అన్వేషించండి

AP Politics: వైసీపీ ప్రభుత్వం మళ్లీ రాదు, చంద్రబాబు ప్రతిపక్షానికే - 2024లో ఊహించని పరిణామాలు: కేంద్ర మాజీ మంత్రి

వైసీపీ ప్రభుత్వం మళ్లీ రాదు అని, చంద్రబాబు మరోసారి ప్రతిపక్షానికి పరిమితం అవుతారని.. 2024 ఎన్నికలలో ఎవరూ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు.

విజయవాడ: ఏపీలో వైసీపీ ప్రభుత్వం మళ్లీ రాదు అని, చంద్రబాబు మరోసారి ప్రతిపక్షానికి పరిమితం అవుతారని.. 2024 ఎన్నికలలో ఎవరూ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. పైకి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా కొందరి పతనం ఖాయమన్నారు. తాను గుడిసె గుడిసె తిరిగానని, ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రజలు తిడుతున్నారని.. ఇళ్లల్లో‌ వంద రూపాయలు కూడా లేని పరిస్థితిని గమనించానని చెప్పారు. 2024లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, చంద్రబాబు మరోసారి ప్రతిపక్షానికి పరిమితం అవుతారన్న ఆయన, మూడు, నాలుగు స్థానాల్లో వైసిపి, పవన్ పార్టీలు ఉంటాయని జోస్యం చెప్పారు.

పెట్రోల్ ధర వంద కావాలంటే రూపాయి విలువ పతనం‌ కావాలని మన్మోహన్ సింగ్ ఆనాడే చెప్పారని, అయితే నేడు బిజెపి పతనం ప్రారంభం అయ్యిందని, ఇక తిరిగి కోలుకునే ఛాన్స్ లేదన్నారు. ఏపీలో కాంగ్రెస్ రాజకీయ పరిస్థితిని తాను 18యేళ్ల క్రితమే ఊహించి, ఆనాడే అధిష్టానానికి వివరంగా లేఖ రాసి ఇచ్చానని తెలిపారు. 2004లోనే మా‌ పార్టీ వాళ్లకు నేనే చదివి స్వయంగా వినిపించాను. కాంగ్రెస్ పార్టీ పతనాన్ని తాను అప్పుడే ఊహించి చెప్పానని పదే పదే ప్రస్తావించారు. చంద్రబాబు సభలకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకావడంపై తనదైన శైలిలో స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సభలకు వస్తున్న జనాన్ని చూస్తే, దేశంలో పేదోళ్ల పరిస్థితి అర్థం అవుతుందన్నారు. 

సంక్రాంతి కానుకగా రూ.1500 విలువ చేసేవి పేదలకు ఇచ్చారు. అయితే 3500 మందికి కానుక ఏర్పాటు చేస్తే, వేలాది మంది తరలి వచ్చారని, దాంతో టోకెన్ లు ఇచ్చే సమయంలో తొక్కిసలాట జరిగిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. ఉచితంగా ఇస్తామంటే రాని పేదవాళ్లు ఉండరని, ఇలాంటి వాటిని సాకుగా చూపి ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవోలు ఇవ్వడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛ ఉన్న దేశంలో మీటింగ్ పెట్టకూడదని ఆంక్షలు సరికాదన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి  తీసుకోవాలని సూచించారు. 

ఇద్దరు చంద్రుల మధ్య వివాదమే ఏపీలో బీఆర్ఎస్
చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మధ్య వివాదమే ఏపీలో బీఆర్ఎస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వెళ్లి తెలంగాణలో సభలు నిర్వహిస్తుంటే, కేసీఆర్ ఏపీకి వచ్చి సభలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. ఒకవేళ దివంగత ఎన్టీఆర్ లాగ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా దేశానికి ప్రధాని కావాలని ఆశ ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. 

మీరంతా కాంగ్రెస్ లోకి రండి, మిమ్మల్ని సీఎం చేస్తాం !
2024 ఎన్నికలలో ఎవరూ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయని, కాపులంతా కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కాపులను సీఎం చేస్తామని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ హామీ ఇచ్చారు. 1959-60 నాటి పరిస్థితి ఏపీలో మళ్లీ కనిపిస్తుందన్నారు. కిలో‌ బియ్యం కోసం పేదలు ఎదురు చూస్తున్నారని, టిడిపి, వైసిపి విధానాల వల్ల ప్రతి పేదవాడు అప్పుల పాలయ్యాడని.. ఏపీలో తాము ఓటేసిన ఫ్యాన్ తమను మోసం‌ చేసిందనే ఆక్రోశం ప్రజల్లో ఉందన్నారు. ఏపీలో పేద ప్రజల్లో ఎంతో మార్పు వచ్చిందని, వైసిపిని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget