అన్వేషించండి

Andhra News in Telugu: ప్రకాశం జిల్లా సిద్ధం సభ వాయిదా - సీఎం జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశం !

YSRCP Siddham News: ప్రకాశం జిల్లా సిద్ధం సభను మార్చి పదో తేదీకి వైసీపీ వాయిదా వేసుకుంది. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి మరోసారి ప్రధాని మోదీతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.

YCP has postponed the Prakasam district Siddham meeting to March 10th : ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ నిర్వహించాలనుకున్న ఆఖరి సిద్ధం సభను ఆ పార్టీ వాయిదా వేసుకుంది. మార్చి రెండో తేదీన నిర్వహించాలనుకున్నారు. కానీ పదో తేదీకి వాయిదా వేస్తూ తాజా నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్ కోసం సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. అపాయింట్‌మెంట్ లభించే అవకాశం ఉండటంతో సభను వాయిదా వేసుకున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం సీఎం జగన్ ప్రయత్నం  

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సీఎం  జగన్మోహన్ రెడ్డి ఓ సారి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. అప్పట్లో చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. తర్వాత బీజేపీతో పొత్తుల అంశంపై ఏపీలో విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. టీడీపీ ఎన్డీఏలో చేరుతుందన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఏ విషయం ఖరారు కావడం లేదు. మొదటి జాబితాను టీడీపీ,జనసేన కలిసి ప్రకటించాయి. కానీ ఎంపీ అభ్యర్థుల ను మాత్రం ఖరారు చేయలేదు. టీడీపీని ఎన్డీఏలో చేర్చుకోవద్దని సీఎం జగన్ లాబీయింగ్ చేస్తున్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

టీడీపీని ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవద్దని కోరుతున్నట్లు ప్రచారం                      

తాము బీజేపీకి బయట నుంచి పూర్తి  స్థాయిలో మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారని అంటున్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరితే తాము మద్దతివ్వలేని పరిస్థితులు వస్తాయని వైసీపీ వర్గాలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. లోక్‌సభ సీట్లు ఎన్ని అన్న సంగతిని పక్కన పెడితే.. వైసీపీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులుఉన్నారు. ఈ సంఖ్య బీజేపీకి మద్దతుగా ఉండటం చాలా అవసరం. రాజ్యసభల ఎన్డీఏకు పూర్తి మెజార్టీ రాదు. అందుకే.. వైసీపీని దూరం చేసుకునే ఆలోచనలో బీజేపీ లేదని అంటున్నారు. అయితే వైసీపీ ఎన్డీఏలో చేరే అవకాశం లేదు.  కానీ బయట నుంచి గత ఐదేళ్లుగా పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచారు. 

అదనపు రుణాల కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వం                            

అయితే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లడానికి రాజకీయాలకు పెద్దగా సంబంంధం లేదని.. రాష్ట్ర అంశాలపైనే వెళ్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే రెండు నెలలు అత్యంత కీలకమైన సమయం.. అనేక పథకాలకు డబ్బులు ప్రజల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. మరో వైపు ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి. అప్పుల పరిమితి ముగిసింది. ఈ క్రమంలో..త అదనపు రుణాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ అవబోతున్నారని అంటున్నారు. మొత్తంగా ఎన్నికల షెడ్యూల్.. వచ్చే నెల పదో తేదీ తర్వాత రానుంది. ఈ లోపే  ఏపీ రాజకీయాల్లో  బీజేపీ పాత్రపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
Gadchiroli Viral News: గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Embed widget