అన్వేషించండి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు, అక్కడినుంచే స్టార్ట్

Pawan Kalyan: పవన్ నాలుగో విడత వారాహి యాత్రకు షెడ్యూల్ ఖరారు అయింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కృష్ణా జిల్లాలో యాత్ర చేపట్టనున్నారు.

Pawan Kalyan: చంద్రబాబు అరెస్ట్, టీడీపీతో జనసేన పొత్తు ప్రకటన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యారు. అయితే చంద్రబాబుకు కోర్టుల్లో ఊరట లభించకపోవడం, జైలు నుంచి బయటకు రావడానికి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో.. ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా నాలుగో విడత వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 1 నుంచి పవన్ నాలుగో విడత వారాహి యాత్ర స్టార్ట్ కానుంది. ఈ సారి ఉమ్మడి కృష్ణా జిల్లాలో పవన్ పర్యటించనున్నారు.  

అవనిగడ్డలో వారాహి యాత్ర ప్రారంభం కానుండగా.. మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో యాత్ర జరగనుంది. సోమవారం ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారాహి యాత్ర ఏర్పాట్లపై జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. వారాహి యాత్రకు ఏర్పాట్లు మొదలుపెట్టాలని, అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వారాహి యాత్ర విజయవంతం అయ్యేలా కృషి చేయాలని సూచించారు. బహిరంగ సభలకు ఏర్పాట్లు, పోలీసుల అనుమతి తీసుకోవాలని నేతలను సూచించారు.

అక్టోబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వారాహి యాత్ర పవన్ చేపట్టనున్నారు. యాత్రలో భాగంగా పలు నియోకవర్గాల్లో పవన్ భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన పవన్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి ఆయనతో ములాఖత్ అయ్యారు. అనంతరం చంద్రబాబు కుటుంబసభ్యులను పరామర్శించారు. నారా లోకేష్, భువనేశ్వరి, బాలకృష్ణ, బ్రాహ్మణితో భేటీ అయ్యారు. ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. 

చంద్రబాబుతో ములాఖత్ అనంతరం టీడీపీతో పొత్తుపై పవన్ అధికారికంగా ప్రకటన చేయడంతో పాటు ఇప్పటినుంచి కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. విడివిడిగా పోటీ చేస్తే జగన్‌ను ఓడించలేమని, అందుకే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు లోకేష్, బాలకృష్ణ సమక్షంలో స్పష్టం చేశారు. మరుసటి రోజు జనసేన కార్యాలయంలో జరిగిన నేతల సమావేశంలో సోషల్ మీడియాలో పొత్తు గురించి నెగిటివ్ కామెంట్స్ ఎవరూ పెట్టవద్దని, టీడీపీ నేతలను విమర్శించవద్దని తెలిపారు. పొత్తుకు అందరూ సహకరించాలని కోరారు. టీడీపీ 40  ఏళ్ల నుంచి ఉన్న పార్టీ అని, ఆ పార్టీకి ప్రజల్లో బలంగా ఉందని చెప్పారు.

చంద్రబాబు అరెస్ట్ క్రమంలో పవన్ వారాహి యాత్రతో ఏపీ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. చంద్రబాబు అరెస్ట్ గురించి పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. గత మూడు విడతల వారాహి యాత్రలో వాలంటీర్స్ టార్గెట్‌గా పవన్ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే జగన్ ప్రభుత్వంలోని అవినీతి, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తీరు గురించి విమర్శలు చేశారు. అయితే ఈ సారి పవన్ ఎవరని టార్గెట్ చేస్తారనేది రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. పొత్తుపై పవన్ ప్రకటన చేసిన క్రమంలో టీడీపీ కార్యకర్తలు కూడా యాత్రలో పాల్గొనే అవకాశముంది.

టాప్ హెడ్ లైన్స్

AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Kesineni Chinni daughter Issue: ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!
ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Embed widget