అన్వేషించండి

Vijayawada: విజయవాడ వరద బాధితులకు గుడ్ న్యూస్‌- నేడు ఖాతాల్లోకి రూ.597 కోట్లు

Flood Relief Funds: వరద బాధితులకు నేడు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం విడుదల చేస్తుంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్​లో వరద బాధితులకు సీఎం చంద్రబాబు నేరుగా ఆర్థిక సాయం చెక్కులను అందిస్తారు.

Andhra Pradesh: ఏపీలో వరద(Flood) బాదితులకు ప్రభుత్వం సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సాయాన్ని నేడు బాధితులకు అందజేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలమందికి ఈ సాయం అందాల్సి ఉంది. మొత్తంగా రూ.597 కోట్లు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ 4 లక్షలమందిలో విజయవాడ ప్రాంతం నుంచే లక్షన్నర మంది బాధితులు సాయం అందుకోబోతుండటం విశేషం. ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్​లో వరద బాధితులకు సీఎం చంద్రబాబు నేరుగా ఆర్థిక సాయం చెక్కులను అందిస్తారు. 

రోజుల వ్యవధిలోనే..
విజయవాడ సహా రాష్ట్రంలోని పలు ఇతర ప్రాంతాలు వరదలతో తీవ్రంగా నష్టపోయాయి. అప్పటికప్పుడు బాధితులకు పునరావాసం, నిత్యావసరాలు అందించింది ప్రభుత్వం. ఇక రోజువారీ జీవనానికి కష్టమైపోయిన వారికి కూడా కొన్ని దాతృత్వ సంస్థలు నేరుగా ఆర్థిక సాయం చేశాయి. తాజాగా ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరదలు తగ్గిన వెంటనే నష్టం అంచనాకు రెవెన్యూ బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించారు. బాధితుల వివరాలు సేకరించి, వారికి జరిగిన ఆస్తి నష్టం తదితర వివరాలు నమోదు చేసుకున్నాయి.

పంట, పశు సంపద నష్టం అంచనాకు వచ్చిన ప్రత్యేక బృందాలు తమ పని పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేశాయి. అటు కేంద్రం కూడా తక్షణ సాయం ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాల రూపంలో కూడా నిధులు సమకూరాయి. ఈరోజు బాధితులకు నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ ఫర్ (DBT) పద్ధతి ద్వారా ఈరోజు వరదసాయం బాధితుల బ్యాంక్(BANK) ఖాతాల్లో జమ అవుతుంది. 

ఆగస్ట్ నెలాఖరులో, సెప్టెంబర్ మొదటి వారంలో భారీ వర్షాలు, వరదలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఏపీలో వరదసాయం అందించేందుకు ప్రభుత్వం రోజుల వ్యవధిలోనే సిద్ధమైందని, ఇది తమ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం అంటున్నారు కూటమి నేతలు. ఇతరత్రా సాయాలను పక్కనపెడితే బాధితులకు భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు ఆర్థిక సాయం మొదలు పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్యుమరేషన్ ప్రక్రియ కూడా రోజలు వ్యవధిలోనే పూర్తి కావడంతో ఇప్పుడు సాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

వరదల్లో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారితోపాటు.. తోపుడు బళ్లు కొట్టుకుపోయిన చిరు వ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇక వ్యక్తిగత వాహనాల నష్టం వారిని మరింత బాధిస్తోంది. ఇన్సూరెన్స్ కంపెనీల చెల్లింపులతో ఆ నష్టం కాస్త తగ్గినా వాహనాలు పాడైపోయి యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న తరహా పరిశ్రమల యజమానులకు, పంటలు, పశువులను నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. 

ఎన్డీఆర్ఎఫ్(NDRF) మార్గదర్శకాలకు మించి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని అంటున్నారు కూటమి నేతలు. ముంపు ప్రాంతాల్లో రూ. 180 కోట్ల మేర బ్యాంక్ రుణాలను కూడా ప్రభుత్వం రీ-షెడ్యూల్ చేస్తోంది. ఒకవేళ బాధితులెవరైనా తమకు సాయం జరగలేదని భావిస్తే అధికారులను సంప్రదించాలని.. ఎన్యుమరేషన్ లో ప్యాకేజీ అందని వారికి నిబంధనల మేరకు ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 

Also Read: వైఎస్ఆర్‌సీపీకి మరో బిగ్ షాక్ - రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య రాజీనామా - ఆమోదం కూడా !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Hyderabad Metro Latest Timings: మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Fastest Stumping vs RCB | వరుసగా రెండో మ్యాచ్ లోనూ ధోని మెరుపు స్టంపింగ్ | ABP DesamMS Dhoni Sixers vs RCB IPL 2025 | యధావిథిగా ధోనీ ఆడాడు..CSK ఓడింది | ABP DesamCSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP DesamMyanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Hyderabad Metro Latest Timings: మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
Viral Video: రోహిత్, సూర్య‌, తిల‌క్ ల తుంట‌రి ప‌ని.. పాపం టీమ్ అడ్మిన్ పై ప్ర‌తాపం.. సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్
రోహిత్, సూర్య‌, తిల‌క్ ల తుంట‌రి ప‌ని.. పాపం టీమ్ అడ్మిన్ పై ప్ర‌తాపం.. సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్
RS Praveen Kumar: తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Andhra Pradesh Weather: ఏపీలో 22 జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు- ఆదివారం తీవ్ర వడగాల్పులు
ఏపీలో 22 జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు- ఆదివారం తీవ్ర వడగాల్పులు
Viral News : అటు భూ ప్రకంపనలు- ఇటు పురిటినొప్పులు- మహిళకు రోడ్డుపైనే ప్రసవం చేసిన వైద్యులు
అటు భూ ప్రకంపనలు- ఇటు పురిటినొప్పులు- మహిళకు రోడ్డుపైనే ప్రసవం చేసిన వైద్యులు
Embed widget