అన్వేషించండి

AP Politics: జగన్ స్ట్రాటజీ వర్కౌట్ అయిందా ? లేదా విపక్షాలది వ్యూహాత్మక మౌనమా?

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేది లేదంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రకటనా .. టీడీపీ మహానాడు విజయవంతం కావడం లాంటి అంశాలతో సీఎం జగన్ అలెర్ట్ అయ్యారు.

నిన్నమొన్నటి వరకూ విపక్షాల మధ్య పొత్తులపై అనేక ఊహాగానాలు నడిచాయి. ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జోరు మీదున్న జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఏర్పడడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ఆ పొత్తు స్వరూపం ఎలా ఉంటుందనే అంశంపై అనేక ఊహాగానాలు నడిచాయి. ప్రస్తుతం ఈ అంశం చల్లబడింది. పొత్తుల మాట పక్కనబెట్టి అన్ని పార్టీలూ సొంతంగా బలపడే పనిలో పడ్డాయి. దీనితో దమ్ముంటే ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాలన్న వైసీపీ సవాల్‌ను విపక్షాలు స్వీకరించాయా అన్న సందేహాలు వెలువడుతున్నాయి. ఒకవేళ అదే నిజం అయితే జగన్ ట్రాప్‌లో విపక్షాలు పడ్డట్టే అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి . 

పవన్ కల్యాణ్‌ కేంద్రంగా ఏపీలో పొత్తుల రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయాల్లో ముఖ్యమైన అంశంగా జనసేన మారింది అనడంలో అనుమానం లేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితమైందా పార్టీ. అధ్యక్షుడే ఓడిపోయిన పరిస్థితి నుంచి మూడేళ్ళలోనే జనసేన కీలక పాత్ర పోషించేలా ఎదిగింది అంటున్నారు విశ్లేషకులు. దానితో ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో పవన్ కల్యాణ్ పాత్ర ప్రముఖంగా మారింది. ముందుగా 2024 ఎన్నికల గురించి .. పొత్తుల గురించీ ప్రస్తావన తెచ్చింది పవనే కావడం ఇక్కడ మరో కీ పాయింట్. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని ఆయన ఇచ్చిన పిలుపు ఏపీలో సంచలనంగా మారింది.

పవన్‌ చేసిన ఆ కామెంట్‌ ఏపీలో విపక్షాల మధ్య పొత్తు ఖాయమనే చర్చ మొదలైంది. ఇప్పటికే బీజేపీతో భేషరతు పొత్తులో ఉన్న జనసేన టీడీపీతోనూ జంట కట్టడం ఖాయమనే అభిప్రాయం అందరిలోనూ కలిగింది. అయితే ఏమైందో ఏమో గానీ సడన్‌గా మాట మార్చారు. పార్టీలతో కాదు... ప్రజలతోనే పొత్తు ఉంటుంది అంటూ మళ్ళీ వార్తల్లో నిలిచారు. 

సొంతంగా బలపడే ప్రయత్నాల్లో టీడీపీ

మహానాడు సక్సెస్ ఇచ్చిన ఊపులో టీడీపీ నూతన ఉత్సాహంతో కనపడుతుంది. ఇటీవల చంద్రబాబు పెడుతున్న సభలకు, ర్యాలీలకు జనం పోటెత్తుతున్నారు. దానితో పొత్తులపై దృష్టి కంటే జనంలో వస్తున్న స్పందనను ఓట్లగా మార్చుకోవడమే మంచిది అనే అభిప్రాయంలో టీడీపీ  అధినాయకత్వం పడింది అంటున్నాయి పార్టీ వర్గాలు. నిజానికి జనసేనతో పొత్తు విషయమై స్పందించింది టీడీపీనే. తమది వన్ సైడ్ లవ్ అంటూ ప్రకటించి సంచలనం రేపారు చంద్రబాబు. భీమ్లా నాయక్ రిలీజ్ సమయంలో జనసేనతో సమానంగా.. పవన్‌కు మద్దతుగా నిలిచింది టీడీపీ శ్రేణులే అన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిణామాల్లో పొత్తు విషయమై మౌనం పాటిస్తున్నారు చంద్రబాబు. అలాగే పొత్తుల విషయం ప్రస్తుతానికి పక్కనబెట్టి వివిధ నియోజకవర్గాలకు అభ్యర్థులను సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు.

పొత్తుల వ్యవహారంలో అసలుపాత్ర బీజేపీదే

ఇక ఏపీలో పొత్తుల వ్యవహారంలో కీలక పాత్ర బీజేపీనే పోషిస్తుంది. టీడీపీ -జనసేన -బీజేపీ పొత్తు ఏర్పడాలని జనసేన భావించినప్పటికీ.. టీడీపీ తో పొత్తు విషయంలో బీజేపీ అంత సుముఖంగా లేదన్న వాదనలు ఉన్నాయి. అలాగే టీడీపీ కూడా బీజేపీతో కంటే జనసేనతో పొత్తునే ఆశించింది. ఇక ప్రస్తుత పరిణామాల్లో ఇవి జరిగే పని కాకపోవడంతో ఎవరి పార్టీ వ్యవహారాల్లో వారు మునిగిపోయారు. ఇక బీజేపీ -జనసేన పొత్తు కూడా ఏ మలుపులు తిరుగుతుందో చెప్పలేం అంటున్నారు విశ్లేషకులు. 

జగన్ స్ట్రాటజీనే అసలు కారణం ?

అవునన్నా .. కాదన్నా ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లకు ఎంతో కొంత వ్యతిరేకత సహజం. ఇటీవల గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులకూ, ఎమ్మెల్యే లకూ ఎదురైన సంఘటనలే దీనికి ఉదాహరణ అనే వాదన ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేది లేదంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రకటనా .. టీడీపీ మహానాడు విజయవంతం కావడం లాంటి అంశాలతో సీఎం జగన్ అలెర్ట్ అయ్యారు. దానితో వారి మధ్య పొత్తు ఆపడానికి వైసీపీ నేతలతో పదేపదే విపక్షాలకు దమ్ముంటే ఒంటరిగా పోటీ చెయ్యాలంటూ సవాల్ విసిరేలా వ్యూహం పన్నారని వాదనలు వినవస్తున్నాయి. మరి ఆ స్ట్రాటజీ పని చేసిందో ఏమోగానీ.. విపక్షాలు ప్రస్తుతం పొత్తు మాట ఎత్తడం లేదు. దీనితో జగన్ ట్రాప్‌లో అపోజిషన్ పార్టీలు పడ్డాయి అంటున్నారు. మరి దీనిపై విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
Embed widget