అన్వేషించండి

MLA RK Roja: పదవులన్నీ పీకేశారు.... టీడీపీపై ఎమ్మెల్యే రోజా ఫైర్... అయ్యన్న విజ్ఞతకే వదిలేమని కామెంట్స్

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘటనలపై రాజకీయ విమర్శలు దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజు స్పందించారు.

ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, టీడీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఇరుపార్టీల కార్యకర్తలు రాళ్లదాడి చేసుకున్నారు. అసలు  ఈ వ్యవహారం అంతటికీ మూలం సీఎం జగన్ పై మాజీమంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు కోడెల వర్థంతి సభలో చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. తాజాగా అయ్యన్నపై నగరి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని రోజా అన్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

సినిమా టికెట్లు ఆన్లైన్ విక్రయంపై

అనంతరం ఆలయం బయట ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం చంద్రబాబు కోడెల శివప్రసాద్ కు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మానసిక క్షోభకు గురి చేశారన్నారు. అప్పుడు  అయ్యన్న ఎక్కడున్నారని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో జగన్ ని చూసి నేర్చుకోవాలని ప్రతిపక్షాలకు ఆమె హితవు పలికారు.  రాష్ట్ర ప్రజలు చంద్రబాబు, అయ్యన్న పదవులు లాగేశారని ఎద్దేవా చేశారు. సినిమా టిక్కెట్లు ఆన్లైన్ లో విక్రయించాలనే ప్రభుత్వ నిర్ణయానికి పూర్తి మద్దతిస్తున్నట్లు చెప్పారు. చిరంజీవి, నాగార్జున పరిశ్రమ పెద్దలు సినిమా టికెట్లు ఆన్లైన్ ద్వారా విక్రయించాలని కోరడంతోనే సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారని‌ రోజా తెలియజేశారు. 

Also Read: Watch: చేనేత కార్మికురాలిగా ఎమ్మెల్యే రోజా.. జగన్, రోజా బొమ్మలతో చీరలు

అసలేం జరిగిందంటే

కోడెల శివప్రసాదరావు వర్థంతి సభలో అయ్యన్నపాత్రుడు వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో చంద్రబాబు క్షమాపణ చెప్పాలని, అయ్యన్నపాత్రుడితో క్షమాపణ చెప్పించాలని కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తన అనుచరులతో కలిసి ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి ముట్టడికి వచ్చారు. చంద్రబాబు ఇంటి గేటు వద్దకు వెళ్లి బైఠాయించారు. ఆ సమయంలో టీడీపీ నేతలు వారిని అడ్డుకున్నారు. పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడిచేసుకున్నారు. అనంతరం పోలీసులు వైసీపీ కార్యకర్తల్ని చంద్రబాబు ఇంటిదగ్గర నుంచి తరలించారు. అధికార పార్టీగా ఉండి రౌడీయిజానికి పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. శాంతియుత నిరసన తెలియచేస్తున్న తమపై టీడీపీ నేతలే గూండాల్లా దాడి చేశారని జోగి రమేష్ కారును ధ్వంసం చేశారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. 

Also Read: Lokesh : వాళ్లూ వీళ్లూ ఎందుకు జగన్‌.. నువ్వేరా..! టీ, స్నాక్స్ పెట్టి అభివృద్ధి నేర్పిస్తామ్ : లోకేష్ ట్వీట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs CSK Match Highlights IPL 2025 | లక్నో పై 5వికెట్ల తేడాతో చెన్నై సంచలన విజయం | ABP DesamNani HIT 3 Telugu Trailer Reaction | జనాల మధ్యలో ఉంటే  అర్జున్..మృగాల మధ్యలో ఉంటే సర్కార్ | ABP DesamVirat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Shaik Rasheed : మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
New Toll System: టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Trains Cancel : గుంతకల్ డివిజన్‌లో యార్డ్ రీమోడలింగ్ వర్క్స్, రోజుల తరబడి కీలక రైళ్లు రద్దు!
గుంతకల్ డివిజన్‌లో యార్డ్ రీమోడలింగ్ వర్క్స్, రోజుల తరబడి కీలక రైళ్లు రద్దు!
Embed widget