అన్వేషించండి

YS Jagan Comments: హెరిటేజ్ నెయ్యి రేట్లు పెంచుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నం - జగన్ సంచలన ఆరోపణలు 

Tirupati News: హెరిటేజ్ నెయ్యి రేట్లు పెంచుకునేందుకే సీఎం చంద్రబాబు కొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. 2015 -18 మధ్య కాలంలో నందిని బ్రాండ్ ఎందుకు లేదని ప్రశ్నించారు.

YS Jagan Comments On Heritage Company: సీఎం చంద్రబాబు (CM Chandrababu) సంస్థ హెరిటేజ్‌ నెయ్యి రేట్లు పెంచుకునేందుకు కొత్త కొత్త వాదనలు తెరపైకి తీసుకొస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. అందుకే రూ.1,000 ఉన్న నెయ్యి రూ.300కు వస్తుందనే వాదన చేస్తున్నారని అన్నారు. రూ.320కు నెయ్యి ఎలా వస్తుందనే ప్రశ్న ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. '2015 - 19 మధ్య కాలంలో నెయ్యిని కొనుగోలు చేశారు కదా... ఏ రేట్‌కు ప్రొక్యూర్ చేశారు. అదే క్వాలిటీ నెయ్యే కదా. దశాబ్ధాలుగా నెయ్యి క్వాలిటీ అదే. అవే ఆవులు, అవే డెయిరీలు, అవే క్వాలిటీ ఉంటే తీసుకుంటారు లేకుంటే తీసుకోరు. 2015లో రూ.276 పెట్టి నెయ్యి చంద్రబాబు కొనుగోలు చేశారు. 2019 జనవరిలో రూ.324కు కొన్నారు. అలాంటప్పుడు రూ.320లకు కొంటే తప్పేంటీ. ఇప్పుడు కూడా అదే రేట్లతో కొనుగోలు చేసుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు తన హెరిటేజ్‌ లాభపడాలనే ఉద్దేశంతో రేట్లు పెంచుకునేందుకు మాట్లాడుతున్నారు.' అని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. 2015 -18 మధ్య కాలంలో నందిని బ్రాండ్ ఎందుకు లేదని జగన్ ప్రశ్నించారు. నందిని వాళ్లు కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తారు. కొన్నిసార్లు చేశారు. 2019 తర్వాత కూడా అప్పడప్పుడు పార్టిసిపేట్ చేశారని పేర్కొన్నారు.

'మతం పేరుతో రాజకీయాలు దౌర్భాగ్యం'

రాష్ట్రంలో మతం పేరుతో రాజకీయాలు చేయడం దౌర్భాగ్యమని.. మాజీ సీఎంకే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగిలిన వారి పరిస్థితి ఏంటని జగన్ మండిపడ్డారు. గతంలో అనేకసార్లు తాను తిరుమలకు వెళ్లానని.. శ్రీవారి దర్శనం చేసుకున్నాకే తన పాదయాత్ర ప్రారంభించినట్లు చెప్పారు. 'పాదయాత్ర పూర్తయ్యాక కాలి నడకన వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకున్నా. బ్రహ్మోత్సవాల్లో స్వామి వారికి ఐదుసార్లు వస్త్రాలు సమర్పించా. నా కులం, మతం ప్రజలందరికీ తెలుసు. గుడికి వెళ్లే వ్యక్తిని ఏ మతం అని అడగడం సరికాదు. నా మతం మానవత్వమని కావాలంటే డిక్లరేషన్‌లో రాసుకోవాలి.' అని జగన్ సవాల్ చేశారు.

రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోందని.. దేవుని దగ్గరకు వెళ్లే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం తన రాజకీయ జీవితంలో చూడలేదని జగన్ మండిపడ్డారు. తిరుపతి లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు చెప్పేవన్ని అబద్ధాలని రుజువవుతోందని అనిపిస్తోందని.. లడ్డూ విషయంలో అడ్డగోలుగా దొరికిపోయే సరికి టాపిక్ మార్చేందుకే డిక్లరేషన్ అంశం తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా చూపిస్తున్నారని.. ఇది చాలా దారుణమని అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి (Tirupati) లడ్డూలో ఉన్న రుచి వేరే ఏ లడ్డూలో ఉండదని.. ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలుస్తారని చెప్పారు. తక్కువకు ఎవరు కోట్ చేస్తే వాళ్లకు టెండర్ అప్రూవ్ చేస్తారని చెప్పారు. ఇది రొటీన్ ప్రక్రియ అని ఇందులో ప్రభుత్వానికి సంబంధం ఉండదని జగన్ స్పష్టం చేశారు. 

Also Read: YS Jagan: 'తిరుపతి లడ్డూ టేస్ట్ వేరే ఏ లడ్డూలోనూ ఉండదు' - రహస్యమైన రిపోర్టు టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎందుకు రిలీజ్ చేశారని జగన్ సూటి ప్రశ్న

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల

వీడియోలు

Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget