అన్వేషించండి

AP PCC Chief Sharmila : వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం

Andhra Pradesh Politics 2026: వైఎస్, రాజారెడ్డిలు ఫ్యాక్షన్ నేతలంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై షర్మిల ఘాటుగా స్పందించారు. సంజాయిషీ ఇచ్చుకోలేని వారిపై దుష్ప్రచారం చేయడం మంచిది కాదన్నారు.

YS Sharmila on Rajareddy:   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డిల చుట్టూ సాగుతున్న రాజకీయంపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ లోకంలో లేని వ్యక్తులపై, సంజాయిషీ ఇచ్చుకోలేని వారిపై టీడీపీ దుష్ప్రచారం చేయడం వారి రాజకీయ అక్కసును బయటపెడుతోందని ఆమె విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేశారు.

 అప్పుడు ఎందుకు శిక్షించలేదు? 

నిజంగా వైఎస్ రాజారెడ్డి, వైఎస్సార్ అంత దుర్మార్గులే అయితే.. ఆనాడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విచారణ జరపలేదు? ఎందుకు శిక్షించలేదు? మీకు చేతకాలేదా?  అంటూ షర్మిల నేరుగా టీడీపీని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా, చెప్పుకోదగ్గ విజయాలు లేకనే పాత విషయాలను లాగి రాజకీయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ నీచ రాజకీయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజారెడ్డి చరిత్రను వక్రీకరిస్తే సీమ ప్రజలు సహించరు 

వైఎస్ రాజారెడ్డి సీమలో అరాచకాలను ఎదురించి పేదల పక్షాన నిలబడ్డ వ్యక్తి అని షర్మిల గుర్తు చేశారు. 1973లోనే కడప ప్రజల కోసం 70 పడకల ఆసుపత్రి కట్టించి ఉచిత వైద్యం అందించారని, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు కట్టించి పేదలకు విద్యను అందించిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. ఇలాంటి మహానుభావుడి చరిత్రను వక్రీకరిస్తే రాయలసీమ ప్రజలు హర్షించరని హెచ్చరించారు.

 అపర భగీరథుడిపై మచ్చ వేయలేరు 

సంక్షేమం, అభివృద్ధి అనే పదాలకు చిరునామా వైఎస్సార్ అని షర్మిల కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, రుణమాఫీ వంటి పథకాలు వైఎస్సార్‌కే సాధ్యమయ్యాయని, ఆయనను సూర్యుడితో పోల్చారు. బురద జల్లాలని చూసినంత మాత్రాన సూర్యుడి కాంతి తగ్గదు. పోలవరం పనులను 33 శాతం పూర్తి చేసిన అపర భగీరథుడు వైఎస్సార్. కానీ చంద్రబాబుకు రుణమాఫీ గానీ, నిరుద్యోగ భృతి గానీ, మహిళలకు 15 వందలు ఇవ్వడం గానీ చేతకావడం లేదు అని ఎద్దేవా చేశారు.  

 ప్రజల గుండెల్లో వైఎస్సార్ స్థానం శాశ్వతం 

వైఎస్సార్ మరణ వార్త విని 700 మంది గుండెలు పగిలి చనిపోయారని, నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటా పూజ గదిలో ఆయనకు స్థానం ఉందని షర్మిల అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో ఆయన స్థానాన్ని చెరపలేరని స్పష్టం చేశారు. ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి, ఓట్లేసిన ప్రజలకు మేలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆమె హితవు పలికారు.                 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget