అన్వేషించండి

Ys Sharmila: జగన్ ఎందుకు పోరాడలేదు, బీజేపీతో చంద్రబాబు పొత్తు ఎందుకు?: విశాఖలో షర్మిల విమర్శలు

Andhra Pradesh News: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కదలనివ్వమని వైఎస్ షర్మిల అన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంతవరకు పోరాడుతామని తెలిపారు.

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం జగన్ ఎందుకు ఉద్యమం చేయలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై తీర్మానం చేసి జగన్ చేతులు దులిపేసుకున్నారని, గంగవరం పోర్టును అదానీకి అప్పగించారని విమర్శించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పేరుతో విశాఖలో ఏపీ కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో షర్మిల మాట్లాడుతూ.. విశాఖ స్లీట్ ప్లాంట్‌పై కుట్రలు పన్నుతున్నారని, క్రమంగా స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల్లోకి తీసుకెళ్లారని ఆరోపించారు. స్టీల్‌ప్లాంట్‌లో పనిచేసే 30 వేల మంది కార్మికులు ఏం కావాలి? అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ గురించి అధికార, ప్రతిపక్ష నేతలు మాట్లాడరా? అని ప్రశ్నించారు.

'మన రాష్ట్రాన్ని పరిపాలించేది బీజేపీనే. హోదా., పోలవరం, రాజధాని గురించి  ఎవరు అడగరు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతున్నా ఏమీ పట్టించుకోరు. రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేని బీజేపీతో పొత్తు ఎందుకు? బీజేపీతో చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ఏపీకి ఏదైనా ఇచ్చిందా? సిద్దం సభలకు జగన్ రూ.600 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు జగన్ సిద్దమయ్యారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు జగన్ సిద్దమయ్యారు. ఒక ఊరి అభ్యర్థులను మరో ఊరికి మార్చడం ఎప్పుడూ చూడలేదు. అభ్యర్థులను బదిలీ చేయడం వైసీపీలోనే చూస్తున్నాం' అని షర్మిల తెలిపారు.

సంపూర్ణ మద్యనిషేధం అని జగన్ అన్నారని, ఇది ఎక్కడైనా జరిగిందా? అని షర్మిల ప్రశ్నించారు. మన రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం అమ్ముతుందని,  పదేళ్లుగా రాష్ట్రాన్ని ఏ నాయకుడూ పట్టించుకోలేదని అన్నారు. ఏపీకి పదేళ్లపాటు హోదా ఇస్తమని మోదీ మోసం చేశారని,  ప్రత్యేక హోదా డిమాండ్‌తో గతంలో జగన్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా గురించి మోదీని ఏనాడైనా జగన్ గట్టిగా ఏనాడైనా అడిగారా? అని షర్మిల ప్రశ్నించారు. చిన్నాన్నను చంపినవారిని రక్షించాలని అడిగేందుకే ఢిల్లీ వెళ్తున్నారని, ప్రత్యేక హోదా రావాలంటే ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదాపై చేస్తామని రాహుల్ గాంధీ మాటిచ్చారని, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఒప్పుకోదని షర్మిల వ్యాఖ్యానించారు.

'మా ప్రాణాలు అడ్డువేసైనా సరే స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటాం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రియల్ ఎస్టేట్‌గా మార్చాలని చూస్తున్నారు. విశాఖ ఉక్కు కోసం ఎంతోమంది ఉద్యమించారు. విశాఖ ఉక్కు కోసం వైఎస్సార్ ఎంతో కృషి చేశారు. విశాఖ ఉక్కును దాచుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలు. నష్టాలు ఉన్నాయని చెబుతూ దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సిద్దం అంటూ జగన్ బయలుదేరారు. అసలు సిద్దం దేనికి? ఏపీకి రాజధాని అంటే చెప్పలేని పరిస్థితి. పదేళ్లు గడుస్తున్నా పోలవరం పూర్తి కాలేదు. విశాఖ ఉక్కును ఒక్క ఇంచు కూడా కదిలించలేరు' అని షర్మిల తెలిపారు. కాగా షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ విభజన హామీలపై పోరాడుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Chandrababu: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Pawan Kalyan: 'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
Telangana News: భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక   
భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక  
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sobhan Babu House Vlog | చిన నందిగామ లో నటభూషణ్  కట్టిన లంకంత ఇల్లు | ABP DesamKondapochamma Sagar Tragedy | కొండపోచమ్మసాగర్ లో పెను విషాదం | ABP DesamNagoba Jathara Padayathra | ప్రారంభమైన మెస్రం వంశీయుల గంగాజల పాదయాత్ర | ABP DesamPawan Kalyan vs BR Naidu | టీటీడీ ఛైర్మన్ క్షమాపణలు కోరేలా చేసిన డిప్యూటీ సీఎం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Chandrababu: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Pawan Kalyan: 'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
Telangana News: భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక   
భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక  
Sankranti Traffic Jam: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
CM Chandrababu: సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Kondapochamma Sagar Dam: సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం - సాగర్ డ్యామ్‌లో పడి ఐదుగురు యువకుల దుర్మరణం, సెల్ఫీ కోసం ఒకరినొకరు పట్టుకుంటూ..
సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం - సాగర్ డ్యామ్‌లో పడి ఐదుగురు యువకుల దుర్మరణం, సెల్ఫీ కోసం ఒకరినొకరు పట్టుకుంటూ..
Three Gorges Dam in space: అంతరిక్షంలో త్రీ గోర్జెస్ డ్యామ్- మైండ్‌ బ్లోయింగ్‌ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్న చైనా
అంతరిక్షంలో త్రీ గోర్జెస్ డ్యామ్- మైండ్‌ బ్లోయింగ్‌ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్న చైనా
Embed widget