అన్వేషించండి

VRO Beats Flood Victim: విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం

Vijayawada News | విజయవాడలో వరద బాధితుడిపై మహిళా వీఆర్వో చెయ్యి చేసుకోవడం సంచలనంగా మారింది. తమకు నీళ్లు, ఆహారం లేవని అడిగినందుకు చెంపదెబ్బ కొట్టిన వీఆర్వోపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

VRO beats Flood Victim in Vijayawada | విజయవాడ: వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలబడి, వారికి ఉచితంగా సరుకులు పంచింది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు కౌంటర్ వెయిట్స్ సైతం అమర్చారు. విజయవాడను ముంచిన బుడమేరు గండ్లను సైతం రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిదక చర్యలు చేపట్టి పూడ్చింది. కానీ విజయవాడలో ఓ వీఆర్వో చేసిన పనికి అంతా షాకయ్యారు. తమకు ఆహారం, నీళ్లు రావడం లేదని వరద బాధితుడు ప్రశ్నించడంతో ఆవేశానికి లోనైన వీఆర్వో జయలక్ష్మీ అతడిని చెంపదెబ్బ కొట్టింది. ఈ ఘటనపై స్పందించిన చంద్రబాబు ప్రభుత్వం వీఆర్వోపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. వీఆర్వో జయలక్ష్మీని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ఆమెకు షాకాజ్ నోటీసులు జారీ చేశారు.

నన్నే ప్రశ్నిస్తావా అంటూ మహిళా వీఆర్వో వీరంగం

విజయవాడలో వరద బాధితులపై మహిళా వీఆర్వో చెలరేగిపోయింది. తమ వీధిలో మంచినీరు, ఆహారం అందలేదని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తి చెంప పగలగొట్టింది జయలక్ష్మీ. అక్కడితో ఆగకుండా పోలీసుల ముందే చెప్పరాని పదాలు వాడుతూ బాధితుడిని దుర్భాషలాడింది. బాధితుడు తనను ప్రశ్నిస్తుంటే ఫోన్ లో రికార్డ్ చేసి బెదిరింపులకు దిగింది. అయితే వరద సాయం అడిగితే చెయ్యి చేసుకోవడం ఏంటని బాధితుడితో పాటు స్థానికులు జరిగిన ఘటనతో ఒక్కసారిగా షాకయ్యారు. తమకు ఆహారం, మంచినీళ్లు లేవని అడిగితే వారికి సహాయక చర్యలు చేపట్టాల్సింది పోయి, ఓ వ్యక్తిపై మహిళా అధికారిణి దుర్భాషలాడుతూ చెయ్యి చేసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఆర్వో జయలక్ష్మీపై చర్యలు తీసుకోవాలని బాధితుడు, స్థానికులు డిమాండ్ చేశారు. ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. వరద బాధితుడిపై దురుసుగా వ్యవహరిస్తూ చెయ్యి చేసుకున్నందుకు ఆమెను విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

చంద్రబాబు ఆదేశాలను ఉద్యోగులు పాటించరా?

వరద బాధితులకు ప్రభుత్వం, అధికారులు అండగా ఉండాలని సీఎం చంద్రబాబు ఇదివరకే సూచించారు. కానీ కొన్నిచోట్ల అవాంఛనీయ ఘటనలు జరగుతున్నాయి. బాధితులతో సంయమనంగా వ్యవహరించి, వారికి సర్దిచెప్పడంతో పాటు సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు చంద్రబాబు. వరద బాధితులకు సహాయం చేయడంలోగానీ, వరద పరిస్థితులపైగానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని అధికారులతో పాటు మంత్రులను సైతం ఇదివరకే చంద్రబాబు  హెచ్చరించారు. కానీ కొందరు ఉద్యోగుల తీరు మారకపోవడంపై ప్రభుత్వం సీరియస్ అయింది.

సీఎం చంద్రబాబు విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలైన ఊర్మిళానగర్, భవానీపురం ప్రాంతంలో సోమవారం పర్యటించారు. బాధితులను పరామర్శించడంతో పాటు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయంపై ఆరా తీశారు. వరద బాధితులను అడిగి వారి కష్టాలు తెలుసుకున్నారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోందని, మంత్రులు, అధికారులు ఇంకా బురదలోనే పనిచేస్తూ.. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

Also Read: Prakasam Barrage Is Safe: ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు పూర్తి, కౌంటర్ వెయిట్స్ ఫిక్స్ చేసిన కన్నయ్యనాయుడు

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Embed widget