అన్వేషించండి

Employess Strike : సమ్మె చేస్తారు సరే తర్వాతేంటి ? ఏపీ ఉద్యోగ సంఘాలకు ప్లాన్ బీ ఉందా ?

ఏపీ ఉద్యోగ సంఘాలు ఇప్పుడు క్రాస్‌రోడ్‌లో ఉన్నాయి. సమ్మె చేసినా ఉద్యోగులకు చర్చలు తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వం అంటోంది. ఉద్యోగులు మాత్రం డిమాండ్లపై పట్టుబడుతున్నారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల్లా అయిపోతుందా ? వారికి ప్లాన్ బీ ఉందా?

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు అన్నీ ఏకతాటిపైకి వచ్చి సమ్మె చేస్తున్నట్లుగా ప్రకటించాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో  వచ్చినట్లుగా పోలీసులు, అఖిలభారత సర్వీసు అధికారులు మినహా అందరూ సమ్మెలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారికి వచ్చిన సమస్య అలాంటిది. ఇప్పుడు పీఆర్సీకి అంగీకరిస్తే భవిష్యత్ కోల్పోతామని అందరూ నమ్ముతున్నారు. అందుకే సమ్మెకు వెళ్లడం ఖాయం. ప్రభుత్వం కూడా దిగి వచ్చే ప్రశ్నే లేనంటోంది. అయితే సమ్మె చేస్తారు సరే తర్వాతేంటి?  చేసినన్ని రోజులు చేసిమళ్లీ ప్రభుత్వం దగ్గరకే వెళ్లాలా ? చర్చలు జరపాలని బతిమాలుకోవాలా ? గత సమ్మెల నుంచి పాఠాలు నేర్చుకున్నారా ? ఉద్యోగ సంఘాల వద్ద ప్లాన్ బీ ఉందా ?

ఎప్పుడైనా ప్రభుత్వం వద్దకు వెళ్లాల్సిందే కదా !

ఉద్యోగుల ఉద్యమం విషయంలో ఏపీ ప్రభుత్వ పెద్దలు చాలా నింపాదిగా ఉన్నారు. సమ్మె నోటీసుల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. పీఆర్సీపై ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ పోతున్నారు. అపోహలు తీర్చేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఆ కమిటీలో నియమించిన సగం మంది సభ్యులు పట్టించుకోలేదు. సీఎస్‌తో పాటు ఆర్థిక మంత్రి రావడం లేదు. సభ్యులయిన సజ్జల, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ రోజూ వస్తున్నారు. ఎదురు చూస్తున్నారు. వెళ్తునారు. చర్చలకు రావాలంటే ఉద్యోగులు షరతులు పెడుతున్నారు. వాటి గురించి అసలు పట్టించుకునే ప్రశ్నే లేదని ప్రభుత్వం చెప్పింది.దీంతో వారు రావడం లేదు. సమ్మెకు వెళ్తారని తెలిసినా ఎందుకు ప్రభుత్వం ఇంత తేలిగ్గా వ్యవహరిస్తోందన్న విషయంకమిటీ సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలను విశ్లేషిస్తే అర్థమైపోతుంది.  ఉద్యోగులు జీవితాంతం సమ్మె చేయలేరుగా... ఎప్పుడైనా ప్రభుత్వం వద్దకు రావాల్సిందేగా అని అటు మంత్రి పేర్ని నాని.. వారికి మరో ప్రత్యామ్నాయం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో నేరుగానే చెబుతున్నారు.  ఉద్యోగులు ఎంత కాలం కావాలంటే అంత కాలం సమ్మె చేసుకుని విసుగు పుట్టి తామే ఉద్యోగాల్లో చేరతామని వస్తారని అప్పటి వరకూ తాము సీరియస్‌గా కాకుండా సాధారణంగా పట్టించుకుంటే చాలని  భావిస్తున్నారు. 

ఉమ్మడి ఏపీలో చేసిన ఉద్యోగుల సమ్మెల్లో కొన్ని సక్సెస్.. కొన్ని ఫెయిల్ !

