అన్వేషించండి

MP GVL On Ysrcp : 2018లో టీడీపీకి పట్టిన గతే వైసీపీకి పడుతుంది, ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

MP GVL On Ysrcp : ప్రజావ్యతిరేకతను కేంద్రంపై నెట్టేద్దామని చూస్తే 2018లో టీడీపీకి పట్టిన గతే వైసీపీకి పడుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ హెచ్చరించారు.

MP GVL On Ysrcp : పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన...కేంద్రంపై నిందలు మోపాలని చూస్తే 2018లో టీడీపీకి పట్టిన గతే వైసీపీకి పడుతుందని హెచ్చరించారు. వైసీపీ ఎంపీలు 2018లో ఏం జరిగిందో రీల్ వేసుకుని చూసుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రజావ్యతిరేకతను కేంద్రంపై నెట్టేందుకు వైసీపీ చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఏపీలో నాలుగేళ్ల పాలనలో వైసీపీ పూర్తిగా విఫలమైందని ఎంపీ జీవీఎల్ విమర్శలు చేశారు. కేంద్రం నిధులు ఇస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలేదని విమర్శించారు. పారిశ్రామిక నగరాల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడంలేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఏపీలో పాలన చాలా దయనీయ పరిస్థితిలో ఉందన్నారు. 

వైసీపీపై ప్రజావ్యతిరేకత 

"నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. ఈ విషయం ప్రజలకు స్పష్టం తెలిసిపోయింది. రాష్ట్రంలో ఉద్యోగులుక వేతనాలు పడడంలేదు. బహుశా చరిత్రలో మొదటిసారి ఏ తేదీకి జీతాలు పడతాయో, అసలు పడతాయో లేదో అన్న అగమ్యగోచర పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్ర పరిపాలన వ్యవస్థ చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. దీనికి వైసీపీ రాజకీయ మూల్యం చెల్లించుకోకతప్పదు. కేంద్రం అనేక ప్రాజెక్టులను రాష్ట్రానికి కేటాయిస్తే కనీసం తన వంతు బాధ్యతను పూర్తిచేయలేని చేతగాని ప్రభుత్వం వైసీపీ. రాష్ట్ర విభజన తర్వాత రూ.4800 కోట్లు రైల్వే బడ్జెట్ లో ఏపీకి కేంద్రం కేటాయించింది. కానీ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా చేతగాని ప్రభుత్వంలాగా వ్యవహరిస్తుంది. ఏపీ అభివృద్ధిపై వైసీపీకి చిత్తశుద్ధి లేదు. వైసీపీని ఏపీ ప్రజలు ఛీకొడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజలు మానసికంగా సిద్ధమయ్యారు."- బీజేపీ ఎంపీ జీవీఎల్ 

టీడీపీకి పట్టిన గతే వైసీపీకి 

"పార్లమెంట్ లో వైసీపీ ఎంపీల తీరు చూస్తుంటే... ప్రజా వ్యతిరేకతను కేంద్రంపై నెట్టేద్దామని 2018లో ఎలాంటి చౌకబారు ప్రయత్నం జరిగిందో ఐదేళ్ల తర్వాత కూడా అదే ప్రయత్నం మళ్లీ జరుగుతోంది. విజయసాయిరెడ్డి, మార్గాని భరత్, వీళ్లందరూ అబద్దాలు మాట్లాడుతూ కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారు. పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయండి, వాటి మౌలిక సదుపాయాలు కేంద్రం చూసుకుంటుందని చెబితే ఎందుకు స్పందించడంలేదు. విశాఖలో పారిశ్రామిక నగరాన్ని కట్టడానికి భూసేకరణ చేశారా? ఎక్కడ భూదందాలు చేయాలని ఉన్న శ్రద్ధ, ప్రజలకు ఉపయోగపడే పారిశ్రామిక నగరాలు కట్టాలని వైసీపీకి ఉందా?. లేదా ఉన్న పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లగొట్టేందుకు మేము సిద్ధహస్తులం. ఇందులో వైసీపీకి పేటెంట్ ఉంది అని కొత్తగా అజెండా లేవనెత్తుతారా? వైసీపీ తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తే, వైసీపీకి కూడా అదే గతిపడుతుంది. బీజేపీ, జనసేన కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. 2024లో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో బీజేపీ, జనసేన ప్రభుత్వం.... డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. వైసీపీ గ్రాఫ్ చాలా డ్రాస్టిక్ గా పడిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోరు యాత్రలు చేస్తాం." - ఎంపీ జీవీఎల్ 

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Fans Meet 2026: నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
Breaking News: నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
AP DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ - లోకేష్ రాజీనామా, సీబీఐ విచారణకు రోజా, పేర్ని నాని డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ - లోకేష్ రాజీనామా, సీబీఐ విచారణకు రోజా, పేర్ని నాని డిమాండ్!
Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget