YS Jagan: సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్పై జగన్ అటాక్!
AP Economy: ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. CAG నివేదికను ఉటంకిస్తూ, రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉందని విశ్లేషించారు.

Jagan Criticizes Chandrababu Over Fiscal Stress: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రచురించిన 2025-26 ఆర్థిక సంవత్సర తాత్కాలిక ఖాతాలను విశ్లేషిస్తూ, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్న అభివృద్ధి లెక్కలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని.. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వైపు కూరుకుపోతోందని ఆయన ఆరోపించారు.
జీఎస్డీపీ గారడీ
2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 10.75% వృద్ధి చెందిందని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందని, కానీ ప్రభుత్వ పన్ను ఆదాయం మాత్రం 3.22% తగ్గడం విడ్డూరంగా ఉందని జగన్ విమర్శించారు. సాధారణంగా రాష్ట్రం వృద్ధి పథంలో ఉంటే పెట్టుబడులు, వినియోగం పెరిగి పన్ను వసూళ్లు కూడా పెరుగుతాయని, ఇక్కడ పన్ను ఆదాయం తగ్గడం అంటే ఆర్థిక మందగమనం ఉందనడానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాల్లో 9.60% వృద్ధి చూపి, వాస్తవంలో అది మైనస్ లోకి వెళ్లడం ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోందన్నారు.
రూ. 13,667 కోట్ల నష్టమా?
గత ప్రభుత్వ హయాంలో (2023-24) రాష్ట్ర పన్ను ఆదాయం రూ. 85,922 కోట్లుగా ఉందని జగన్ గుర్తు చేశారు. సాధారణంగా 8% వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకున్నా, ఈ రెండేళ్లలో ఆదాయం రూ. 1,00,219 కోట్లు ఉండాలని.. కానీ ఇప్పుడు కేవలం రూ. 86,552 కోట్లే వసూలైందని గణాంకాలతో వివరించారు. ఈ లెక్కన ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సుమారు రూ. 13,667 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని, చంద్రబాబు చెబుతున్న సంపద సృష్టి ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు.
𝟮 𝘆𝗲𝗮𝗿 𝗽𝗲𝗿𝗳𝗼𝗿𝗺𝗮𝗻𝗰𝗲 𝗶𝗻𝗱𝗶𝗰𝗮𝘁𝗶𝗻𝗴 𝘀𝗲𝘃𝗲𝗿𝗲 𝗳𝗶𝘀𝗰𝗮𝗹 𝘀𝘁𝗿𝗲𝘀𝘀
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 16, 2026
The provisional accounts for the financial year 2025-26 have been published by the CAG, these accounts bring to light unsettling facts regarding the State.
On one hand Mr. Chandrababu… pic.twitter.com/jyQe6sUJVv
ఏపీఎండీసీ నిధులపై ఆరోపణలు
ఏపీఎండీసీ ద్వారా మే 2025లో సేకరించిన రూ. 9,000 కోట్ల ఎన్సీడీ నిధులను ప్రభుత్వం అక్రమంగా తన రెవెన్యూ ఖర్చుల కోసం వాడుకుందని జగన్ ఆరోపించారు. ఎటువంటి ఆస్తుల సృష్టి జరగకుండానే ఈ నిధులను మళ్లించారని, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఎన్సీడీ హోల్డర్లకు రాష్ట్ర కన్సోలిడేటెడ్ ఫండ్ యాక్సెస్ కల్పించారని మండిపడ్డారు. ఈ నిధులు కేవలం లెక్కలు సర్దుబాటు చేసేందుకే నాన్-టాక్స్ రెవెన్యూగా చూపించారని ఆయన విమర్శించారు.
విధానపరమైన అవినీతి
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి విధానపరమైన పక్షపాతం, అవినీతి వల్ల వచ్చిందేనని జగన్ విమర్శించారు. ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అవాస్తవ వృద్ధి రేట్లను ప్రకటిస్తోందని, అప్పులు సేకరించడానికి అనారోగ్యకరమైన, రాజ్యాంగ విరుద్ధమైన మార్గాలను ఎంచుకుంటోందన్నారు. గత రెండేళ్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని, ఇది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















