అన్వేషించండి

YSR Rythu Bharosa 2022: ఏపీ రైతులకు శుభవార్త, వైఎస్సార్‌ రైతు భరోసా నగదు రూ.5,500 జమ అయ్యేది ఎప్పుడంటే !

YSR Rythu Bharosa Status 2022: ఏపీ ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం వైఎస్సార్ రైతు భరోసా. ప్రతి ఏటా 3 విడతల్లో రూ.13,500ల రైతు భరోసా సాయం అందిస్తున్నారు.

YSR Rythu Bharosa 2022: ఏపీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.5,500 నగదు మే 16వ తేదీన జమ కానుంది. ఏపీ ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్. ప్రతి ఏటా 3 విడతల్లో రూ.13,500ల రైతు భరోసా సాయం అందిస్తుండగా.. వరుసగా నాలుగో ఏడాది మొదటి విడతగా వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ నిధులను సీఎం వైఎస్ జగన్ సోమవారం విడుదల చేయనున్నారు. 

వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ పథకం కింద ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయాన్ని అందిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ మొదటి విడతగా మే నెలలో రూ.7500 ఇవ్వనున్నారు. ఇందులో రూ.5,500లను సోమవారం నాడు ఏలూరు జిల్లా గణపవరంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్‌ నొక్కి  రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అర్హులైన రైతుల జాబితాను రైతు భరోసా కేంద్రాల్లో లిస్ట్ చేశారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడానికి అధికారులు పూర్తి ఏర్పాటు చేశారు. ఈ నెల 31న పీఎం కిసాన్‌ నిధులు మరో 2వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. దీంతో మొత్తంగా మే నెలాఖరు నాటికి 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున దాదాపు రూ.3,758 కోట్లు జమ కానున్నాయి.

దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు ఎస్‌.సి, ఎస్‌.టి, బిసి, మైనార్టీ, కౌలు రైతులు, ఆర్వోఎఫ్‌ఆర్‌(అటవీ), దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతన్నలకు ఏటా రూ.13,500 సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ప్రతి ఏటా దాదాపు దాదాపు 50 లక్షల మంది రైతులకు సుమారు రూ.7 వేల కోట్లు రైతు భరోసా సాయంగా అందిస్తున్నారు. ఇప్పుడు అందిస్తున్న సాయం రూ.3,758 కోట్లతో కలిసి ఈ మూడేళ్లలో రైతన్నలకు ఏపీ ప్రభుత్వం అందించిన మొత్తంలో కేవలం వైఎస్సార్‌ రైతు భరోసా సాయం రూ.23,875 కోట్లు. ఖరీఫ్ సాగు నేపథ్యంలో అంతకుముందుగానే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మొదటి విడత సాయంగా మే నెలలో రైతుల ఖాతాల్లో రూ.7500 జమ చేస్తోంది.

జూన్‌ నెలలో వైయస్సార్‌ ఉచిత పంటల బీమా క్రింద గత ఖరీప్‌ 2021కి సంబంధించి, చెప్పిన విధంగా 2022 ఖరీప్‌ ప్రారంభసమయానికే బీమా పరిహారం కూడా ప్రభత్వం అందించనుంది. మేనిఫెస్టోలో ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లకు రూ.50 వేలు ఇస్తామని హామీ ఇవ్వగా.. ఏటా రూ.13,500 చొప్పున నాలుగేళ్లకు బదులుగా ఏకంగా ఐదేళ్లకు రూ.67,500 అందిస్తోంది. 

గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ పథకాల ద్వారా ఈమూడేళ్లలో రైతులకు ఏపీ ప్రభుత్వం చేకూర్చిన లబ్ధి దాదాపు రూ.1,10,099.21 కోట్లు. వైఎస్సార్ రైతు భరోసా తొలి విడతలో రూ.7500, అక్టోబర్‌లో రూ.4 వేలు, మిగిలిన రూ.2 వేలు జనవరి మాసంలో జమ చేస్తోంది. భూ యజమానులకు మాత్రమే పీఎం కిసాన్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ.6 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.

Also Read: Gadapa Gadapa- Ku Prabhutavam: గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేకు చేదు అనుభవం- ఇచ్చిన హమీ ఏమైందని మహిళ నిలదీత

Also Read: CM Jagan Tour: 17న కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన- విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP DesamRohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP DesamPBKS vs MI Toss Coin in IPL 2024 | కెమెరా మెన్ ఫోకస్ కరో ఫోకస్ కరో అన్నట్లుగా ఐపీఎల్ లో టాస్ లైవ్ షో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Tillu Square OTT: ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Eesha Rebba Birthday : ఈ తెలుగు అందానికి ముప్పై నాలుగు ఏళ్లు.. ఈషా రెబ్బా బర్త్​డే స్పెషల్ ఫోటోలు చూశారా?
ఈ తెలుగు అందానికి ముప్పై నాలుగు ఏళ్లు.. ఈషా రెబ్బా బర్త్​డే స్పెషల్ ఫోటోలు చూశారా?
Tariff: జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
Embed widget