అన్వేషించండి

Year Ender 2023: ఎక్కడ వేసిన గొంగళి అక్కడే! 2023లో ఏపీలో ఏం జరిగిందంటే!

Andhra Pradesh News: మరికొన్ని గంటల్లో 2023 ముగిసి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. కనుక ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమి సాధించింది అని ఓసారి వెనక్కు తిరిగి చూసుకుంటే ఇవే కనిపిస్తాయి.

YS Jagan vs Chandrababu: మరో రోజులో 2023 సంవత్సరం ముగిసి కొత్త ఆంగ్ల సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందని ఓసారి వెనక్కు తిరిగి చూసుకొంటే, కోర్టు కేసులు, చంద్రబాబు నాయుడు అరెస్టు, నారా లోకేష్ యువగళం, విశాఖ రాజధాని పేరుతో వైసీపి నేతలు చేసిన ప్రచారం కనిపిస్తుంది. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్రా రెడ్డి అరెస్ట్ కావడం తెలిసిందే. ఈ కేసులో దోషులు ఎవరనేది తేలలేదు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ కొనసాగుతోంది. వివేకా హత్య కేసులో వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి సీబీఐ కేసులతో కోర్టుల చుట్టూ తిరుగాల్సి వచ్చింది. వైసీపి ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడిని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలతో వైసీపికి ఈ ఏడాది పెద్ద పెద్ద మరకలే అంటుకున్నాయి.

అట్టహాసంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 
2023 మార్చిలో విశాఖలో రెండు రోజులపాటు అట్టహాసంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. అందులో భాగంగా రాష్ట్రానికి రూ.13.56 లక్షల కోట్ల పెట్టుబడులు, వాటితో అనేక పరిశ్రమలు, వాటితో సుమారు 6 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని వైసీపి గొప్పగా చెప్పుకొంది. కానీ వాటిలో పది పరిశ్రమలు కూడా ఏర్పాటు కాలేదని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇన్వెస్టర్స్ సదస్సు పేరుతో హడావుడి, దాని కోసం చేసిన కోట్ల రూపాయల ఖర్చు అంతా వృద్ధాయే అని.. తమకు జాబ్స్ రాలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ రాజకీయాల్ని మలుపుతిప్పిన చంద్రబాబు అరెస్ట్.. 
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేసిన తర్వాత అకస్మాత్తుగా టీడీపీ బలపడినట్లు కనిపించింది. సాక్ష్యాలు, ఆధారాలు లేకున్నా అక్రమంగా అరెస్ట్ చేశారని చంద్రబాబుపై ప్రజల్లో సానుభూతి పెరిగినట్లు కనిపిస్తోంది. చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఆయన విడుదలయ్యాక జనసేనతో కలిసి ఎన్నికలకు వ్యూహాలు రచిస్తున్నారు చంద్రబాబు. వైసీపీ ఆలోచన బెడిసికొట్టగా, తాజాగా ఎమ్మెల్యేలను, నియోజకవర్గం ఇన్చార్జిలని మార్చేస్తున్నారు వైఎస్ జగన్. తమకు టికెట్లు ఇవ్వకపోవడం ఏంటని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నా, బయటకు మాత్రం జగన్ ఏం చెబితే అది పాటిస్తామని చెప్పుకుంటున్నట్లు అర్థమవుతోంది. 

విశాఖకు సీఎం జగన్ మకాం మార్చుతారా.. 
సీఎం జగన్ విశాఖకు మకాం మార్చేందుకు స్వయంగా అనేక ముహూర్తాలు పెట్టుకొన్నప్పటికీ ఇంతవరకు రాలేకపోవడంతో వైసీపిపై విమర్శలు వస్తున్నాయి. ఋషికొండపై వందల కోట్లు ఖర్చు చేసిన విలాసవంతమైన భవనం నిర్మించినా.. అది సీఎం కార్యాలయమని చెప్పలేకపోతున్నారు. మరోవైపు కోర్టు తీర్పులు వైసీపీకి అడ్డుకట్టగా మారుతున్నాయి. మరోవైపు 2023 టిడిపికి కాస్త మేలు, కాస్త కీడు చేసిందనే చెప్పవచ్చు. యువగళం పాదయాత్రతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన నాయకత్వ లక్షణాలు చాటుకోగా, జగన్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసు పేరుతో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచారు. 

చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్ర ప్రజలలో టిడిపి పట్ల సానుభూతి పెరిగింది. ఈ ఏడాదిలోనే టిడిపి, జనసేనల పొత్తు కుదుర్చుకొని నిలకడగా ముందుకు సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ చేసిన వారాహి యాత్రలతో 2023లో జనసేన పార్టీకి మంచి గుర్తింపే లభించింది. రాష్ట్రంలో బలపడింది కూడా. బీజేపీతో జనసేన పొత్తులో ఉండగానే టిడిపితో కలిసి ఎన్నికలలో పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ తీసుకొన్న కీలక నిర్ణయం కూడా ఆ పార్టీని, రాష్ట్ర రాజకీయాలను, పార్టీల బలాబలాలను చాలా ప్రభావితం చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి
కనీసం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. అయిదేళ్లు గడిచినా రాజధానిపై స్పష్టత రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు కొండల్లా పెరిగిపోతున్నా.. ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు తాజాగా పారిశుధ్య కార్మికులు జీతాల కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళన ప్రభుత్వంపై వ్యతిరేకతగా మారితే మాత్రం వైసీపీకి పెద్ద దెబ్బ తగిలే అవకాశాలున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: చిత్తూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రావెల్స్ బస్సు బోల్తా పడి నలుగురు మృతి 
చిత్తూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రావెల్స్ బస్సు బోల్తా పడి నలుగురు మృతి 
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 17వేల కోట్ల ప్యాకేజీ - ప్రైవేటీకరణ లేనట్లేనని చేతలతో చెప్పిన కేంద్రం !
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 17వేల కోట్ల ప్యాకేజీ - ప్రైవేటీకరణ లేనట్లేనని చేతలతో చెప్పిన కేంద్రం !
Numaish Exhibition 2025: నాంపల్లి ఎగ్జిబిషన్‌లో తప్పిన పెను ప్రమాదం, సందర్శకులకు అర గంట భయానక అనుభవం
నాంపల్లి ఎగ్జిబిషన్‌లో తప్పిన పెను ప్రమాదం, సందర్శకులకు అర గంట భయానక అనుభవం
Hyderabad Gun Firing News: ఉదయం కర్ణాటకలో కాల్పులు- రాత్రికి హైదరాబాద్‌లో ఫైరింగ్‌- సినీ ఫక్కీలో చెలరేగిపోయిన బీదర్ గ్యాంగ్
ఉదయం కర్ణాటకలో కాల్పులు- రాత్రికి హైదరాబాద్‌లో ఫైరింగ్‌- సినీ ఫక్కీలో చెలరేగిపోయిన బీదర్ గ్యాంగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Konaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP DesamAttack on Saif Ali Khan | బాలీవుడ్ బడా హీరోలు టార్గెట్ గా హత్యాయత్నాలు | ABP DesamISRO SpaDEX Docking Successful | అంతరిక్షంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఇస్రో ఉపగ్రహాలు | ABP DesamKTR Attended ED Enquiry | ఫార్మూలా ఈ కేసులో ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: చిత్తూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రావెల్స్ బస్సు బోల్తా పడి నలుగురు మృతి 
చిత్తూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రావెల్స్ బస్సు బోల్తా పడి నలుగురు మృతి 
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 17వేల కోట్ల ప్యాకేజీ - ప్రైవేటీకరణ లేనట్లేనని చేతలతో చెప్పిన కేంద్రం !
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 17వేల కోట్ల ప్యాకేజీ - ప్రైవేటీకరణ లేనట్లేనని చేతలతో చెప్పిన కేంద్రం !
Numaish Exhibition 2025: నాంపల్లి ఎగ్జిబిషన్‌లో తప్పిన పెను ప్రమాదం, సందర్శకులకు అర గంట భయానక అనుభవం
నాంపల్లి ఎగ్జిబిషన్‌లో తప్పిన పెను ప్రమాదం, సందర్శకులకు అర గంట భయానక అనుభవం
Hyderabad Gun Firing News: ఉదయం కర్ణాటకలో కాల్పులు- రాత్రికి హైదరాబాద్‌లో ఫైరింగ్‌- సినీ ఫక్కీలో చెలరేగిపోయిన బీదర్ గ్యాంగ్
ఉదయం కర్ణాటకలో కాల్పులు- రాత్రికి హైదరాబాద్‌లో ఫైరింగ్‌- సినీ ఫక్కీలో చెలరేగిపోయిన బీదర్ గ్యాంగ్
YS Jagan: వైసీపీ అధినేత జగన్‌కు పుత్రికోత్సాహం, మమ్మల్ని గర్వపడేలా చేశావంటూ ట్వీట్
వైసీపీ అధినేత జగన్‌కు పుత్రికోత్సాహం, మమ్మల్ని గర్వపడేలా చేశావంటూ ట్వీట్
8th pay Commission: 8వ వేతన కమిషన్‌తో ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎంత పెరిగే ఛాన్స్ ఉంది! గణాంకాలు స్టెప్ బై స్టెప్ చూడండి
8వ వేతన కమిషన్‌తో ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎంత పెరిగే ఛాన్స్ ఉంది! గణాంకాలు స్టెప్ బై స్టెప్ చూడండి
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 17  మంది మావోయిస్టులు హతం!
కాల్పుల మోతతో దద్దరిల్లిన బీజాపూర్- భారీ ఎన్‌కౌంటర్‌లో 17 మంది మావోయిస్టులు హతం!
ICC Champions Trophy: పీసీబీ తుగ్లక్ నిర్ణయం..! నిజాలు బయటకు రాకుండా వారిపై ఆంక్షలు విధింపు
పీసీబీ తుగ్లక్ నిర్ణయం..! నిజాలు బయటకు రాకుండా వారిపై ఆంక్షలు విధింపు
Embed widget