత్రస్థాయి ఇబ్బందులను మాజీ సీఎంకు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ.. అమరావతిలో పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదని, భూములు ఇచ్చిన రైతులకు రావాల్సిన వార్షిక కౌలు, ప్లాట్ల అభివృద్ధి వంటి అంశాల్లో ఇంకా జాప్యం జరుగుతోందని వారు చెప్పినట్లుగా తెలుస్తోంది.  గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు జరిగిన మేలును గుర్తు చేసుకున్న వారు.. వైఎస్సార్ వారసుడిగా జగన్ కూడా తమకు అండగా నిలబడాలని, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ లోపల, బయట అమరావతి రైతుల హక్కుల కోసం పోరాడాలని కోరారు. పలువురు రైతులు భూసమీకరణలో ఇంకా  భూములు ఇవ్వలేదు. ఆ భూముల్ని భూసమీకరణ ద్వారా తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ సమస్యలపైనా జగన్ తో చర్చించారు. 

  అండగా ఉంటానని జగన్ హామీ

రైతుల విజ్ఞప్తులపై వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. అమరావతి కోసం భూములిచ్చిన ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగనివ్వనని ఆయన స్పష్టం చేశారు.  మీరు రాష్ట్రం కోసం త్యాగం చేసి భూములు ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ప్రతిపక్ష పార్టీగా మేము నిరంతరం ఒత్తిడి తెస్తాం  అని జగన్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అమరావతిలో భారీగా అవినీతి జరుగుతోందని... ఆ అవినీతికే వ్యతిరేకమని అమరావతి కాదన్నారు. 

రాజకీయ సమీకరణాల్లో మార్పులు? 

అమరావతి అంటేనే వైఎస్ఆర్‌సీపీకి వ్యతిరేకం అనే ముద్రను చెరిపేసేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాజధాని రైతులతో జగన్ నేరుగా చర్చలు జరపడం ద్వారా.. భవిష్యత్తులో అమరావతి వేదికగా కొత్త రాజకీయ వ్యూహాలు అమలు చేయబోతున్నారనే సంకేతాలు వెళ్లాయి. కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, అమరావతి అభివృద్ధికి తమ పార్టీ ఎప్పుడూ అడ్డుకాదనే కొత్త లైన్‌ను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఈ భేటీ ద్వారా జరిగిందని  భావిస్తున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Meets Amaravati Farmers: జగన్ తో అమరావతి రైతుల సంచలన భేటీ - సమస్యలు చెప్పుకున్న రైతులు .. మీకు నేనున్నానంటూ జగన్ హామీ!
జగన్ తో అమరావతి రైతుల సంచలన భేటీ - సమస్యలు చెప్పుకున్న రైతులు .. మీకు నేనున్నానంటూ జగన్ హామీ!
Pawan Kalyan Press Meet:
"నా గుండెల్లో తెలంగాణ ఉంది! మీ అయ్య జాగీరా అడ్డుకుంటామని బెదిరించడానికి?" పవన్ సంచలన కామెంట్స్
Pawan Kalyan Press Meet: పవన్ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌కు ముందే హైవోల్టేజ్ డ్రామా! జనసేనానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమేంటీ? 
పవన్ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌కు ముందే హైవోల్టేజ్ డ్రామా! జనసేనానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమేంటీ? 
Kalvakuntla Kavitha Telangana Rakshana Sena: సీఎం కావాలంటే జింఖానా అంత మనసుండాలి.. చంచల్‌గూడ అంత కాదు - టీఆర్ఎస్ కవితకు బీజేపీ విష్ణు కౌంటర్
సీఎం కావాలంటే జింఖానా అంత మనసుండాలి.. చంచల్‌గూడ అంత కాదు - టీఆర్ఎస్ కవితకు బీజేపీ విష్ణు కౌంటర్
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Trisha Krishnan : రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
Tim David Banned: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
Embed widget