అన్వేషించండి

Andhra News in Telugu: ప్రకాశం జిల్లా సిద్ధం సభ వాయిదా - సీఎం జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశం !

YSRCP Siddham News: ప్రకాశం జిల్లా సిద్ధం సభను మార్చి పదో తేదీకి వైసీపీ వాయిదా వేసుకుంది. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి మరోసారి ప్రధాని మోదీతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.

YCP has postponed the Prakasam district Siddham meeting to March 10th : ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ నిర్వహించాలనుకున్న ఆఖరి సిద్ధం సభను ఆ పార్టీ వాయిదా వేసుకుంది. మార్చి రెండో తేదీన నిర్వహించాలనుకున్నారు. కానీ పదో తేదీకి వాయిదా వేస్తూ తాజా నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్ కోసం సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. అపాయింట్‌మెంట్ లభించే అవకాశం ఉండటంతో సభను వాయిదా వేసుకున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం సీఎం జగన్ ప్రయత్నం  

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సీఎం  జగన్మోహన్ రెడ్డి ఓ సారి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. అప్పట్లో చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. తర్వాత బీజేపీతో పొత్తుల అంశంపై ఏపీలో విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. టీడీపీ ఎన్డీఏలో చేరుతుందన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఏ విషయం ఖరారు కావడం లేదు. మొదటి జాబితాను టీడీపీ,జనసేన కలిసి ప్రకటించాయి. కానీ ఎంపీ అభ్యర్థుల ను మాత్రం ఖరారు చేయలేదు. టీడీపీని ఎన్డీఏలో చేర్చుకోవద్దని సీఎం జగన్ లాబీయింగ్ చేస్తున్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

టీడీపీని ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవద్దని కోరుతున్నట్లు ప్రచారం                      

తాము బీజేపీకి బయట నుంచి పూర్తి  స్థాయిలో మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారని అంటున్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరితే తాము మద్దతివ్వలేని పరిస్థితులు వస్తాయని వైసీపీ వర్గాలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. లోక్‌సభ సీట్లు ఎన్ని అన్న సంగతిని పక్కన పెడితే.. వైసీపీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులుఉన్నారు. ఈ సంఖ్య బీజేపీకి మద్దతుగా ఉండటం చాలా అవసరం. రాజ్యసభల ఎన్డీఏకు పూర్తి మెజార్టీ రాదు. అందుకే.. వైసీపీని దూరం చేసుకునే ఆలోచనలో బీజేపీ లేదని అంటున్నారు. అయితే వైసీపీ ఎన్డీఏలో చేరే అవకాశం లేదు.  కానీ బయట నుంచి గత ఐదేళ్లుగా పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచారు. 

అదనపు రుణాల కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వం                            

అయితే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లడానికి రాజకీయాలకు పెద్దగా సంబంంధం లేదని.. రాష్ట్ర అంశాలపైనే వెళ్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే రెండు నెలలు అత్యంత కీలకమైన సమయం.. అనేక పథకాలకు డబ్బులు ప్రజల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. మరో వైపు ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి. అప్పుల పరిమితి ముగిసింది. ఈ క్రమంలో..త అదనపు రుణాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ అవబోతున్నారని అంటున్నారు. మొత్తంగా ఎన్నికల షెడ్యూల్.. వచ్చే నెల పదో తేదీ తర్వాత రానుంది. ఈ లోపే  ఏపీ రాజకీయాల్లో  బీజేపీ పాత్రపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget