అన్వేషించండి

Pawan Kalyan: విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో పవన్ కల్యాణ్, వారాహిపైకి ఎక్కి అభివాదం

కనకదుర్గ ఆలయం నుంచి పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు అక్కడ జనసేన నేతలకు అందుబాటులో ఉంటారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన ప్రచార రథం వారాహికి ఆలయంలో వాహనపూజ నిర్వహించారు. అనంతరం పవన్ కల్యాణ్ తొలిసారి వారాహి వాహనం పైకి ఎక్కి ప్రసంగించారు. అక్కడి నుంచే ఆయన జనానికి అభివాదం చేస్తూ వెళ్లారు. పవన్ కల్యాణ్ దుర్గ గుడికి రావడంతో పక్కనే ఉన్న ఫ్లైఓవర్ సహా రోడ్లన్నీ జనంతో కిక్కిరిసి పోయాయి. పవన్ కల్యాణ్ ను చూసిన జనం హుషారుతో, ఉత్సాహంతో నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తొలుత ఆలయానికి కారులో చేరుకున్న పవన్ కల్యాణ్ దుర్గమ్మను దర్శించుకున్నారు. పవన్‌కు ఆలయ అధికారులు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఆయనతో పాటు పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. గుడిలో ప్రత్యేక పూజలు చేశాక, వాహనానికి పవన్ పూజ చేయించారు.

అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలను పవన్ కళ్యాణ్ సమర్పించారు. పవన్ కళ్యాణ్ కి, నాదెండ్ల మనోహర్ కి ఆలయ మర్యాదలతో ఆలయ ఈవో భ్రమరాంబ, అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. అమ్మవారిని అంతరాలయం గుండా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారికి ఆలయ ఆవరణలో వేద పండితుల ఆశీర్వచనం అందించారు. ఇంద్రకీలాద్రి కింద జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.


Pawan Kalyan: విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో పవన్ కల్యాణ్, వారాహిపైకి ఎక్కి అభివాదం

ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సుల కోసం ఇంద్రకీలాద్రి వచ్చానని అన్నారు. కొండగట్టులో వారాహికి పూజలు చేయించానని, ఆలయ ప్రాంగణంలో రాజకీయాలు మాట్లాడబోనని అన్నారు. ఆంధ్ర అంతా సుభిక్షంగా ఉండాలి. కొత్త లీడర్లు రావాలని ఆకాంక్షించారు. రాక్షస పాలనను తరిమికొట్టడమే వారాహి లక్ష్యం అని పవన్ కల్యాణ్ మాట్లాడారు.

అనంతరం జనసేనాని మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన నేతలకు అందుబాటులో ఉండాలని భావిస్తున్నారు. నేడు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో వైఎస్ఆఱ్ సీపీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై పార్టీ ముఖ్య నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget