News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

గంగవరం పోర్టు యాజమాన్యం దిద్దుబాటు చర్యలు- కొన్ని డిమాండ్‌లు అంగీకరించినట్టు అధికారుల ప్రకటన

కార్మిక సంఘాలతో గంగవరం పోర్టు యాజమాన్యం చర్చలు- కొన్ని డిమాండ్‌లకు అంగీకారం

FOLLOW US: 
Share:

విశాఖలోని గంగవరం పోర్టు వద్ద కార్మికులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీయడంతో యాజమాన్యం చర్చలు పిలిచింది. జిల్లా అధికారుల సమక్షంలో జరిగిన చర్చల్లో కొన్ని కీలకమైన డిమాండ్లకు అంగీకరించారు. వాటి వివరాలను కార్మికులకు ఆర్డీవో వివరించారు. 

కార్మికులు మొదటి నుంచి చేస్తున్న డిమాండ్‌ తమకు 24 వేల నుంచి 36 వేల రూపాయల వరకుజీతాలు ఇవ్వాలని. దీనికి యాజమాన్యం ఒప్పుకో లేదు. అయితే దీనికి బదులు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద ప్రతి కార్మికుడికి పదివేల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించింది. దీనికి తోడు ఇంక్రిమెంట్‌ ఇచ్చేటప్పుడు ‌అదనంగా వెయ్యి రూపాయలు ఇవ్వడానికి అంగీకరించింది. గతంలోనే ఈ ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ ప్రస్తావించారు. అయితే కార్మికులు దీనికి ఒప్పుకోలేదు. ఇప్పుడు మళ్లీ అదే ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. 

సమ్మె చేస్తున్నారన్న కారణంతో ఉద్యోగాల నుంచి తీసివేసిన ఐదుగురు కార్మికులను ఉద్యోగంలోకి తీసుకోవడానికి కూడా గంగవరం పోర్టు యాజమాన్యం ఒప్పుకుంది. అయితే గంగవరం పోర్టును ప్రస్తుత యాజమాన్యం బాధ్యతలు తీసుకోక ముందు ఉద్యోగాలు కోల్పోయిన వారిని పనిలోకి తీసుకోవడానికి అంగీకరించలేదు. 

డెత్‌ బెనిఫిట్స్ విషయంలో ఈఎస్‌ఐ రూల్స్ ఎలా ఉంటే అలా ఇచ్చేందుకు గంగవరం పోర్టు అధికారులు ఓకే చెప్పారు. ప్రస్తుతం 45 రోజుల నుంచి సమ్మె చేస్తున్న కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. నో వర్క్ నో పే అనే రూల్ దేశవ్యాప్తంగా అమలులో ఉందని తెలియజేసింది. అందుకే సమ్మె చేసిన కాలాన్ని ఎల్‌వోపీగా పరగిణించబోతున్నట్టు చెప్పుకొచ్చింది. 

కార్మికులు డిమాండ్ చేస్తున్నట్టు సమాన పనికి సమాన వేతనం అే అంశం చర్చకు రాలేది ఆర్డీవో చెప్పారు. ఇప్పటికైనా కార్మికులు శాంతించి ఇవాళ్టి నుంచి విధులకు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యాజమాన్యంతో సంబంధం లేకుండా ప్రభుత్వం గ్యారెంటీతో బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు కూడా అధికారులు ఓకే చెప్పారు. 

మరోవైపు కార్మికులు ఆగ్రహం మాత్రం చల్లారలేదు. తమ పొట్ట కొట్టిన వాళ్లు కోట్లు గడిస్తున్నారని తాము మాత్రం అర్ధాకలితో పడుకుంటున్నామంటున్నారు. అధికార పార్టీల అండ చూసుకొని అదానీ రెచ్చిపోతున్నారని నాలుగు గేట్లు పగులుగొట్టుకొచ్చిన తమకు మరో గేటు దాటడం పెద్ద కష్టం కాదన్నారు. తమ డిమాండ్లకు ఓకే చెప్పకుంటే మాత్రం సముద్ర మార్గంలో వచ్చి ముట్టడిస్తామని హెచ్చిరించారు. 

ఒక్కసారి సముద్రమార్గం నుంచి వస్తే కార్గోషిప్‌లను ఆపేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. తమకు సముద్ర కొత్త కాదని వేల మంది ప్రజలతో కచ్చితంగా ముట్టడిస్తామని అన్నారు. అదానీ సంపాదిస్తున్న లాభాల్లో 2 శాతమే అడుగుతున్నామని అన్నారు. పక్కనే ఉన్న విశాఖ పోర్టులో ఉద్యోగులకు కనీస వేతనం 40 వేలకుపై ఉంటే తమకు ఇక్కడ అందులో సగం కూడా లేదన్నారు. 

ఉదయం నుంచి గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.45 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న కార్మికులు ఇవాళ పోర్టు బంద్‌కు పిలుపునిచ్చారు. పోర్టు ముట్టడికి యత్నించారు. ఈ ఆందోళనకు కార్మికులు కుటుంబాలు వివిధ రాజకీయ పార్టీలు కదలి వచ్చాయి. ఈ బంద్‌ పిలుపుతో ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అయినా కార్మికులు వెనక్కి తగ్గలేదు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేట్లు, ముళ్ల కంచెలను దాటుకొని దూసుకెళ్లారు. ఈ ఉద్రిక్తతో పోలీసులకు గాయాలు అయ్యాయి. కార్మికులు కూడా గాయపడ్డారు కొందరు స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారకుండా గంగవరం పోర్టు యాజమాన్యంతో అధికారులు చర్చలు జరిపారు. 

Published at : 17 Aug 2023 01:41 PM (IST) Tags: VIZAG gangavaram port adani port Gajuwaka

ఇవి కూడా చూడండి

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్‌ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా

రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్‌ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా

AP Politics: జగన్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, ఈరోజు జనసైనికులు సైతం మోత మోగించాలి - నాదెండ్ల పిలుపు

AP Politics: జగన్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, ఈరోజు జనసైనికులు సైతం మోత మోగించాలి - నాదెండ్ల పిలుపు

జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు

జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు

టాప్ స్టోరీస్

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!