అన్వేషించండి

Gannavaram TDP incharge : గన్నవరం టీడీపీ ఇంచార్జ్ గా యార్లగడ్డ - ఫుల్ చార్జ్ ఇచ్చేసిన లోకేష్ !

గన్నవరం టీడీపీ ఇంచార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావును ప్రకటించారు. అందర్నీ కలుపుకుని వెళ్తానని యార్లగడ్డ హామీ ఇచ్చారు.

Gannavaram TDP incharge :  ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గా   యార్లగడ్డ వెంకట్రావును ఆ పార్టీ ఖరారు చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ విషయాన్ని స్వయంగాప్రకటింంచారు.  గన్నవరం నియోజకవర్గంలో ‘యువగళం’ పాదయాత్ర కొనసాగుతోంది. దీనిలో భాగంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో నారా లోకేశ్‌ సమక్షంలో వై వైసీపీకి చెందిన పలువురు నేతలు టీడీపీలో చేరారు. వీరిలో   సిట్టింగ్‌ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచ్‌లు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా   గన్నవరం పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వెంకట్రావును నియమించినట్లు లోకేశ్‌ ప్రకటించారు.
Gannavaram TDP incharge : గన్నవరం టీడీపీ ఇంచార్జ్ గా యార్లగడ్డ - ఫుల్ చార్జ్ ఇచ్చేసిన లోకేష్ !

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓటమి కోసం తామంతా కలసి కట్టుగా పనిచేస్తామని యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించారు. గన్నవరం టీడీపీ కంచుకోట అని  మరోసారి అక్కడ టీడీపీ జెండాను ఎగరేస్తామన్నారు.  ఆత్మాభిమానంతోనే  టీడీపీలో చేరానని..   వంశీ వెంట టీడీపీ నేతలు ఎవరూ వెళ్లలేదన్నారు.  తాము రౌడీయిజం చేయడానికి రాలేదని.. రాజకీయం కోసమే వచ్చామన్నారు. కొత్త, పాత కలయికల్ని సమన్వయం చేసుకుంటూ వెళ్తానని వెంకట్రావు ప్రకటించారు.  ఏ ఒక్కరికి సమస్య ఉన్నా నేరుగా తనకి చెప్పాలని కార్యకర్తలకు ఆయన వేదికపై నుంచి సూచించారు.                                    


గన్నవరం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ తర్వాత వైసీపీకి మద్దతు పలికారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి గన్నవరం లో ఇంచార్జ్ లేరు. మధ్యలో కొన్నాళ్ల పాటు బచ్చున అర్జునుడును సమన్వయకర్తగా నియమించారు. కానీ ఆయనకు అనారోగ్యం కారణం ఎక్కువగా తిరగలేకపోయారు. దీంతో గన్నవరంలో టీడీపీ కార్యక్రమాలు పెద్దగా సాగలేదు. తర్వాత  బచ్చుల అర్జునుడు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ తర్వాత త్రీ మెన్ కమిటీని టీడీపీ హైకమాండ్ నియమించింది. ఈ క్రమంలో గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుపైనా వల్లభనేని వంశీ అనుచరులు దాడులు చేశారు. స్వయంగా వంశీ ఈ దాడులు చేయించారన్న ఆరోపణలు వచ్చాయి.                             

ఈ పరిణామాల మధ్య బలమైన నేత కోసం అన్వేషిస్తున్న టీడీపీకి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు.. తనకు ప్రత్యామ్నాయం చూపించలేదన్న అసంతృప్తితో  వైసీపీకి గుడ్  బై చెప్పారు. ఆయన బలమైన అభ్యర్థి అవుతారని భావించడంతో వెంటనే పార్టీలో చేర్చుకుని ఇంచార్జ్ గా ప్రకటించారు. దూకుడుగా ఉండే వెంకట్రావు.. వల్లభనేని వంశీకి సరైన ప్రత్యర్థి అవుతారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.                                                                     

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Janasena : 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
Telangana Secretariat News: తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
Pawan Chandrababu:  చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
Telangana Caste census: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sri Ramakrishna Teertham Mukkoti | ముక్కోటి తీర్థానికి వెళ్లి రావటం ఓ అనుభూతి | ABP DesmBr Shafi Interview on Radha Manohar Das | నాది ఇండియన్ DNA..మనందరి బ్రీడ్ ఒకటే | ABP DesamAP Deputy CM Pawan kalyan in Kerala | కొచ్చి సమీపంలో అగస్త్యమహర్షి గుడిలో పవన్ కళ్యాణ్ | ABP DesamMegastar Chiranjeevi Comments Controversy | చిరంజీవి నోరు జారుతున్నారా..అదుపు కోల్పోతున్నారా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena : 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
Telangana Secretariat News: తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
Pawan Chandrababu:  చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
Telangana Caste census: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
Ind Vs Eng Odi Series Clean Sweap:  సిరీస్ క్లీన్ స్వీప్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. 142 రన్స్ తో ఇంగ్లాండ్ ఘోర పరాజయం
సిరీస్ క్లీన్ స్వీప్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. 142 రన్స్ తో ఇంగ్లాండ్ ఘోర పరాజయం
Telangana News:తెలంగాణలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు ఫలహారం పంపిణీ- మంత్రి కీలక ఆదేశాలు
తెలంగాణలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు ఫలహారం పంపిణీ- మంత్రి కీలక ఆదేశాలు
APPSC Group -II: గ్రూప్- 2 అభ్యర్థులకు అలర్ట్‌.. మెయిన్స్ హాల్‌టికెట్స్‌ వచ్చేస్తున్నాయి
APPSC Group -II: గ్రూప్- 2 అభ్యర్థులకు అలర్ట్‌.. మెయిన్స్ హాల్‌టికెట్స్‌ వచ్చేస్తున్నాయి
Pawan Kalyan Temple Tour: అగస్త్య మహర్షితో మొదలు పెట్టి పరుశురామ సందర్శనతో ముగిసిన పవన్ కల్యాణ్ మొదటి రోజు యాత్ర
అగస్త్య మహర్షితో మొదలు పెట్టి పరుశురామ సందర్శనతో ముగిసిన పవన్ కల్యాణ్ మొదటి రోజు యాత్ర
Embed widget