అన్వేషించండి

Dharmana comments: నిజాయితీ పాలన కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు - మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు

మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి సంచలన కామెంట్ చేశారు. ప్రభుత్వాల నీతి, నిజాయితీని ప్రజలు గమనిస్తున్నారని... అ దిశగానే ప్రభుత్వాలు పని చేయాలంటూ వ్యాఖ్యానించారు.

నిజాయితీగల పాలన కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంత్రి ధర్మాన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పార్టీ, ప్రభుత్వం రెండు సమన్వయంతో పని చేసి లీడర్లలో ఉన్న సంతృప్తిని తగ్గించాలని సూచించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. చట్టం పరిధిలో పని చేయాల్సిన ప్రభుత్వానికి కొన్ని పరిధిలు ఉంటాయన్నారు. అలాంటి టైంలో ప్రభుత్వం చేయలేని పనులను పార్టీ చేయాలని తెలిపారు. పార్టీ అప్పగించిన పనులు చేయడానికి సమర్థులను గుర్తించాలన్నారు. 

వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా దాసన్న బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో అనుబంధ విభాగాలను పటిష్టం చేయాలని ధర్మాన సూచించారు. తొమ్మిదేళ్లు పని చాలా మందికి పార్టీ, ప్రభుత్వ పదవులు వచ్చాయన్న ఆయన.. రాని వారిలో అసంతృప్తి ఉందన్నారు. అలాంటి వారి వల్ల పార్టీ బలహీన పడకూదన్నారు. వ్యక్తి నీరశతో పార్టీ బలహీన పడితే అందరూ దెబ్బతింటారని హెచ్చరించారు. పార్టీ బలపడి మళ్లీ అధికారంలోకి వస్తే ఆ నిరాశతో ఉన్న వ్యక్తికి మంచి పదవి వచ్చే అవకాశం ఉందన్నారు. మరుగున పడిపోయిన చాలా మందికి ఇప్పుడు పదవులు వచ్చాయని ఉదాహరించారు. 

అసంతృప్తులను తప్పించి పార్టీ అనుబంధ విభాగాల్లో కొత్త రక్తం ఎక్కించాలని సూచించారు ధర్మాన. కొత్త జనరేషన్ వస్తే తన సామర్థ్యాన్ని రుజువు చేసుకోవడానికి ఎక్కువ పని చేస్తారని చెప్పారు. ఏ రాజకీయ పార్టీలోనైనా ఇలానే జరుగుతుందని పేర్కొన్నారు. అనుబంధ విభాగలకు సంబంధించిన నాయకత్వ ఎంపిక కార్యకర్తలే నిర్వహించుకునేలా చేయాలన్నారు. సభ్యులంతా ఒకచోట కూర్చొని నాయకుడిని ఎంపిక చేసుకుంటే మంచిదన్నారు. క్షేత్రస్థాయిలో తేలని పక్షంలో రెండు మూడు పేర్లతో వస్తే జిల్లా నాయకత్వం నిర్ణయించాలని సూచించారు. దీని వల్ల ఒక్కో యూనిట్‌లో కార్యకర్తల ఆమోదం కలిగిన వాళ్లు నాయకత్వంలోకి వచ్చేస్తారన్నారు. 

ఈ రెండేళ్లలలో భిన్నంగా పని చేయాల్సిన అవసరం ఉందన్న ధర్మాన ఆ మేరకు సీఎం జగన్ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్న పార్టీ పనితీరు చూసి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లేస్తారని పేర్కొన్నారు. ఈ పార్టీ ప్రజలకు ఏం చెప్పింది, ఏం చేసింది, ఎలా వ్యవహరించింది, ఎంత నిజాయితీగా ఉంది అనేది చూస్తారన్నారు. ఇప్పుడు దేశంలో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోందన్నారు. దేశంలోని ప్రజలు నీతి నిజాయితీ ప్రభుత్వాల కోసం చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. 

పంజాబ్‌లో ప్రజలు ఆప్‌ పని తీరు చూసి మాత్రమే గెలిపించారన్నారు మంత్రి ధర్మాన. కులం అడ్డంపెట్టుకొని గెలుస్తాడని, మతం అడ్డం పెట్టుకుంటే గెలుస్తారని... ఓ ప్రాంతం కోసం ఆందోళన చేసిన వ్యక్తినే గెలిపిస్తారని అనుకోవచ్చు. పంజాబ్‌లో ఆప్‌  కులం, మతం, డబ్బు ఏమీ లేకుండా గెలిచిందన్నారు. దిల్లీలో ఆపార్టీ పాలన చూసిన వాళ్లంతా ఆప్‌కు పట్టం కట్టారని తెలిపారు. 

అందుకే ఇక్కడ కూడా అవినీతి ఏ స్థాయిలో ఉన్నా కట్‌ చేయాలని సీఎం ఆలోచిస్తున్నారని గుర్తు చేశారు ధర్మాన. నిజాయితీగా లేకుంటే కష్టమని సీఎం కూడా అందరికీ సంకేతాలు ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి చూపించిన దిశలో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. తన అవసరం ఎప్పుడు వచ్చినా పార్టీ కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని కార్యకర్తలకు, జిల్లా నాయకులకు తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
Embed widget