అన్వేషించండి

Balineni Srinivasa Reddy: జగన్‌తో అపాయింట్‌మెంట్ అవసరం లేదు, పార్టీ మారడంపై బాలినేని క్లారిటీ

Balineni Srinivasa Reddy: కొద్ది రోజులుగా పార్టీ మారుతున్నారంటూ వస్తున్న కథనాలపై బాలినేని శ్రీనివాస రెడ్డి  స్పందించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Balineni Srinivasa Reddy: కొద్ది రోజులుగా పార్టీ మారుతున్నారంటూ వస్తున్న కథనాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి  స్పందించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గురువారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బాలినేని శ్రీనివాస్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ సమస్యలను ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఒంగోలు నగరంలో భూ అక్రమాల కేసు విషయంలో ఈ మధ్య రేగిన వివాదం గురించి వివరించారు.

సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నారు
సొంత పార్టీలోనే కొంత మంది తనను టార్గెట్ చేస్తున్నారని సీఎం జగన్‌కు దృష్టికి బాలినేని తీసుకెళ్లారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌తో భేటి ముగిసిన అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. పార్టీ మారే ఉద్దేశ్యం ఉంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని అన్నారు. నాలుగేళ్ల మంత్రి పదవి వదులుకుని జగన్ కోసం వచ్చానని గుర్తు చేశారు.

జగన్‌తో అపాయింట్‌మెంట్ అవసరం లేదు
సీఎం జగన్‌ దగ్గరకు వెళ్లడానికి తనకు అపాయింట్మెంట్ అవసరం లేదని  బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం జగన్ తనను ఎప్పుడైనా నేరుగా వచ్చి కలవమని చెప్పారని అన్నారు. తనపై లేనిపోని దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. తాను చాలా సెన్సిటివ్ అని, మీడియాను అడ్డం పెట్టుకుని తనను ఎవరైనా అంటే సహించనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లినట్లు చెప్పారు. 

జగన్‌కు అన్నీ తెలుసు
జిల్లాలో జరుగుతున్న అన్ని విషయాలు సీఎం జగన్‌కు తెలుసునని బాలినేని అన్నారు. ప్రకాశం జిల్లాలో నకిలీ స్టాంపుల కుంభకోణంలో సీఐడీ అవసరం లేకుండా 21 మందితో టీంలను ఏర్పాటు చేశారని బాలినేని చెప్పారు. తనకు, అవినీతి, అక్రమాలకు పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్న బాలినేని ఏదైనా చెప్పాలనుకుంటే సీఎం జగన్‌కే చెబుతానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సైతం ఒంగోలులో వైసీపీ జెండా ఎగురుతుందన్నారు.

అసంతృప్తితో రగిలిపోతున్న బాలినేని
జిల్లాలో నకిలీ భూ దస్తావేజుల కేసులో తీరుపై ఒంగోలు పోలీసుల వ్యవహారశైలిపై బాలినేని కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రకాశం  ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా గన్‌మెన్‌లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. నకిలీ భూపత్రాల కేసులో ఇప్పటి వరకు 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టవద్దని మూడు రోజుల క్రితం కలెక్టర్‌ సమక్షంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎస్పీని కోరారు.  

అసలు దోషులు తెలిసినా...!
అసలు దోషుల తెలిసినా కూడా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న బాలినేని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదని మండిపడ్డారు. నకిలీ భూ దస్తావేజుల కేసులో ఉన్న ఎంతటి వారినైనా అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ కేసులో అధికార పార్టీ నేతలు ఉన్నా వదిలిపెట్టవద్దని, అరెస్ట్ చేసి తీరాల్సిందేనన్నారు.  పోలీసులు తన సూచనలను పెడచెవిన పెడుతున్నారని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget