అన్వేషించండి

Amit Shah AP Tour: పవన్ కళ్యాణ్‌కు కుర్చీ లేదని గమనించిన అమిత్ షా, వెంటనే ఏం చేశారో చూడండి

Pawan Kalyan News | ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించిన సౌత్ క్యాంపస్ ప్రారంభోత్సవంతో ఆసక్తికర ఘటన జరిగింది. రెండు కుర్చీలే ఉన్నాయని గమనించిన అమిత్ షా మరో కుర్చీ తెప్పించి పవన్ ను ఆహ్వానించారు.

Amit Shah For Pawan Kalyan | గన్నవరం: విజయవాడ సమీపంలోని గన్నవరం మండలం కొండపావులూరులో NDRF 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్శంగా జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (NIDM) సౌత్ క్యాంపస్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు. NDRF కార్యకలాపాలు వివరించే ఏవీని  సభావేదికపై  అధికారులు ప్రదర్శించచారు. దేశంలో NDRFకు మొత్తం 16 బెటాలియన్లు ఉండగా, ఇక్కడ గన్నవరంలో ఉన్నది 10వ బెటాలియన్.


Amit Shah AP Tour: పవన్ కళ్యాణ్‌కు కుర్చీ లేదని గమనించిన అమిత్ షా, వెంటనే ఏం చేశారో చూడండి

కొండపావులూరులో NDRF 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అక్కడ కేవలం రెండు కుర్చీలు మాత్రమే ఉండటంతో, ఇది గమనించిన అమిత్ సిబ్బందికి చెప్పి మరో కుర్చీ తెప్పించారు. తాము కూర్చునే సమయంలో పవన్ కళ్యాణ్ ను కూడా ఆయన ఆహ్వానించారు. కేంద్ర మంత్రి అమిత్ షా కుర్చీ తెప్పించి పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి గౌరవించారని జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుర్చీల కోసం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ వెంపర్లాడలేదని, ఆయన మంచితనానికి హోదాకు తగిన గౌరవం దక్కిందని జనసేన నేతలు చెబుతున్నారు. పవన్ కు అమిత్ షా కుర్చీ తెప్పించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

అంతకుముందు ఆదివారం ఉదయం విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో ఏపీ బీజేపీ నేతలతో కేంద్ర మంత్రి అమిత్‌షా సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరపాటు బీజేపీ నేతలతో పలు అంశాలపై భేటీ కొనసాగింది. కేంద్రం నుంచి ఏపీకి అందుతున్న సాయంపై గట్టిగా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టుతో పాటు రాజధాని అమరావతి నిర్మాణం లాంటి అంశాల్లో కేంద్రం సహకారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారికి సూచించారు. మరోవైపు అంతర్గత విభేదాలను పక్కన పెట్టాలని, పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన హైందవ శంఖారావం సభ విజయవంతం కావడంపై వీహెచ్‌పీ నేతలను, బీజేపీ నేతలను అమిత్ షా అభినందించారు. అధిష్టానం ఇచ్చే సూచనల్ని పాటిస్తూ తమదైన శైలిలో రాజకీయాలు చేయాలని, కొన్ని అంశాల్లో ఆచితూచి వ్యవహరించాలని గీత దాటవద్దని సున్నితంగా సూచించినట్లు సమాచారం.

Also Read: Amit Shah: విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగువారి ఆత్మగౌరవమన్న అమిత్ షా- జగన్ ప్యాలెస్‌లపై ఆరా తీసిన కేంద్ర మంత్రి

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget