అన్వేషించండి

Palnadu News: పల్నాడులో జరిగిన దాడి టీడీపీ అంతర్గత పోరే- వైసీపీతో సంబంధం లేదని తేల్చిన పోలీసులు

రొంపిచెర్ల మండల టీడీపీ అద్యక్షుడు వెన్నా బాల కోటి రెడ్డి జరిగిన దాడి కేసులో డీఎస్పీ విజయ్‌భాస్కర్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టారు. అలవాల గ్రామంలోని టీడీపీలో రెండు వర్గాలు ఉన్నాయని చెప్పారు.

టీడీపీలోని రెండు వర్గాల మధ్య కారణంగానే పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలోని అలవాల గ్రామంలో గొడవలు చెలరేగాయని తేల్చారు పోలీసులు. మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నాబాలకోటిరెడ్డిపై  జరిగిన హత్యాయత్నం జిల్లాలోనే సంచలనంగా మారింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేయించిన కుట్రగా టీడీపీ ఆరోపించింది. వైసీపీ కూడా టీడీపీని తప్పుపట్టింది. ఇలా రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరుగుతున్న టైంలో పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు.  

రొంపిచెర్ల మండల టీడీపీ అద్యక్షుడు వెన్నా బాల కోటి రెడ్డి జరిగిన దాడి కేసులో డీఎస్పీ విజయ్‌భాస్కర్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టారు. అలవాల గ్రామంలోని టీడీపీలో రెండు వర్గాలు ఉన్నాయని చెప్పారు. వారి మధ్య ఆధిపత్య పోరు కాస్త ఇలా దాడికి దారి తీసిందన్నారు. ఆధిపత్య పోరులో భాగంగానే బాల కోటిరెడ్డిపై దాడి జరిగిందని వివరించారు. గత పంచాయతీ ఎన్నికల నుంచి ఇద్దరు టీడీపీ నేతలు వెన్నా బాల కోటి రెడ్డి -వెంకటేశ్వరరెడ్డి మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయని తెలిపారు.

ఎలాగైనా బాలకోటిరెడ్డిపై పైచేయి సాధించాలన్న కసితోనే వాకింగ్ ట్రాక్ వద్ద వెంకటేశ్వర రెడ్డి దాడి చేసినట్టు పోలీసులు వివరించారు. బాల కోటిరెడ్డి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు వెంకటేశ్వరరెడ్డిపై హత్య యత్నం కేసు నమోదు చేశారు. నిందితుడు వెంకటేశ్వర రెడ్డిని అదుపులో తీసుకున్నారు. 

వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ... దాడికి ప్రధాన సూత్రధారైన పమ్మి వెంకటేశ్వరరెడ్డి తనంతట తానే స్వయంగా రూరల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడని తెలిపారు. దాడికి గురైన బాలకోటిరెడ్డి, దాడికి పాల్పడిన వెంకటేశ్వరరెడ్డి ఇద్దరు బంధువులేనన్నారు. టీడీపీలో వారి ఇరువురి మధ్య జరిగిన వర్గపోరే దాడికి కారణమని అభిప్రాయపడ్డారు.
ఇరువురి మధ్య వర్గపోరును 4 రోజుల నుంచి తీవ్రమైందన్నారు. అధిష్ఠానం కూడా అధిష్ఠానం కూడా ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా అది విఫలమైందని వివరించారు. 

పార్టీలో జరుగుతున్న పోరును ప్రభుత్వం దాడిగా చిత్రీకరించి కేసును పక్కదారి పట్టించేందుకు టీడీపీ ప్రయత్నించిందని ఆరోపించారు శ్రీనివాస్‌రెడ్డి. కేసు దర్యాప్తులో ఉండగానే టీడీపీ లీడర్లు వైసీపీపై బురద జల్లే ప్రయత్నం మొదలుపెట్టారని మండిపడ్డారు. అసలు వాస్తవాలు తెలుసుకునే ఓపిక లేని చంద్రబాబు, లోకేశ్, అచ్చెం నాయుడు, జీవీ ఆంజనేయులు, పత్తిపాటి పుల్లారావు ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యాయత్నానికి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రొంపిచర్ల ఎంపీపీ భర్తపై చేసే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్య పోరే జరిగి దాడికి కారణం అని తేల్చిచెప్పారు శ్రీనివాస్‌రెడ్డి. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకు వాస్తవాలు తెలుసుకునే ఓపిక కూడా లేదని నిప్పులు చెరిగారు. ఎప్పుడు చూడు జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ నాయకుల మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. గుడ్డ కాల్చి మొహానా వేస్తే వాళ్లే తుడుచుకుంటారనే ధోరణిలో టీడీపీ వారంతా ఉన్నారని అన్నారు. దాడి జరిగిన వెంటే వాస్తవాలు తెలుసుకునేందుకు గ్రామంలో అందరితో మాట్లాడామని వివరించారు. ఎవరిని అడిగిన వెంకటేశ్వర రెడ్డి పేరే చెబుతున్నారని వివరించారు.

ప్రశాతంగా ఉన్న గ్రామంలో గతంలో తిరునాళ్ల సమయంలో టీడీపీ వాళ్లే దాడిచేశారని, కానీ తాము ప్రతిదాడి చేయలేదన్నారు శ్రీనివాస్ రెడ్డి. దాడులను జగన్ కానీ వైసీపీ ప్రభుత్వం కాని ప్రోత్సహించదని స్పష్టం చేశారు. నరసరావుపేటలో 20 ఏళ్లు హత్యా రాజకీయాలను పెంచి ప్రోత్సహించింది టీడీపీనే అని ఆరోపించారు. ఇప్పుడు గ్రామాల్లో అల్లర్లు సృష్టించి స్వార్థ రాజకీయాల కోసం రెచ్చగొట్టే  ధోరణిలో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వాస్తవాలు తెలుసుకోకుండా, ఆధారాలు లేకుండా  మాట్లాడితే బాగోదని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని స్పష్టం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
Embed widget