అన్వేషించండి

దేవినేని అవినాష్‌, వల్లభనేని వంశీ ఇళ్లపై ఐటీ దాడులు- వంశీరామ్‌ బిల్డర్స్‌తో సంబంధాలపై ఆరా

అవినాష్‌, వంశీ అనుచురులు కూడా జరుగుతున్న పరిణామాలపై ఆశ్చర్చానికి గురయ్యారు.

హైదరాబాద్‌లో ఐటీ శాఖ దాడులతో బెజవాడ ఉలిక్కి పడింది. ఇద్దరు ప్రముఖుల ఇళ్ళపై ఐటీ దాడులు జరుగటం సంచలనంగా మారింది. ఇద్దరు వైసీపీ నాయకులు కావటం ఇక్కడ మరో ట్విస్ట్‌. ఒకరు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాగా మరొకరు విజయవాడ తూర్పు వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్. హైదరాబాద్‌ వేదికగా బిజినెస్‌ రన్ చేస్తున్న వంశీ రామ్ బిల్డర్స్‌పై ఐటీ దాడులు చేపట్టింది. దాని ఎఫెక్ట్‌తో ఇటు అవినాశ్, వంశీ ఇళ్లపై కూడా సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
 
హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న ఐటీ ప్రత్యేక విభాగం అధికారులు తెల్లవారు జామున ఒకేసారి దాడులు ప్రారంభించారు. విజయవాడలో ఉంటున్న గన్నవం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నివాసంతోపాటుగా గుణదలలోని దేవినేని అవినాష్ ఇంట్లోకి ఐటీ అధికారులు ఒకే టైంలో ఎంట్రీ ఇచ్చారు. వ్యక్తి గత సిబ్బందితోపాటు ఎవరినీ లోపలికి రానివ్వలేదు. ఇంటికి సంబంధించిన డోర్స్‌ను క్లోజ్ చేశారు. ఇంట్లో ఉన్న వ్యక్తులను బయటకు వెళ్లనీయలేదు. బయట నుంచి ఇతరులను ఎవ్వరిని లోపలకు అనుమతించలేదు. ఇంటిలో ఉన్న మహిళలకు మహిళా పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. దీంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఇద్దరు నాయకులు,వారి కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. 

అవినాష్‌, వంశీ అనుచురులు కూడా జరుగుతున్న పరిణామాలపై ఆశ్చర్చానికి గురయ్యారు. ఎటువంటి సమాచారం బయటకు రాకుండా అధికారులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఇన్నోవా వాహనాల్లో ఎవరూ మేల్కోక ముందే వారి ఇళ్లకు చేరుకున్నారు. 

హైదరాబాద్‌కు చెందిన వంశీ రామ్ బిల్డర్స్ కార్యాలయంతోపాటుగా ఇళ్ళలో కూడ ఐటీ అధికారులు దాడులు చేశారు. వంశీ రామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి ఆయన బావమర్ది జనార్దన్ రెడ్డి ఇంటిలో కూడా తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 15 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే విజయవాడలోని ఈ ఇద్దరు నేతల ఇళ్ళపై కూడా తనిఖీలు చేస్తున్నారని ప్రాథమికంగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో అవినాష్‌కు ఉండే ఓ ల్యాండ్ విషయంలో ఈ తనిఖీలు సాగుతున్నట్టు సమాచారం. 

అధికార పార్టీకి చెందిన నేతలపై దాడులు..

ఏపీలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ఇద్దరు కీలక నేతలు. ఒకప్పుడు ఈ ఇద్దరు టీడీపీలో కొనసాగినప్పటికి 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత ఇద్దరు నాయకులు వైసీపీలో చేరారు. సాంకేతిక కారణాల కారణంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బయటకు నుంచి వైసీపీ మద్దతు ఇస్తున్నారు. ఇక అవినాష్ అయితే నేరుగా పార్టీ కండువా కప్పుకొని జగన్‌కు దగ్గరయ్యారు. అయితే ఈ ఇద్దరు నేతలపైనే ఇప్పుడు ఐటీ దాడులు జరగటం చర్చనీయాంశంగా మారింది. ఇరువురు నేతలు తరచూ హైదరాబాద్‌కు వెళుతుంటారు. అక్కడే వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా ఇరువురు నాయకులు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఎక్కువగా ఆధారపడిన వారే. గతంలో హైదరాబాద్ భూముల ఆక్రమణలు, కబ్జాలు వంటి ఘటనలు వెలుగులోకి వచ్చిప్పుడు వంశీ, అవినాష్‌కు చెందిన అనుచరుల పేర్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఐటీ అధికారులు కూడా దాడులకు పాల్పడటంతో రాజకీయంగా ఈ వ్యవహరం మరింత వివాదాానికి కారణం అయ్యే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
MLC Nagababu News: చంద్రబాబుతో నాగబాబు భేటీ, నెక్స్ట్ మంత్రి పదవే
చంద్రబాబుతో నాగబాబు భేటీ, నెక్స్ట్ మంత్రి పదవే
BC Protest at Jantar Mantar: జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
Crime News: నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం- రైళ్లు ఆపి బంగారం, ఆభరణాలు, నగదు దోపిడీ
నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం- రైళ్లు ఆపి బంగారం, ఆభరణాలు, నగదు దోపిడీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Best Home Coming | నాసాలో చికిత్స తర్వాత ఇంటికి వచ్చిన సునీతా విలియమ్స్ | ABP DesamDigvesh Rathi Notebook Celebrations Priyansh Arya | ప్రియాంశ్ ఆర్య కొహ్లీలా రివేంజ్ తీర్చుకుంటాడా | ABP DesamRCB vs GT Match preview IPL 2025 | నేడు గుజరాత్ టైటాన్స్ తో ఆర్సీబీ మ్యాచ్ | ABP DesamShreyas Iyer Mass Comeback | IPL 2025 లోనూ తన జోరు చూపిస్తున్న శ్రేయస్ అయ్యర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
MLC Nagababu News: చంద్రబాబుతో నాగబాబు భేటీ, నెక్స్ట్ మంత్రి పదవే
చంద్రబాబుతో నాగబాబు భేటీ, నెక్స్ట్ మంత్రి పదవే
BC Protest at Jantar Mantar: జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
Crime News: నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం- రైళ్లు ఆపి బంగారం, ఆభరణాలు, నగదు దోపిడీ
నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం- రైళ్లు ఆపి బంగారం, ఆభరణాలు, నగదు దోపిడీ
Vizag News: విశాఖలో యువకుడి ఘాతుకం- ప్రేమించలేదని తల్లీకూతురిపై దాడి- ఒకరు మృతి 
విశాఖలో యువకుడి ఘాతుకం- ప్రేమించలేదని తల్లీకూతురిపై దాడి- ఒకరు మృతి 
UPI Services Down Again:  మ‌ళ్లీ స్థంభించిన యూపీఐ సేవ‌లు.. రెండ్రోజుల్లో ఇది రెండోసారి.. సోష‌ల్ మీడియాలో క‌స్ట‌మ‌ర్ల ఫైర్
మ‌ళ్లీ స్థంభించిన యూపీఐ సేవ‌లు.. రెండ్రోజుల్లో ఇది రెండోసారి.. సోష‌ల్ మీడియాలో క‌స్ట‌మ‌ర్ల ఫైర్
Team India 2025 Home Season:  విశాఖలో వన్డే.. ఇండియా, సౌతాఫ్రికా మధ్య పోరు.. గువాహటిలో తొలిసారి టెస్టు నిర్వహణ.. ఈ ఏడాది హోం సీజన్ ప్రకటన
విశాఖలో వన్డే.. ఇండియా, సౌతాఫ్రికా మధ్య పోరు.. గువాహటిలో తొలిసారి టెస్టు నిర్వహణ.. ఈ ఏడాది హోం సీజన్ ప్రకటన
MLAs Disqualification Case: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ కూర్చోవాలా? సుప్రీంకోర్టు
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ కూర్చోవాలా? సుప్రీంకోర్టు
Embed widget