అన్వేషించండి

Ganesh Nimmajan: వినాయక నిమజ్జనంలో జగన్ పాటలతో ఎంజాయ్ - కేసు నమోదు

Annamayya District News: అన్నమయ్య జిల్లాలోని బి.కొత్తకోటలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఇదే సమయంలో డీజే స్పీకర్ బాక్సుల నుంచి ‘కావాలి జగన్‌... రావాలి జగన్‌’ అంటూ పాటలు ప్రారంభం అయ్యాయి.

Ganesh Immersion 2024 in Annamayya: వినాయక నవరాత్రుల సందర్భంగా గణేషుడి మండపాల వద్ద భక్తులు ఈ మధ్య కాలంలో సినిమా పాటలు అధికంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితం మండపాల ఎదురుగానే సినిమా పాటలకు రికార్డింగ్ డాన్స్ లు కూడా ఏర్పాటు చేశారు. గణనాథుడి ఎదురుగానే యువతి యువకులు కుప్పి గంతులు చాలా విమర్శల పాలయ్యాయి. ఇప్పుడు ఏకంగా వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు వేడుకల్లో మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని కీర్తిస్తూ మైకులో పాటలు పెట్టడం మరింత వివాదాస్పదం అయింది. 

ఆ పాటలు పెట్టడం ద్వారా ప్రత్యర్థి వర్గం వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. అన్నమయ్య జిల్లాలోని బి.కొత్తకోటలో ఈ ఘటన జరిగింది. ఉత్సవ కమిటీ సభ్యులపై పోలీసులు శనివారం కేసు పెట్టారు. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ప్రతి రోజు బి. కొత్తకోటలోని వివిధ ప్రాంతాల్లో ఉత్సవాలను స్థానిక కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పట్టణంలోని స్థానిక పోకనాటివీధిలో ఏర్పాటు చేసిన వినాయకుడి ఊరేగింపు జరిగింది. ఈ నెల 13వతేదీన ప్రారంభమై స్థానిక జ్యోతి బస్టాండ్ కు యాత్ర చేరుకుంది. 

ఆ యాత్రలో నిర్వాహకులు భక్తి గీతాలతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అవి చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి వీక్షిస్తున్నారు. ఇదే సమయంలో డీజే స్పీకర్ బాక్సుల నుంచి ‘కావాలి జగన్‌... రావాలి జగన్‌’ అంటూ పాటలు ప్రారంభం అయ్యాయి. ఆ తర్వాత కొంతసేపటికి వైఎస్ఆర్ సీపీకి చెందిన జెండాలను కూడా తమ ఆ పార్టీ సానుభూతిపరులు ప్రదర్శించారు. ఈ విషయాన్ని కొందరు టీడీపీ నాయకులు గుర్తించి వెంటనే వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్

ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా.. వైఎస్ఆర్ సీపీ జెండాలను ప్రదర్శించడం వివాదాస్పదం అయింది. వెంటనే కలగజేసుకున్న పోలీసులు జగన్ పాటలను ఆపేయాలని ఆదేశించినా నిర్వహకులు వినలేదు. ఇదే అంశం జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు వరకూ వెళ్లింది. ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు ఫోన్ ద్వారా కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన స్పందించి మదనపల్లె డీఎస్పీ కొండల నాయుడు, ఇన్‌ఛార్జి సీఐ రాజా రమేష్‌లు శనివారం బి.కొత్తకోటకు చేరుకుని ఉత్సవ కమిటీ నిర్వాహకులతో మాట్లాడారు. 

దేవుడి ఊరేగింపు సందర్భంగా రాజకీయ పార్టీలను జోక్యం చేయడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ, సీఐలు స్థానిక విలేకరులతో మాట్లాడారు. వినాయక విగ్రహ ఊరేగింపు సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించిన కమిటీ సభ్యుల్లో బాధ్యులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. భక్తి భావనతో నిర్వహించాల్సిన కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రస్తావన రావడం విచారకరం అని, ఇలాంటి తప్పులు జరగకుండా కమిటీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు తెలిపారు.         

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలుదేవర చెన్నై ప్రెస్ మీట్లో జాన్వీ కపూర్ స్పీచ్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
One Nation One Election : జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం మరో అడుగు - రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం - ఇక ఒక్క అడుగే
జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం మరో అడుగు - రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం - ఇక ఒక్క అడుగే
Waqf Amendment Bill: వక్ఫ్‌ ఆస్తులపై వివాదం ఎందుకు, వక్ఫ్‌ అమెండ్‌మెంట్‌ -2024 లక్ష్యాలేంటి ?
వక్ఫ్‌ ఆస్తులపై వివాదం ఎందుకు, వక్ఫ్‌ అమెండ్‌మెంట్‌ -2024 లక్ష్యాలేంటి ?
Embed widget