అన్వేషించండి

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీపై లుక్ అవుట్ నోటీసులు? ఇంకా దొరకని వంశీ ఆచూకీ!

AP News Latest: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో తప్పించుకోవడం కోసం వల్లభనేని విదేశాలకు వెళ్లకుండా కొన్ని రోజుల కిందటే లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. దీన్ని పోలీసులు ధ్రువీకరించలేదు.

Vallabhaneni Vamsi Latest News: వైఎస్ఆర్ సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేస్తారని కొంత కాలంగా ఊహాగానాలు ఉన్న సంగతి తెలిసిందే. అరెస్టు భయంతో ఆయన అజ్ఞాతంలో ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. పలువురు ఆయన విదేశాలకు వెళ్లిపోయారని చెబుతుండగా, మరికొంత మంది మాత్రం హైదరాబాద్ లోనే ఉన్నారని అంటున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విదేశాలకు వెళ్లకుండా పోలీసులు కొన్ని రోజుల కిందటే లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అయితే, అంతకంటే ముందే ఆయన అమెరికాకు వెళ్లిపోయినట్లుగా వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే, పోలీసులు పోలీసులు ఆయన దేశం దాటారని నిర్ధారించడం లేదు. ఈ విషయంలో ఇమిగ్రేషన్‌ అధికారులతోనూ ఎలాంటి సంప్రదింపులు జరపలేదని తెలిసింది.

2021లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన కేసులో నిందితుల్లో ఒకరిగా వల్లభనేని వంశీని చేర్చారు. ఆయన కోసం గత రెండు మూడు రోజులుగా పోలీసులు వెతుకుతున్నారు. గన్నవరం పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో ఏ - 21గా ఉన్న మెండెం రాంబాబు, ఏ - 50 అయిన అమరేంద్ర రెడ్డి, ఏ - 62 ఇమ్రాన్‌లను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసింది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని గన్నవరానికి తీసుకెళ్లారు. అయితే, దీనిపై పోటీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. సోమవారం వీరిని కోర్టులో హాజరుపరుస్తారని అంటున్నారు. 

అయితే వల్లభనేని వంశీ మాత్రం ఆచూకి దొరకలేదు. వల్లభనేని వంశీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. హైదరాబాద్ లో ఆయన ఉన్నారని తెలిసి 3 ప్రత్యేక పోలీసు బృందాలు ఏపీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లాయి. ఆయన అక్కడ లేకపోవడంతో వెనుదిరిగి వచ్చాయి. అయితే వల్లభనేని వంశీ ఎక్కడికి వెళ్ళారనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికి కలిగిస్తోంది.

2021 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాడి చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. తన అనుచరులు, వైసీపీ నాయకులను పురమాయించి టీడీపీ ఆఫీసుకు నిప్పుబెట్టించారని ఆరోపిస్తున్నారు. ఆఫీసులోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలకు నిప్పు పెట్టారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Embed widget