అన్వేషించండి

ఉద్యోగులతో చర్చలకు వేసిన కమిటీపై విరుద్ధ ప్రకటనలు

పీఆర్సీని వ్యతిరేకిస్తున్న ఉద్యోగులకు నచ్చజెప్పేందుకు వేసిన కమిటీపై ప్రభుత్వం నుంచే విరుద్ధ ప్రకటనలు వస్తున్నాయి. కమిటీ సంగతి తనకు తెలియదని స్వయాన సమాచార శాఖ మంత్రి చెప్పడం చర్చనీయాంశమైంది.

పీఆర్సీని వ్యతిరేకిస్తున్న ఏపీ ఉద్యోగులకు నచ్చజెప్పేందుకు, ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని వివరించి చెప్పేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ , ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ సహా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సభ్యులుగా ఉన్నారు . సమ్మెకు సై అంటున్న ఉద్యోగులతో చర్చించడంతోపాటు వారిని కొత్త పీఆర్సీకి ఒప్పించడం వీరి లక్ష్యం . 

కమిటీ వేశారన్న సమాచారం లేదు: మంత్రి పేర్ని నాని

కేబినెట్ మీటింగ్ వివరాలను తెలపడానికి వచ్చిన మంత్రి పేర్ని నానిని ఈ కమిటీ పై వివరాలు అడుగ‌్గా తనకు దీనిపై ఎలాంటి సమాచారం లేదని చెప్పడం ఆశ్చర్యపరిచింది. అలాగే ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగులు సమ్మెకు దిగుతున్న విషయమూ తన దృష్టికి ఇంకా రాలేదని ఆయన అన్నారు. ఇక ఉద్యోగుల నిరసనపై మాట్లాడుతూ ప్రభుత్వాన్ని లేదా ముఖ్యమంత్రిని తిడితే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న ఇంటి అద్దె భత్యం పెరుగుతుందా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సామరస్య పూర్వకంగా వ్యవహరించాలని, న్యాయంగా పోరాడితేనే ఫలితం వస్తుందని హితవు పలికారు. ఉద్యోగులు రోడ్డెక్కకూడదని ప్రభుత్వం కోరుకుంటుందని మంత్రి పేర్ని నాని న్నారు . 

 ఏదో కమిటీ వేసారని తెలుసు :ఉద్యోగ సంఘాలు

కొత్తగా పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డ నాలుగు ప్రధాన ఉద్యోగసంఘాల నేతలు కూడా ఈ కమిటీపై పెద్దగా ఆసక్తి లేనట్టు మాట్లాడారు . ప్రభుత్వం తమకు పీఆర్సీపై నచ్చజెప్పేందుకు ఏదో కమిటీ వేసిందని విన్నామని వారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా ఉందన్న పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాస్.. జీవోలను రద్దు చేశాకే చర్చలకు వెళతామని స్పష్టం చేశారు. 

ఆదిలోనే అనుమానాలు

11వ  పీఆర్సీ జీవోలపై అటు ప్రభుత్వం..ఇటు ఉద్యోగ నాయకులూ పట్టుదలగా ఉండడంతో ఈ కమిటీ ద్వారా సహేతుకమైన నిర్ణయం వస్తుందా అన్న అనుమానాలు మొదలవుతున్నాయి. ఈ జీవోలు రద్దు చేశాకే చర్చ అని ఉద్యోగులూ, అటు కాస్త హెచ్చరికలతోనే నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్న మంత్రుల మాటలతో ఈ పంచాయితీ క్షణానికో మలుపు తిరుగుతోంది.

Also Read: సమ్మెకు ఉద్యోగులుసై.. చర్చలకు రావాలంటున్న ప్రభుత్వం ! పీఆర్సీ వివాదం ఏ మలుపు తిరగనుంది ?

Also Read: పీఆర్సీ జీవోలకు కేబినెట్ ఆమోదం... ఉద్యోగులను బుజ్జగించేందుకు కమిటీ... మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు

Also Read: ప.గో జిల్లాలో దళిత యువకుడు గెడ్డం శీను హత్య కేసు కలకలం - ప్రభుత్వంపై హర్షకుమార్ విమర్శలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Embed widget