అన్వేషించండి

Balineni Srinivasa Reddy: జగన్‌తో అపాయింట్‌మెంట్ అవసరం లేదు, పార్టీ మారడంపై బాలినేని క్లారిటీ

Balineni Srinivasa Reddy: కొద్ది రోజులుగా పార్టీ మారుతున్నారంటూ వస్తున్న కథనాలపై బాలినేని శ్రీనివాస రెడ్డి  స్పందించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Balineni Srinivasa Reddy: కొద్ది రోజులుగా పార్టీ మారుతున్నారంటూ వస్తున్న కథనాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి  స్పందించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గురువారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బాలినేని శ్రీనివాస్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ సమస్యలను ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఒంగోలు నగరంలో భూ అక్రమాల కేసు విషయంలో ఈ మధ్య రేగిన వివాదం గురించి వివరించారు.

సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తున్నారు
సొంత పార్టీలోనే కొంత మంది తనను టార్గెట్ చేస్తున్నారని సీఎం జగన్‌కు దృష్టికి బాలినేని తీసుకెళ్లారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌తో భేటి ముగిసిన అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. పార్టీ మారే ఉద్దేశ్యం ఉంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని అన్నారు. నాలుగేళ్ల మంత్రి పదవి వదులుకుని జగన్ కోసం వచ్చానని గుర్తు చేశారు.

జగన్‌తో అపాయింట్‌మెంట్ అవసరం లేదు
సీఎం జగన్‌ దగ్గరకు వెళ్లడానికి తనకు అపాయింట్మెంట్ అవసరం లేదని  బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం జగన్ తనను ఎప్పుడైనా నేరుగా వచ్చి కలవమని చెప్పారని అన్నారు. తనపై లేనిపోని దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. తాను చాలా సెన్సిటివ్ అని, మీడియాను అడ్డం పెట్టుకుని తనను ఎవరైనా అంటే సహించనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లినట్లు చెప్పారు. 

జగన్‌కు అన్నీ తెలుసు
జిల్లాలో జరుగుతున్న అన్ని విషయాలు సీఎం జగన్‌కు తెలుసునని బాలినేని అన్నారు. ప్రకాశం జిల్లాలో నకిలీ స్టాంపుల కుంభకోణంలో సీఐడీ అవసరం లేకుండా 21 మందితో టీంలను ఏర్పాటు చేశారని బాలినేని చెప్పారు. తనకు, అవినీతి, అక్రమాలకు పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్న బాలినేని ఏదైనా చెప్పాలనుకుంటే సీఎం జగన్‌కే చెబుతానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సైతం ఒంగోలులో వైసీపీ జెండా ఎగురుతుందన్నారు.

అసంతృప్తితో రగిలిపోతున్న బాలినేని
జిల్లాలో నకిలీ భూ దస్తావేజుల కేసులో తీరుపై ఒంగోలు పోలీసుల వ్యవహారశైలిపై బాలినేని కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రకాశం  ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా గన్‌మెన్‌లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. నకిలీ భూపత్రాల కేసులో ఇప్పటి వరకు 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టవద్దని మూడు రోజుల క్రితం కలెక్టర్‌ సమక్షంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎస్పీని కోరారు.  

అసలు దోషులు తెలిసినా...!
అసలు దోషుల తెలిసినా కూడా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న బాలినేని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదని మండిపడ్డారు. నకిలీ భూ దస్తావేజుల కేసులో ఉన్న ఎంతటి వారినైనా అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ కేసులో అధికార పార్టీ నేతలు ఉన్నా వదిలిపెట్టవద్దని, అరెస్ట్ చేసి తీరాల్సిందేనన్నారు.  పోలీసులు తన సూచనలను పెడచెవిన పెడుతున్నారని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Rajamahendravaram News: రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget