అన్వేషించండి

కేసీఆర్, కేటీఆర్‌ది సెంటిమెంట్ రాజకీయం- స్టీల్‌ప్లాంట్‌పై కొత్త మోసానికి రెడీ: విష్ణువర్దన్

స్టీల్‌ప్లాంట్‌ పేరుతో కేసీఆర్‌ కొత్త డ్రామాకు తెరతీశారని విమర్శిస్తున్న బీజేపీ లీడర్ విష్ణువర్దన్ రెడ్డి

తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టు ఏపీ ప్రజలను మోసం చేసేందుకే కేసీఆర్, కేటీఆర్‌ మరో ఎత్తుగడ వేస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి. స్టీల్‌ప్లాంట్ సెంటిమెంట్‌తో 2024లో లబ్ధి పొందే ప్రయత్నాల్లో ఉన్నారని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్‌ కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేయబోతుందని వస్తున్న ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కెసిఆర్, కేటీఆర్ స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసం యువత ప్రాణాలు ఫణంగా పెట్టొద్దని హితవు పలికారు విష్ణువర్దన్ రెడ్డి. సెంటిమెంట్ రాజకీయాలకు పేరు మోసిన బీఆర్‌ఎస్‌ ఇప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ను ఆయుధంగా చేసుకోబోతోందన్నారు. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట అన్నట్టు ఉందని కేసీఆర్ వ్యవహారమని ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లికి  సింగరేణితో కలిసి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టిస్తానని కోతలు కోసి నాలుగేళ్లు దాటిపోయిందని గుర్తు చేశారు. కనీసం పునాది కూడా పడలేదన్నారు. 

ఉదయం నుంచి వరుస ట్వీట్లు చేస్తున్న విష్ణువర్దన్ రెడ్డి... చివరకు ఓ వీడియో కూడా విడుదల చేశారు. ఇదంతా ఓట్ల కోసం చేస్తున్న గిమ్మిక్కుగానే అభివర్ణించారు. మొన్న సింగరేణిని మోదీ ప్రైవేటుపరం చేస్తున్నారని ఆందోళనలు చేశారని... ఇప్పుడు మాత్రం సింగరేణితో విశాఖ స్టీల్ ప్లాంట్‌నే కొనిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. నాటి ఆరోపణలు ఇప్పుడు చేస్తున్న ప్రతిపాదనకు ఎక్కడా పొంతన లేదన్నారు. ఇలా అయితే దొరికిపోతామని మీకెవరూ చెప్పలేదా ప్రజలు పిచ్చోళ్లు అనుకుంటున్నారా అని సెటైర్లు వేశారు. 

విశాఖ ఉక్కుపేరుతో మరో మోసానికి తండ్రీ కుమారులు బయల్దేరారని.. వీళ్లకు ప్రజలు ఓ మాదిరిగా కూడా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను లాభాల బాట పట్టించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుందన్నారు విష్ణు. పెట్టుబడులు సేకరిస్తేంటే దాన్ని తరలిస్తారని... అమ్మెస్తరంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టుగానే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను కూడా మోసం చేయడానికి సిద్ధపడ్డారని విష్ణు వర్దన్ మండిపడ్డారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను ఏం చేస్తున్నారో అందరికి తెలుసని కామెంట్ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 2024లో లబ్ధి పొంది ఓట్లు వేయించుకునేందుకు మరో సెంటిమెంట్‌తో వస్తున్నారని దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Embed widget