అన్వేషించండి

Andhra Pradesh: ఆప్తులే ఇసుకను దోచుకుతింటున్నారు- వదిలిపెట్టనంటూ జెసి ప్రభాకర్ రెడ్డి వార్నింగ్

Andhra Pradesh: అనుచరులే ఇసుక‌ను అక్ర‌మంగా త‌ర‌లించుకోతున్నార‌ని తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలాంటివి చేస్తూ తనకు దూరం కావద్దని హెచ్చరించారు.  

JC Prabhakar Reddy: ఏపీలో ఇసుక విష‌యంలో ప్రతిపక్షాల ఆరోపణలు ఊతమిచ్చేలా అధికార పార్టీకి చెందిన నేత మాట్లాడటం కలకలం రేపుతోంది. టీడీపీ నేతలే ఇసుక దోచుకుంటున్నారన్న ఆరోపణలను సమర్థిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అనంతపురంజిల్లాలో టీడీపీ నేతల మధ్య ఉన్న వర్గవిభేదాలు ఇలా ఇసుక రూపంలో బ‌య‌ట‌కొచ్చాయి. 

మీ టిప్ప‌ర్లు బ‌య‌ట‌కి రావు..

త‌మ పార్టీకి చెందిన నాయ‌కులు, త‌న అనుచ‌రులే విచ్చ‌ల‌విడిగా ఇసుక దోచుకుంటున్నార‌ని తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్, మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుత ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తండ్రి జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఒక వీడియోను రిలీజ్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. గ‌డిచిన అయిదేళ్లుగా త‌న‌కు అండ‌దండ‌గా నిలిచిన నాయ‌కులు, ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా ఇసుకను అక్ర‌మంగా త‌ర‌లించి జేబులు నింపుకుంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఇసుక త‌వ్వ‌కాల‌పై గ్రీన్ ట్రైబ్యున‌ల్, హైకోర్టులు, అధికారుల‌ చుట్టూ తిరిగి నేను అడ్డుప‌డితే.. ఇప్పుడు అనుచ‌రులే దోపిడీకి పాల్ప‌డ‌తున్నారంటూ వీడియో విడుద‌ల చేయ‌డం అధికార పార్టీ నాయ‌కుల్ని కూడా విస్మ‌య‌ప‌రుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 2.5 ల‌క్ష‌ల మంది ఉంటే, కేవ‌లం 25 మంది మాత్ర‌మే ఇసుక ర‌వాణా చేసి సంపాదిస్తున్నార‌ని ఆరోపించారు. ఎక్క‌డికైనా పోయి తోలుకోండి.. నా నియోజ‌క‌వ‌ర్గంలో తోలితే మీ బండ్లు బ‌య‌ట‌కు కూడా రావ‌ని టిప్ప‌ర్ ఓన‌ర్ల‌కు వార్నింగ్ ఇచ్చారు. 

మీకు అమ్ముకోవ‌డం చేత‌కాదు..

`ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు మీరంతా ఎంత న‌ష్ట‌పోయారో నాకు తెలుసు. మిమ్మ‌ల్ని చూసుకునే బాధ్య‌త నాది. ఆ ఇసుక గురించి వ‌దిలేయండి. నా ఆదేశాల‌ను ఖాతరు చేయ‌కుండా అలాగే ముందుకు పోతే నాకు దూరమైన‌ట్టే.. మీకు అమ్ముకోవ‌డం కూడా చేత‌కాదు.. నేను మార్గం చూపిస్తా. ఇప్ప‌టికే ఏసీబీ విచార‌ణ జ‌రుగుతోంది. కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు ప‌డతారు. ఇసుక జోలికి వెళ్లొద్దు. ఐదేళ్లు చాలా న‌ష్ట‌పోయా.. నాకు వ‌దిలేయండ‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఇంటి నిర్మాణానికి ఇసుక కావాలంటే ధైర్యంగా తీసుకెళ్లండి అభ్యంత‌రం లేదు. అలా కాకుండా దోచుకునే ప్ర‌య‌త్నం విరమించుకోవాలని జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి హిత‌వు ప‌లికారు. కావాలంటే మున్సిపాలిటీ ద్వారా ఇసుక స‌ర‌ఫ‌రా చేద్దామ‌ని చెప్పారు. 

ప్రతిపక్షం నుంచి తీవ్ర విమర్శలు 

ఉచిత ఇసుక పేరుతో కొత్త పాల‌సీ తీసుకొచ్చామ‌ని చెప్పుకుంటున్నా, ట్రావెలింగ్, సీవ‌రేజీ, లేబ‌ర్ ఇత‌ర‌త్రా ఛార్జీల‌తో క‌లిపి తమ హయాంలో  కంటే ఎక్కువ‌గానే వ‌సూలు చేస్తున్నార‌ని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వ‌ర్షాల‌తో ఇసుక దొర‌క‌ని ప‌రిస్థితి ఉందని, డంపింగ్ చేసిన ఇసుక కూడా టీడీపీ నాయ‌కులే అమ్ముకుంటున్నార‌ని ఆరోపిస్తోంది.

Also Read: మదనపల్లి మంటల కేసులో మరో ట్విస్ట్- మద్యం పాలసీ గుట్టు రట్టైనట్టు సమాచారం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA News: హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్, సీబీఐ కేసులో ఊరటదవాఖానకు పోవాలి, చేయి నొప్పి పుడుతోంది - పోలీసులతో హరీశ్ వాగ్వాదంఅభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షోబలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA News: హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Embed widget