అన్వేషించండి

ఉద్యోగులతో చర్చలకు వేసిన కమిటీపై విరుద్ధ ప్రకటనలు

పీఆర్సీని వ్యతిరేకిస్తున్న ఉద్యోగులకు నచ్చజెప్పేందుకు వేసిన కమిటీపై ప్రభుత్వం నుంచే విరుద్ధ ప్రకటనలు వస్తున్నాయి. కమిటీ సంగతి తనకు తెలియదని స్వయాన సమాచార శాఖ మంత్రి చెప్పడం చర్చనీయాంశమైంది.

పీఆర్సీని వ్యతిరేకిస్తున్న ఏపీ ఉద్యోగులకు నచ్చజెప్పేందుకు, ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని వివరించి చెప్పేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ , ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ సహా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సభ్యులుగా ఉన్నారు . సమ్మెకు సై అంటున్న ఉద్యోగులతో చర్చించడంతోపాటు వారిని కొత్త పీఆర్సీకి ఒప్పించడం వీరి లక్ష్యం . 

కమిటీ వేశారన్న సమాచారం లేదు: మంత్రి పేర్ని నాని

కేబినెట్ మీటింగ్ వివరాలను తెలపడానికి వచ్చిన మంత్రి పేర్ని నానిని ఈ కమిటీ పై వివరాలు అడుగ‌్గా తనకు దీనిపై ఎలాంటి సమాచారం లేదని చెప్పడం ఆశ్చర్యపరిచింది. అలాగే ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగులు సమ్మెకు దిగుతున్న విషయమూ తన దృష్టికి ఇంకా రాలేదని ఆయన అన్నారు. ఇక ఉద్యోగుల నిరసనపై మాట్లాడుతూ ప్రభుత్వాన్ని లేదా ముఖ్యమంత్రిని తిడితే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న ఇంటి అద్దె భత్యం పెరుగుతుందా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సామరస్య పూర్వకంగా వ్యవహరించాలని, న్యాయంగా పోరాడితేనే ఫలితం వస్తుందని హితవు పలికారు. ఉద్యోగులు రోడ్డెక్కకూడదని ప్రభుత్వం కోరుకుంటుందని మంత్రి పేర్ని నాని న్నారు . 

 ఏదో కమిటీ వేసారని తెలుసు :ఉద్యోగ సంఘాలు

కొత్తగా పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డ నాలుగు ప్రధాన ఉద్యోగసంఘాల నేతలు కూడా ఈ కమిటీపై పెద్దగా ఆసక్తి లేనట్టు మాట్లాడారు . ప్రభుత్వం తమకు పీఆర్సీపై నచ్చజెప్పేందుకు ఏదో కమిటీ వేసిందని విన్నామని వారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా ఉందన్న పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాస్.. జీవోలను రద్దు చేశాకే చర్చలకు వెళతామని స్పష్టం చేశారు. 

ఆదిలోనే అనుమానాలు

11వ  పీఆర్సీ జీవోలపై అటు ప్రభుత్వం..ఇటు ఉద్యోగ నాయకులూ పట్టుదలగా ఉండడంతో ఈ కమిటీ ద్వారా సహేతుకమైన నిర్ణయం వస్తుందా అన్న అనుమానాలు మొదలవుతున్నాయి. ఈ జీవోలు రద్దు చేశాకే చర్చ అని ఉద్యోగులూ, అటు కాస్త హెచ్చరికలతోనే నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్న మంత్రుల మాటలతో ఈ పంచాయితీ క్షణానికో మలుపు తిరుగుతోంది.

Also Read: సమ్మెకు ఉద్యోగులుసై.. చర్చలకు రావాలంటున్న ప్రభుత్వం ! పీఆర్సీ వివాదం ఏ మలుపు తిరగనుంది ?

Also Read: పీఆర్సీ జీవోలకు కేబినెట్ ఆమోదం... ఉద్యోగులను బుజ్జగించేందుకు కమిటీ... మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు

Also Read: ప.గో జిల్లాలో దళిత యువకుడు గెడ్డం శీను హత్య కేసు కలకలం - ప్రభుత్వంపై హర్షకుమార్ విమర్శలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget