అన్వేషించండి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు, అక్కడినుంచే స్టార్ట్

Pawan Kalyan: పవన్ నాలుగో విడత వారాహి యాత్రకు షెడ్యూల్ ఖరారు అయింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కృష్ణా జిల్లాలో యాత్ర చేపట్టనున్నారు.

Pawan Kalyan: చంద్రబాబు అరెస్ట్, టీడీపీతో జనసేన పొత్తు ప్రకటన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యారు. అయితే చంద్రబాబుకు కోర్టుల్లో ఊరట లభించకపోవడం, జైలు నుంచి బయటకు రావడానికి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో.. ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా నాలుగో విడత వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 1 నుంచి పవన్ నాలుగో విడత వారాహి యాత్ర స్టార్ట్ కానుంది. ఈ సారి ఉమ్మడి కృష్ణా జిల్లాలో పవన్ పర్యటించనున్నారు.  

అవనిగడ్డలో వారాహి యాత్ర ప్రారంభం కానుండగా.. మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో యాత్ర జరగనుంది. సోమవారం ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారాహి యాత్ర ఏర్పాట్లపై జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. వారాహి యాత్రకు ఏర్పాట్లు మొదలుపెట్టాలని, అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వారాహి యాత్ర విజయవంతం అయ్యేలా కృషి చేయాలని సూచించారు. బహిరంగ సభలకు ఏర్పాట్లు, పోలీసుల అనుమతి తీసుకోవాలని నేతలను సూచించారు.

అక్టోబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వారాహి యాత్ర పవన్ చేపట్టనున్నారు. యాత్రలో భాగంగా పలు నియోకవర్గాల్లో పవన్ భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన పవన్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి ఆయనతో ములాఖత్ అయ్యారు. అనంతరం చంద్రబాబు కుటుంబసభ్యులను పరామర్శించారు. నారా లోకేష్, భువనేశ్వరి, బాలకృష్ణ, బ్రాహ్మణితో భేటీ అయ్యారు. ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. 

చంద్రబాబుతో ములాఖత్ అనంతరం టీడీపీతో పొత్తుపై పవన్ అధికారికంగా ప్రకటన చేయడంతో పాటు ఇప్పటినుంచి కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. విడివిడిగా పోటీ చేస్తే జగన్‌ను ఓడించలేమని, అందుకే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు లోకేష్, బాలకృష్ణ సమక్షంలో స్పష్టం చేశారు. మరుసటి రోజు జనసేన కార్యాలయంలో జరిగిన నేతల సమావేశంలో సోషల్ మీడియాలో పొత్తు గురించి నెగిటివ్ కామెంట్స్ ఎవరూ పెట్టవద్దని, టీడీపీ నేతలను విమర్శించవద్దని తెలిపారు. పొత్తుకు అందరూ సహకరించాలని కోరారు. టీడీపీ 40  ఏళ్ల నుంచి ఉన్న పార్టీ అని, ఆ పార్టీకి ప్రజల్లో బలంగా ఉందని చెప్పారు.

చంద్రబాబు అరెస్ట్ క్రమంలో పవన్ వారాహి యాత్రతో ఏపీ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. చంద్రబాబు అరెస్ట్ గురించి పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. గత మూడు విడతల వారాహి యాత్రలో వాలంటీర్స్ టార్గెట్‌గా పవన్ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే జగన్ ప్రభుత్వంలోని అవినీతి, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తీరు గురించి విమర్శలు చేశారు. అయితే ఈ సారి పవన్ ఎవరని టార్గెట్ చేస్తారనేది రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. పొత్తుపై పవన్ ప్రకటన చేసిన క్రమంలో టీడీపీ కార్యకర్తలు కూడా యాత్రలో పాల్గొనే అవకాశముంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
Embed widget