అన్వేషించండి

Union Minister Murugan: ఆర్ధిక ప్రగతి సాధించేలా బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు - కేంద్ర మంత్రి మురుగన్‌

Union Minister Murugan: ఏపీ ఆర్ధిక ప్రగతి సాధించేలా 2024-25 బడ్జెట్ ఉందని కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురగన్ తెలిపారు. 2024 - 25 బడ్జెట్​లో రూ. 50,474 కోట్లు కేటాయించామన్నారు.

Union Minister Murugan on Central Budget for AP: ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం ఆర్ధిక ప్రగతి సాధించేలా 2024-25 బడ్జెట్ ఉందని కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురగన్  తెలిపారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా  శనివారం నాడు ఆయన‌ చిత్ర పటానికి కేంద్రమంత్రి మురుగున్ పూల‌మాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర  బడ్జెట్ ఉందన్నారు. ప్రధాన మంత్రి మోదీ ముందు చూపుకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ నిదర్శనమన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, వెనుకబడిన ప్రాంతాలకు అధిక మొత్తంలో నిధులు కేటాయించారన్నారు.  రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి 2040 టార్గెట్ గా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఎకానమీ 8.2 శాతం ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్నామని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ అనంతరం మేధావులు, వివిధ వర్గాల ప్రతినిధులతో విజయవాడ వచ్చిన ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.


అందరి చూపు ఏపీ పైనే
పరిశ్రమలు, ‌పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపే చేస్తారని మురుగన్ తెలిపారు. పేదల కోసం ఉచిత బియ్యం, ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగం ,‌ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయన్నారు.  ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందేలా కేంద్రం సహకారం ఉంటుందన్నారు. విభజన చట్టంలోని అనేక అంశాలను ఇప్పటికే అమలు చేశారని కేంద్రమంత్రి తెలిపారు. కేంద్ర ఏపీకి అదనపు నిధులు కూడా భవిష్యత్తులో  అందజేస్తుందన్నారు. ప్రాధాన్యత క్రమంలో అన్ని హామీలన్నీ అమలు చేస్తామని ప్రకటించారు.  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్లో సరళతరం, ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేయడం దిశగా తగిన నిర్ణయాలను బడ్జెట్‌లో తీసుకున్నట్లు మురుగున్ తెలిపారు.  

ఏపీ అభివృద్ధికి 2024 - 25 బడ్జెట్​లో దాదాపు రూ. 50,474 కోట్లు కేటాయించామన్నారు. ఏపీకి జీవనాడిగా ఉన్న  పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం పూర్తి సాయం అందిస్తుందన్నారు.   విశాఖ - చెన్నై, హైదరాబాద్ - బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్లకు బడ్జెట్​లో ప్రాధాన్యం ఇచ్చారని అలాగే ప్రతిష్ఠాత్మక పూర్వోదయ స్కీంను తెచ్చామని, దీనివల్ల జార్ఖండ్ నుంచి ఏపీ వరకూ ఉన్న తూర్పు తీర ప్రాంతం అభివృద్ధికి గ్రోత్ ఇంజన్​గా మారుస్తామన్నారు.

వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం
 వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు.  డిజిటల్ క్రాప్ సర్వే చేసి కిసాన్ క్రెడిట్ అందజేస్తున్నట్లు తెలిపారు. ఏపీ నుంచి 60 శాతం  మత్స్య ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయన్నారు. తీర ప్రాంతాలను అభివృద్ధి చేసి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పించామన్నారు. చేతి వృత్తుల వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా రుణాలు అందజేస్తామన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు వంటి పట్టణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. మహిళలు అన్ని రంగాల్లో నిలిచేలా ప్రోత్సహిస్తామన్నారు.  రాయలసీమ, ఉత్తరాంధ్రలతో పాటు ప్రకాశం జిల్లాను కూడా వెనకబడిన ప్రాంతంగా గుర్తించి అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని మంత్రి మురుగన్ తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Embed widget