అన్వేషించండి

MP GVL On Ysrcp : 2018లో టీడీపీకి పట్టిన గతే వైసీపీకి పడుతుంది, ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

MP GVL On Ysrcp : ప్రజావ్యతిరేకతను కేంద్రంపై నెట్టేద్దామని చూస్తే 2018లో టీడీపీకి పట్టిన గతే వైసీపీకి పడుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ హెచ్చరించారు.

MP GVL On Ysrcp : పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన...కేంద్రంపై నిందలు మోపాలని చూస్తే 2018లో టీడీపీకి పట్టిన గతే వైసీపీకి పడుతుందని హెచ్చరించారు. వైసీపీ ఎంపీలు 2018లో ఏం జరిగిందో రీల్ వేసుకుని చూసుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రజావ్యతిరేకతను కేంద్రంపై నెట్టేందుకు వైసీపీ చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఏపీలో నాలుగేళ్ల పాలనలో వైసీపీ పూర్తిగా విఫలమైందని ఎంపీ జీవీఎల్ విమర్శలు చేశారు. కేంద్రం నిధులు ఇస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలేదని విమర్శించారు. పారిశ్రామిక నగరాల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడంలేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఏపీలో పాలన చాలా దయనీయ పరిస్థితిలో ఉందన్నారు. 

వైసీపీపై ప్రజావ్యతిరేకత 

"నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. ఈ విషయం ప్రజలకు స్పష్టం తెలిసిపోయింది. రాష్ట్రంలో ఉద్యోగులుక వేతనాలు పడడంలేదు. బహుశా చరిత్రలో మొదటిసారి ఏ తేదీకి జీతాలు పడతాయో, అసలు పడతాయో లేదో అన్న అగమ్యగోచర పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్ర పరిపాలన వ్యవస్థ చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. దీనికి వైసీపీ రాజకీయ మూల్యం చెల్లించుకోకతప్పదు. కేంద్రం అనేక ప్రాజెక్టులను రాష్ట్రానికి కేటాయిస్తే కనీసం తన వంతు బాధ్యతను పూర్తిచేయలేని చేతగాని ప్రభుత్వం వైసీపీ. రాష్ట్ర విభజన తర్వాత రూ.4800 కోట్లు రైల్వే బడ్జెట్ లో ఏపీకి కేంద్రం కేటాయించింది. కానీ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా చేతగాని ప్రభుత్వంలాగా వ్యవహరిస్తుంది. ఏపీ అభివృద్ధిపై వైసీపీకి చిత్తశుద్ధి లేదు. వైసీపీని ఏపీ ప్రజలు ఛీకొడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజలు మానసికంగా సిద్ధమయ్యారు."- బీజేపీ ఎంపీ జీవీఎల్ 

టీడీపీకి పట్టిన గతే వైసీపీకి 

"పార్లమెంట్ లో వైసీపీ ఎంపీల తీరు చూస్తుంటే... ప్రజా వ్యతిరేకతను కేంద్రంపై నెట్టేద్దామని 2018లో ఎలాంటి చౌకబారు ప్రయత్నం జరిగిందో ఐదేళ్ల తర్వాత కూడా అదే ప్రయత్నం మళ్లీ జరుగుతోంది. విజయసాయిరెడ్డి, మార్గాని భరత్, వీళ్లందరూ అబద్దాలు మాట్లాడుతూ కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారు. పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయండి, వాటి మౌలిక సదుపాయాలు కేంద్రం చూసుకుంటుందని చెబితే ఎందుకు స్పందించడంలేదు. విశాఖలో పారిశ్రామిక నగరాన్ని కట్టడానికి భూసేకరణ చేశారా? ఎక్కడ భూదందాలు చేయాలని ఉన్న శ్రద్ధ, ప్రజలకు ఉపయోగపడే పారిశ్రామిక నగరాలు కట్టాలని వైసీపీకి ఉందా?. లేదా ఉన్న పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లగొట్టేందుకు మేము సిద్ధహస్తులం. ఇందులో వైసీపీకి పేటెంట్ ఉంది అని కొత్తగా అజెండా లేవనెత్తుతారా? వైసీపీ తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తే, వైసీపీకి కూడా అదే గతిపడుతుంది. బీజేపీ, జనసేన కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. 2024లో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో బీజేపీ, జనసేన ప్రభుత్వం.... డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. వైసీపీ గ్రాఫ్ చాలా డ్రాస్టిక్ గా పడిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోరు యాత్రలు చేస్తాం." - ఎంపీ జీవీఎల్ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
Embed widget