ఉద్యోగులపై కఠిన వైఖరికి నిరసనగా కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో 1971లో 56 రోజుల పాటు సమ్మె నడిచింది. కానీ ప్రత్యేకమైన హామీలేమీ లేకుండానే విరమించాల్సి వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన సమ్మె మినహా తమ సమస్యల కోసం గత 35 ఏళ్లలో ఉద్యోగులు సమ్మె చేయలేదు. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు986లో ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 55 ఏళ్లకు కుదించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న ఉద్యోగుల కుటుంబాలకు ప్రోత్సాహకంగా అందుతున్న ఒక ఇంక్రిమెంట్‌నూ, ఎర్న్‌డ్‌ లీవ్‌లను క్యాష్‌ చేసుకునే వెసులుబాటునూ రద్దుచేశారు. వీటిలోపాటు పీఆర్సీ అమలు కూడా ఆలస్యమైంది. దీంతో ఉద్యోగుల ఐక్య సంఘం పిలుపు మేరకు 1986 అక్టోబరులో సుమారు 19 రోజులపాటు సమ్మె చేశారు.  పీఆర్సీ అమలుచేయడంతోపాటు తొలగించిన అన్ని ప్రయోజనాలను కల్పించేందుకు ఎన్టీఆర్‌ ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె విజయవంతమైంది. .

కోర్టుల్లో సమ్మెను సమర్థించుకునే పరిస్థితి లేదని గతంలో తీర్పులు !

ఇటీవల తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేశారు. సుమారు యాభైవేలమంది ఆర్టీసీ కార్మికులు రెండు నెలలపాటు సమ్మె చేసినపుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక దశలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.  0ఆర్టీసీ కార్మికులు హైకోర్టుకు వెళ్లారు. లేబర్‌ కోర్టుకు వెళ్లండని హైకోర్టు స్పష్టం చెయ్యడంతో కార్మికులు ఏం చేయలేక ప్రభుత్వాన్నే ప్రాథేయపడాల్సి వచ్చింది. కొన్నేళ్ల కిందట తమిళనాడు ఉద్యోగులు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగారు. జయలలిత ఆగ్రహించి లక్షా డెబ్భైవేల మంది ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించారు. దీంతో ఉద్యోగులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ అత్యున్నత న్యాయస్థానం సమ్మె అనేది ఉద్యోగుల హక్కు కాదని, ఉద్యోగులను డిస్మిస్‌ చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని, అయితే మానవీయ కోణంలో చూసి డిస్మిస్‌ చేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని జయలలితకు సూచించింది. ఇదే విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. సమ్మెకు వెళ్లడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు గుర్తు చేసిందని ఆయన మీడియాతో చెప్పారు. 

ఇప్పటి ప్రభుత్వం కఠినంగా ఉండటం ఖాయం.. ఉద్యోగులకు దారేది!?

ఉద్యోగుల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఏ మాత్రం తగ్గేది లేదని.. వారి డిమాండ్లను అంగీకరించే ప్రశ్నే లేదని ఇప్పటికే తేట తెల్లమయింది. ఉద్యోగులు సమ్మెకు వెళ్లినా చివరికి తమంతటకు తాము వచ్చి విధుల్లో చేరేలా పరిస్థితి మారుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే లైట్ తీసుకుంటోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఉద్యోగులు ఎన్నాళ్లు సమ్మె చేద్దామనుకుంటున్నారు..? రెండునెలల పాటు సమ్మె చేసినా.. ప్రభుత్వంలో స్పందన లేకపోతే...వచ్చే జీతాలు కూడా రాకపోతే ఏం చేస్తారు ? తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్లా ప్రభుత్వం వద్దకెళ్లి బతిమాలుకుంటారా ? లేకపోతే.. ప్రభుత్వాన్ని సైతం మెట్టు దిగేలా చేసేలా ప్లాన్ బీ ఉందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ విషయంలో ఉద్యోగ సంఘాల వ్యూహమే వారి ఉద్యమాన్ని ఏ తీరానికి చేరుస్తుందన్నది నిర్ణయిస్తుంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
Pawan meets Chandrababu : గ్రామ వికాసమే లక్ష్యం - చంద్రబాబు-పవన్ భేటీలో కీలక నిర్ణయాలు
గ్రామ వికాసమే లక్ష్యం - చంద్రబాబు-పవన్ భేటీలో కీలక నిర్ణయాలు
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
Kerala BJP: కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
ABP Desam Smart Ed Conclave 2026: స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
Chiranjeevi - Venkatesh: చిరంజీవి కోసం వెంకటేష్ టైటిల్ త్యాగం... మూడు నేషనల్ అవార్డులు వచ్చిన ఆ సినిమా ఏదో తెలుసా?
చిరంజీవి కోసం వెంకటేష్ టైటిల్ త్యాగం... మూడు నేషనల్ అవార్డులు వచ్చిన ఆ సినిమా ఏదో తెలుసా?
CM Revanth Reddy : 99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
Embed widget