అన్వేషించండి

గంగవరం పోర్టు యాజమాన్యం దిద్దుబాటు చర్యలు- కొన్ని డిమాండ్‌లు అంగీకరించినట్టు అధికారుల ప్రకటన

కార్మిక సంఘాలతో గంగవరం పోర్టు యాజమాన్యం చర్చలు- కొన్ని డిమాండ్‌లకు అంగీకారం

విశాఖలోని గంగవరం పోర్టు వద్ద కార్మికులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీయడంతో యాజమాన్యం చర్చలు పిలిచింది. జిల్లా అధికారుల సమక్షంలో జరిగిన చర్చల్లో కొన్ని కీలకమైన డిమాండ్లకు అంగీకరించారు. వాటి వివరాలను కార్మికులకు ఆర్డీవో వివరించారు. 

కార్మికులు మొదటి నుంచి చేస్తున్న డిమాండ్‌ తమకు 24 వేల నుంచి 36 వేల రూపాయల వరకుజీతాలు ఇవ్వాలని. దీనికి యాజమాన్యం ఒప్పుకో లేదు. అయితే దీనికి బదులు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద ప్రతి కార్మికుడికి పదివేల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించింది. దీనికి తోడు ఇంక్రిమెంట్‌ ఇచ్చేటప్పుడు ‌అదనంగా వెయ్యి రూపాయలు ఇవ్వడానికి అంగీకరించింది. గతంలోనే ఈ ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ ప్రస్తావించారు. అయితే కార్మికులు దీనికి ఒప్పుకోలేదు. ఇప్పుడు మళ్లీ అదే ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. 

సమ్మె చేస్తున్నారన్న కారణంతో ఉద్యోగాల నుంచి తీసివేసిన ఐదుగురు కార్మికులను ఉద్యోగంలోకి తీసుకోవడానికి కూడా గంగవరం పోర్టు యాజమాన్యం ఒప్పుకుంది. అయితే గంగవరం పోర్టును ప్రస్తుత యాజమాన్యం బాధ్యతలు తీసుకోక ముందు ఉద్యోగాలు కోల్పోయిన వారిని పనిలోకి తీసుకోవడానికి అంగీకరించలేదు. 

డెత్‌ బెనిఫిట్స్ విషయంలో ఈఎస్‌ఐ రూల్స్ ఎలా ఉంటే అలా ఇచ్చేందుకు గంగవరం పోర్టు అధికారులు ఓకే చెప్పారు. ప్రస్తుతం 45 రోజుల నుంచి సమ్మె చేస్తున్న కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. నో వర్క్ నో పే అనే రూల్ దేశవ్యాప్తంగా అమలులో ఉందని తెలియజేసింది. అందుకే సమ్మె చేసిన కాలాన్ని ఎల్‌వోపీగా పరగిణించబోతున్నట్టు చెప్పుకొచ్చింది. 

కార్మికులు డిమాండ్ చేస్తున్నట్టు సమాన పనికి సమాన వేతనం అే అంశం చర్చకు రాలేది ఆర్డీవో చెప్పారు. ఇప్పటికైనా కార్మికులు శాంతించి ఇవాళ్టి నుంచి విధులకు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యాజమాన్యంతో సంబంధం లేకుండా ప్రభుత్వం గ్యారెంటీతో బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు కూడా అధికారులు ఓకే చెప్పారు. 

మరోవైపు కార్మికులు ఆగ్రహం మాత్రం చల్లారలేదు. తమ పొట్ట కొట్టిన వాళ్లు కోట్లు గడిస్తున్నారని తాము మాత్రం అర్ధాకలితో పడుకుంటున్నామంటున్నారు. అధికార పార్టీల అండ చూసుకొని అదానీ రెచ్చిపోతున్నారని నాలుగు గేట్లు పగులుగొట్టుకొచ్చిన తమకు మరో గేటు దాటడం పెద్ద కష్టం కాదన్నారు. తమ డిమాండ్లకు ఓకే చెప్పకుంటే మాత్రం సముద్ర మార్గంలో వచ్చి ముట్టడిస్తామని హెచ్చిరించారు. 

ఒక్కసారి సముద్రమార్గం నుంచి వస్తే కార్గోషిప్‌లను ఆపేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. తమకు సముద్ర కొత్త కాదని వేల మంది ప్రజలతో కచ్చితంగా ముట్టడిస్తామని అన్నారు. అదానీ సంపాదిస్తున్న లాభాల్లో 2 శాతమే అడుగుతున్నామని అన్నారు. పక్కనే ఉన్న విశాఖ పోర్టులో ఉద్యోగులకు కనీస వేతనం 40 వేలకుపై ఉంటే తమకు ఇక్కడ అందులో సగం కూడా లేదన్నారు. 

ఉదయం నుంచి గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.45 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న కార్మికులు ఇవాళ పోర్టు బంద్‌కు పిలుపునిచ్చారు. పోర్టు ముట్టడికి యత్నించారు. ఈ ఆందోళనకు కార్మికులు కుటుంబాలు వివిధ రాజకీయ పార్టీలు కదలి వచ్చాయి. ఈ బంద్‌ పిలుపుతో ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అయినా కార్మికులు వెనక్కి తగ్గలేదు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేట్లు, ముళ్ల కంచెలను దాటుకొని దూసుకెళ్లారు. ఈ ఉద్రిక్తతో పోలీసులకు గాయాలు అయ్యాయి. కార్మికులు కూడా గాయపడ్డారు కొందరు స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారకుండా గంగవరం పోర్టు యాజమాన్యంతో అధికారులు చర్చలు జరిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Drone Show: విజయవాడ పున్నమి ఘాట్‌లో డ్రోన్ షో అదుర్స్ - 5 గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌ సొంతం
విజయవాడ పున్నమి ఘాట్‌లో డ్రోన్ షో అదుర్స్ - 5 గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌ సొంతం
Junior Lecturers JL Results: జూనియర్‌ లెక్చరర్‌ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్
జూనియర్‌ లెక్చరర్‌ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్
Cyclone Dana Trains Cancel: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, దానా తుఫాను ప్రభావంతో భారీగా రైళ్లు రద్దు - లిస్ట్ చెక్ చేసుకోండి
రైల్వే ప్రయాణికులకు అలర్ట్, దానా తుఫాను ప్రభావంతో 3 రోజులు భారీగా రైళ్లు రద్దు - లిస్ట్ చెక్ చేసుకోండి
Muthyalamma Temple: సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో త్వరలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట- తలసాని
సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో త్వరలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట- తలసాని
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం ఇంట్లో పెత్తనం ఎవరిది? మా చెల్లెలిదా? నా కూతురిదా?విషం ఎక్కించినా చావని మొండోడు.. హమాస్‌ న్యూ చీఫ్ మాషల్మేం ఉండగా ఒక్క ఘటన లేదు, రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్బంకర్‌లో దర్జాగా బతికిన సిన్వర్, వీడియో విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Drone Show: విజయవాడ పున్నమి ఘాట్‌లో డ్రోన్ షో అదుర్స్ - 5 గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌ సొంతం
విజయవాడ పున్నమి ఘాట్‌లో డ్రోన్ షో అదుర్స్ - 5 గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌ సొంతం
Junior Lecturers JL Results: జూనియర్‌ లెక్చరర్‌ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్
జూనియర్‌ లెక్చరర్‌ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్
Cyclone Dana Trains Cancel: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, దానా తుఫాను ప్రభావంతో భారీగా రైళ్లు రద్దు - లిస్ట్ చెక్ చేసుకోండి
రైల్వే ప్రయాణికులకు అలర్ట్, దానా తుఫాను ప్రభావంతో 3 రోజులు భారీగా రైళ్లు రద్దు - లిస్ట్ చెక్ చేసుకోండి
Muthyalamma Temple: సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో త్వరలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట- తలసాని
సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో త్వరలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట- తలసాని
Vijayawada Drone Show: 5,500 డ్రోన్లతో ఆకాశంలో అద్భుతం, కృష్ణా తీరంలో అతిపెద్ద డ్రోన్‌ షో
5,500 డ్రోన్లతో ఆకాశంలో అద్భుతం, కృష్ణా తీరంలో అతిపెద్ద డ్రోన్‌ షో
Shamshabad Airport: శంషాబాద్‌లో దిగాల్సిన విమానం విజయవాడలో ఎమర్జెన్సీ ల్యాండింగ్, అసలేం జరిగింది
శంషాబాద్‌లో దిగాల్సిన విమానం విజయవాడలో ఎమర్జెన్సీ ల్యాండింగ్, అసలేం జరిగింది
Andhra Pradesh : వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు సహా కీలక సేవలు - మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు సహా కీలక సేవలు - మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
Jailer 2: రజనీకాంత్ సినిమాలో మాజీ అల్లుడి స్పెషల్ రోల్... ధనుష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్
రజనీకాంత్ సినిమాలో మాజీ అల్లుడి స్పెషల్ రోల్... ధనుష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్
Embed widget