అన్వేషించండి

AP Politics: వైసీపీ ప్రభుత్వం మళ్లీ రాదు, చంద్రబాబు ప్రతిపక్షానికే - 2024లో ఊహించని పరిణామాలు: కేంద్ర మాజీ మంత్రి

వైసీపీ ప్రభుత్వం మళ్లీ రాదు అని, చంద్రబాబు మరోసారి ప్రతిపక్షానికి పరిమితం అవుతారని.. 2024 ఎన్నికలలో ఎవరూ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు.

విజయవాడ: ఏపీలో వైసీపీ ప్రభుత్వం మళ్లీ రాదు అని, చంద్రబాబు మరోసారి ప్రతిపక్షానికి పరిమితం అవుతారని.. 2024 ఎన్నికలలో ఎవరూ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. పైకి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా కొందరి పతనం ఖాయమన్నారు. తాను గుడిసె గుడిసె తిరిగానని, ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రజలు తిడుతున్నారని.. ఇళ్లల్లో‌ వంద రూపాయలు కూడా లేని పరిస్థితిని గమనించానని చెప్పారు. 2024లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, చంద్రబాబు మరోసారి ప్రతిపక్షానికి పరిమితం అవుతారన్న ఆయన, మూడు, నాలుగు స్థానాల్లో వైసిపి, పవన్ పార్టీలు ఉంటాయని జోస్యం చెప్పారు.

పెట్రోల్ ధర వంద కావాలంటే రూపాయి విలువ పతనం‌ కావాలని మన్మోహన్ సింగ్ ఆనాడే చెప్పారని, అయితే నేడు బిజెపి పతనం ప్రారంభం అయ్యిందని, ఇక తిరిగి కోలుకునే ఛాన్స్ లేదన్నారు. ఏపీలో కాంగ్రెస్ రాజకీయ పరిస్థితిని తాను 18యేళ్ల క్రితమే ఊహించి, ఆనాడే అధిష్టానానికి వివరంగా లేఖ రాసి ఇచ్చానని తెలిపారు. 2004లోనే మా‌ పార్టీ వాళ్లకు నేనే చదివి స్వయంగా వినిపించాను. కాంగ్రెస్ పార్టీ పతనాన్ని తాను అప్పుడే ఊహించి చెప్పానని పదే పదే ప్రస్తావించారు. చంద్రబాబు సభలకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకావడంపై తనదైన శైలిలో స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సభలకు వస్తున్న జనాన్ని చూస్తే, దేశంలో పేదోళ్ల పరిస్థితి అర్థం అవుతుందన్నారు. 

సంక్రాంతి కానుకగా రూ.1500 విలువ చేసేవి పేదలకు ఇచ్చారు. అయితే 3500 మందికి కానుక ఏర్పాటు చేస్తే, వేలాది మంది తరలి వచ్చారని, దాంతో టోకెన్ లు ఇచ్చే సమయంలో తొక్కిసలాట జరిగిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. ఉచితంగా ఇస్తామంటే రాని పేదవాళ్లు ఉండరని, ఇలాంటి వాటిని సాకుగా చూపి ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవోలు ఇవ్వడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛ ఉన్న దేశంలో మీటింగ్ పెట్టకూడదని ఆంక్షలు సరికాదన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి  తీసుకోవాలని సూచించారు. 

ఇద్దరు చంద్రుల మధ్య వివాదమే ఏపీలో బీఆర్ఎస్
చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మధ్య వివాదమే ఏపీలో బీఆర్ఎస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వెళ్లి తెలంగాణలో సభలు నిర్వహిస్తుంటే, కేసీఆర్ ఏపీకి వచ్చి సభలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. ఒకవేళ దివంగత ఎన్టీఆర్ లాగ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా దేశానికి ప్రధాని కావాలని ఆశ ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. 

మీరంతా కాంగ్రెస్ లోకి రండి, మిమ్మల్ని సీఎం చేస్తాం !
2024 ఎన్నికలలో ఎవరూ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయని, కాపులంతా కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కాపులను సీఎం చేస్తామని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ హామీ ఇచ్చారు. 1959-60 నాటి పరిస్థితి ఏపీలో మళ్లీ కనిపిస్తుందన్నారు. కిలో‌ బియ్యం కోసం పేదలు ఎదురు చూస్తున్నారని, టిడిపి, వైసిపి విధానాల వల్ల ప్రతి పేదవాడు అప్పుల పాలయ్యాడని.. ఏపీలో తాము ఓటేసిన ఫ్యాన్ తమను మోసం‌ చేసిందనే ఆక్రోశం ప్రజల్లో ఉందన్నారు. ఏపీలో పేద ప్రజల్లో ఎంతో మార్పు వచ్చిందని, వైసిపిని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget