అన్వేషించండి

ఉద్యోగులతో చర్చలకు వేసిన కమిటీపై విరుద్ధ ప్రకటనలు

పీఆర్సీని వ్యతిరేకిస్తున్న ఉద్యోగులకు నచ్చజెప్పేందుకు వేసిన కమిటీపై ప్రభుత్వం నుంచే విరుద్ధ ప్రకటనలు వస్తున్నాయి. కమిటీ సంగతి తనకు తెలియదని స్వయాన సమాచార శాఖ మంత్రి చెప్పడం చర్చనీయాంశమైంది.

పీఆర్సీని వ్యతిరేకిస్తున్న ఏపీ ఉద్యోగులకు నచ్చజెప్పేందుకు, ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని వివరించి చెప్పేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ , ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ సహా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సభ్యులుగా ఉన్నారు . సమ్మెకు సై అంటున్న ఉద్యోగులతో చర్చించడంతోపాటు వారిని కొత్త పీఆర్సీకి ఒప్పించడం వీరి లక్ష్యం . 

కమిటీ వేశారన్న సమాచారం లేదు: మంత్రి పేర్ని నాని

కేబినెట్ మీటింగ్ వివరాలను తెలపడానికి వచ్చిన మంత్రి పేర్ని నానిని ఈ కమిటీ పై వివరాలు అడుగ‌్గా తనకు దీనిపై ఎలాంటి సమాచారం లేదని చెప్పడం ఆశ్చర్యపరిచింది. అలాగే ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగులు సమ్మెకు దిగుతున్న విషయమూ తన దృష్టికి ఇంకా రాలేదని ఆయన అన్నారు. ఇక ఉద్యోగుల నిరసనపై మాట్లాడుతూ ప్రభుత్వాన్ని లేదా ముఖ్యమంత్రిని తిడితే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న ఇంటి అద్దె భత్యం పెరుగుతుందా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సామరస్య పూర్వకంగా వ్యవహరించాలని, న్యాయంగా పోరాడితేనే ఫలితం వస్తుందని హితవు పలికారు. ఉద్యోగులు రోడ్డెక్కకూడదని ప్రభుత్వం కోరుకుంటుందని మంత్రి పేర్ని నాని న్నారు . 

 ఏదో కమిటీ వేసారని తెలుసు :ఉద్యోగ సంఘాలు

కొత్తగా పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డ నాలుగు ప్రధాన ఉద్యోగసంఘాల నేతలు కూడా ఈ కమిటీపై పెద్దగా ఆసక్తి లేనట్టు మాట్లాడారు . ప్రభుత్వం తమకు పీఆర్సీపై నచ్చజెప్పేందుకు ఏదో కమిటీ వేసిందని విన్నామని వారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా ఉందన్న పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాస్.. జీవోలను రద్దు చేశాకే చర్చలకు వెళతామని స్పష్టం చేశారు. 

ఆదిలోనే అనుమానాలు

11వ  పీఆర్సీ జీవోలపై అటు ప్రభుత్వం..ఇటు ఉద్యోగ నాయకులూ పట్టుదలగా ఉండడంతో ఈ కమిటీ ద్వారా సహేతుకమైన నిర్ణయం వస్తుందా అన్న అనుమానాలు మొదలవుతున్నాయి. ఈ జీవోలు రద్దు చేశాకే చర్చ అని ఉద్యోగులూ, అటు కాస్త హెచ్చరికలతోనే నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్న మంత్రుల మాటలతో ఈ పంచాయితీ క్షణానికో మలుపు తిరుగుతోంది.

Also Read: సమ్మెకు ఉద్యోగులుసై.. చర్చలకు రావాలంటున్న ప్రభుత్వం ! పీఆర్సీ వివాదం ఏ మలుపు తిరగనుంది ?

Also Read: పీఆర్సీ జీవోలకు కేబినెట్ ఆమోదం... ఉద్యోగులను బుజ్జగించేందుకు కమిటీ... మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు

Also Read: ప.గో జిల్లాలో దళిత యువకుడు గెడ్డం శీను హత్య కేసు కలకలం - ప్రభుత్వంపై హర్షకుమార్ విమర్శలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
SaiKrishna Custodial Death: గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
విజయవాడ గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
Nadendla Manohar: తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget