అన్వేషించండి

Vizag News : విశాఖలో ఇంటి దగ్గరే నిమజ్జనం - మొబైల్ ట్యాంకులు రెడీ !

విశాఖలో ఇంటి వద్దనే నిమజ్జనం చేసేలా మొబైల్ వాటర్ వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. చెరువుల్లో నిమజ్జనం చేయకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Vizag News : వినాయక చవితి పండుగ అంటే.. ఉంటే సందడి అంతా నిమజ్జనం రోజునే. అయితే నిమజ్జనం వల్ల చెరువులు కలుషితం అవుతున్నాయని చాలా కాలంగా పర్యావరణ వేత్తలు ఆందోళన వక్తం చేస్తూ వస్తున్నారు. పర్యావరణం కోసం మట్టి విగ్రహాలనే పెట్టాలని ప్లాస్టర్ ఆప్ ప్యారిస్ వద్దని ప్రచారం కూడా చేస్తున్నారు. కానీ జరిగే నిమజ్జనాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే హైదరాబాద్  లాంటి చోట్ల ప్రత్యేకంగా మినీ చెరువులను తవ్వించి అక్కడ నిమజ్జనాలు చేయాలని సూచిస్తున్నారు.  ఈ విషయంలో విశాఖ అధికారులు మరింత వినూత్నంగా ఆలోచించారు.  ఏకంగా చెరువులను ఇంటి వద్దకే పంపిస్తాం.. అక్కడే నిమజ్జనం చేయండి అని ప్రజలకు పిలుపునిస్తున్నారు. చెరువులను ఎలా పంపిస్తారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.. అయితే ట్యాంకుల్ని అలా చెరువుల్లా మార్చి పంపుతారన్నమాట. 

నిమజ్జనానికి మొబైల్ ట్యాంకులు ఏర్పాటు చేసిన జీవీఎంసీ అధికారులు

వినూత్నంగా వినాయక నిమజ్జనం చేపట్టేందుకు గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌  చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. బొజ్జ గణపయ్య విగ్రహాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిమజ్జనం చేసేందుకు మొబైల్ ట్యాంకులను ప్రవేశపెట్టింది. కృత్రిమ ట్యాంకుల ట్రయల్ రన్ ముగిసిన తర్వాత వాటిని విశాఖ నగరంలోని వివిధ ప్రదేశాల్లో అందుబాటులో ఉంచి ఇళ్లలో ప్రతిష్టించి పూజించిన గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయడంలో సహాయపడాలని ప్రయత్నిస్తున్నారు. గ్రేటర్‌ విశాఖ పరిధిలోని అన్ని మండలాలను కలుపుతూ 16 కృత్రిమ మొబైల్ నిమజ్జనం ట్యాంకులు నిలిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అవసరాన్ని బట్టి వీటి సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయించారు.  

లారీల్లో వాటర్ లీక్ కాకుండా నీళ్లు నింపి అందులోనే నిమజ్జనం 

మొబైల్‌ నిమజ్జనం కోసం కృత్రిమ ట్యాంక్‌లను సిద్ధం చేశారు. 10X16 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో భారీ వాహనాలను ఇందు కోసం తీర్చిదిద్దారు. వీటిని నీటితో నింపి ఆగస్టు 31 నుంచి వివిధ పాయింట్లలో ఉంచనున్నారు. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఇలాంటి పర్యావరణ అనుకూల నిమజ్జన పద్ధతులను అనుసరిస్తున్నారని, విశాఖలో ఇదే మొదటిసారి అని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీశ  చెబుతున్నారు.   విగ్రహాలను నిమజ్జనం చేసి సముద్రాన్ని కలుషింతం చేయకుండా నిలువరించేందుకు ఈ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 

మట్టి గణపతులు పెట్టిన వారికి సెల్ఫీ పోటీ..బహుమతులు కూడా !

విశాఖపట్నం ప్రజానీకాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా కార్పొరేషన్ సెల్ఫీ పోటీని కూడా అందుబాటులోకి తెచ్చింది. మట్టి విగ్రహాలతో గణపతిని పూజించిన వారు సెల్ఫీ దిగి పంపి బహుమతులు గెలుచుకోవచ్చునని జీవీఎంసీ అధికారులు వెల్లడించారు. విశాఖలో మట్టి విగ్రహాలు పెట్టాలనే క్యాంపెయిన్ కూడా చాలా కాలంగా విస్తృతంగా నడుస్తోంది. ఈ కారణంగానే విశాఖలో ఎక్కువగా పందిళ్లలో కూడా మట్టి విగ్రహాలనే పెడుతూ ఉంటారు. ఇప్పుడు నిమజ్జనం కూడా ఇలా ఇంటి వద్దకే వచ్చే ఏర్పాట్లు చేయడంతో ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రచారానికే పరిమితం కాకుండా నిజంగా ఈ కాన్సెప్ట్‌ను సక్సెస్ చేయాడనికి ప్రయత్నించాలని అధికారులకు హితవు పలుకుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Goa Sarswat Math: పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Advertisement

వీడియోలు

Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Goa Sarswat Math: పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
India GDP: భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
Annagaru Vostaru Teaser : నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది...  వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది... వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
Embed widget