అన్వేషించండి

Minister Botsa : అమరావతి ఫేక్ పాదయాత్ర ఆగిపోయినట్లే, 60 మందికి కూడా గుర్తింపు కార్డుల్లేవ్ - మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana : విశాఖ గర్జన సక్సెస్ తో మూడు రాజధానులకే ప్రజల మద్దతు ఉందని తెలిసిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Minister Botsa Satyanarayana : మూడు రాజ‌ధానుల ఏర్పాటు కోసం రోడ్‌ మ్యాప్ త‌యార‌వుతోంద‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ చెప్పారు. విజయనగరం క‌లెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖ‌లో ల‌క్షలాది మందితో జ‌రిగిన గ‌ర్జన విజ‌య‌వంతం చేయ‌డం ద్వారా, మూడు రాజ‌ధానుల‌పై ప్రజాభిప్రాయం తేట‌తెల్లమ‌య్యింద‌ని అన్నారు. మూడు రాజ‌ధానుల ఏర్పాటు త‌థ్యమ‌ని, విశాఖ‌ప‌ట్నం ప‌రిపాల‌నా రాజ‌ధాని అవుతుంద‌ని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వ‌ర‌కు ఫేక్ రైతుల‌తో అమ‌రావ‌తి పాద‌యాత్ర జ‌రిగింద‌ని ఆరోపించారు. సుమారు 600 మంది రైతుల‌కి కోర్టు అనుమ‌తి ఇచ్చిన‌ప్పటికీ, వారిలో క‌నీసం 60 మందికి కూడా గుర్తింపు కార్డులు లేవ‌ని అన్నారు. అది రైతుల ముసుగులో టీడీపీ నాయ‌కులు చేసిన పాద‌యాత్రగా పేర్కొన్నారు. అందుకే ఆ ఫేక్‌ పాద‌యాత్ర ఆగిపోయింద‌ని అన్నారు. విశాఖ రాజ‌ధాని అయితే ఉత్తరాంధ్ర బాగుప‌డుతుంద‌ని, దీనికి ప్రతీ ఒక్కరూ స‌హ‌క‌రించాల‌ని కోరారు. భోగాపురం అంత‌ర్జాతీయ‌ విమానాశ్రయానికి, కేంద్రీయ గిరిజ‌న విశ్వవిద్యాల‌యానికి వ‌చ్చే నెల‌లో ప్రధాన‌ మంత్రి చేత శంకుస్థాప‌న చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని మంత్రి బొత్స వెల్లడించారు. మంత్రితోపాటు ఎమ్మెల్యే బొత్స అప్పల‌ న‌ర‌స‌య్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

వచ్చే నెలలో శంకుస్థాపన 

అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర ఆగిపోయినట్లుగా భావిస్తున్నానని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ పరిపాలనా  రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేరినట్లు అయిందన్నారు.  విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధానికి ఉన్న అడ్డంకులు త్వరలో పరిష్కారమవుతాయన్నారు. త్వరలోనే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తామన్నారు.  విజయనగరం జిల్లాలోని భీమసింగి, సీతానగరం చక్కెర కర్మాగారాల పరిధిలో రైతులు పండించిన చెరకును క్రషింగ్‌ కోసం శ్రీకాకుళం జిల్లాలోని చక్కెర కర్మాగారాలకు తరలింపు, చెల్లింపు ధరపై మంత్రి బొత్స అధికారులతో సమీక్షించారు. వచ్చే నెలలో భోగాపురం గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్ పోర్టు, గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రధాన మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన ఉంటుందన్నారు. కోర్టు వివాదాలు ఉన్నాయని, అవి త్వరలో పరిష్కారమవుతాయని వెల్లడించారు.  

పాదయాత్ర ముగిసినట్లే 
 
 టీడీపీ వెనకుండి నడిపిస్తోన్న అమరావతి రైతులు పాదయాత్ర ముగిసినట్లే మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పాదయాత్రలో ఎంతమంది ఉన్నారో అందుకు సంబంధించిన ఆధారాలు కోర్టు కోరిందన్నారు.  600 మందితో సాగుతున్న అమరావతి పాదయాత్రలో 60 మంది కూడా రైతులు లేరన్నారు. టీడీపీ ముసుగులో సాగుతున్న అమరావతి రైతులు పాదయాత్రను ఆపేశారన్నారు. పాదయాత్ర ముగిసినట్లే అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు.  

డ్రామా ఆర్టిస్టులు

అమరావతి రైతుల చేస్తున్న పాదయాత్రలో అన్నదాతల కంటే డ్రామా ఆర్టిస్టులే ఎక్కువ మంది ఉన్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం  మండిపడ్డారు. రైతుల పేరుతో బినామీ పాదయాత్ర చేస్తున్నారని ఇటీవల ఆరోపించారు. పాదయాత్ర చేసేది రైతులు కాదని తాము తొలి రోజు నుంచీ చెప్తున్నామన్నారు. ముసుగు వీరులు ఎవరో శాసన సభలోనే చెప్పామని వివరించారు. పాదయాత్రలో వెరిఫికేషన్ చేస్తే.. కేవలం 70 శాతం మంది మాత్రమే అసలు రైతులు అని.. మిగిలిన దొంగ రైతులు పట్టుబడ్డారని చెప్పుకొచ్చారు. ఆ 30 శాతం మంది డ్రామా ఆర్టిస్టుల వల్లే అమరావతి ఉద్యమం కలుషితం అయిందని తెలిపారు. పాదయాత్రలో పాల్గొన్న వారిలో కేవలం 70 మందే ఐడెంటిటీ కార్డులు పట్టుకుని వచ్చారంటే ఏమనాలని స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు. ఇది డ్రామా కాదా అని.. ఎవడి డ్రామా అని నిలదీశారు. ఆడీ కార్డులు చూపమంటే కల్యాణం మండపం నుంచి బయటకు రాలేదని.. చంద్రబాబు ఒక హిడెన్ అజెండాతో ఈ తతంగం నడిపిస్తున్నారని విమర్శించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran War Effect AP Hotels: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
YS Jagan: ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
Vijaya Dairy Issue: విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?
విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case : 13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget