అన్వేషించండి

Ramana Deekshitulu: తిరుమల లడ్డూ వివాదం - ఐదేళ్లు మహా పాపం జరిగిందని రమణ దీక్షితులు ఆవేదన

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు స్పందించారు. గత ఐదేళ్లు నిరభ్యంతరంగా మహా పాపం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Ramana Deekshitulu Comments On Tirumala Laddu: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు (Ramana Deekshitulu) శుక్రవారం స్పందించారు. పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించడం అపచారమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నోసార్లు టీటీడీ ఛైర్మన్, ఈవో దృష్టికి తాను తీసుకెళ్లానని.. అయినా ఫలితం లేకపోయిందని మీడియా సమావేశంలో చెప్పారు. ఈ రెండు మూడు రోజుల్లో వస్తున్న వార్తలు చాలా బాధగా ఉందని.. శ్రీవారి భక్తులకు తీవ్ర మనోవేదన కలిగించాయని అన్నారు. 'నైవేద్యాలు, లడ్డూల్లో పవిత్రమైన నెయ్యిని కల్తీ చేయడం బాధ కలిగించింది. ప్రసాదాల నాణ్యతపై చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లాను. కానీ నాది ఒంటరి పోరాటమే అయ్యింది. తోటి అర్చకులు ఎవరూ తమ వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. దీంతో గత ఐదేళ్లూ నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. నెయ్యి పరీక్షలకు సంబంధించి ల్యాబ్ రిపోర్టులు చూశాను. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు అందులో బహిర్గతమైంది. పరిశుభ్రమైన ఆవు పాలతో తయారైన నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసేందుకు వీలు లేదు.' అని రమణ దీక్షితులు పేర్కొన్నారు.

'ప్రక్షాళన చేపట్టారు'

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రక్షాళన దిశగా ఎన్నో చర్యలు చేపట్టారని రమణ దీక్షితులు అన్నారు. 'కర్ణాటకలోని నందిని డెయిరీ నుంచి నాణ్యత ఉన్న నెయ్యిని వినియోగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇది శుభ పరిణామం. గతంలో లడ్డు తయారీలో వినియోగించిన కల్తీ నెయ్యి అంశంపై పూర్తి స్థాయి విచారణ జరగాలి. కల్తీ, స్వామి వారి కైంకర్యాలు గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్తే గతంలో నాపై కేసులు పెట్టారు. నేను ఎన్ని ఇబ్బందులు పడినా నా స్వామి వారికి సమయానికి నైవేద్యం, కైంకర్యాలు జరిగితే చాలు. కైంకర్యాలు, ప్రసాదాల్లో లోపాలు జరిగాయి. ఈ కల్తీ జరగడం వల్ల మా చేతుల మీద జరగడం చాలా దురదృష్టకరం. ఆగమ శాస్త్రం, దిట్టం ప్రకారం ప్రసాదాలు చేయాలి. దిట్టం కన్న తక్కువ చేస్తే అది అపచారం. స్వామి వారికి నాణ్యత, రుచిగా నైవేద్యం పెడితే భక్తులను అనుగ్రహిస్తారు. సేంద్రీయ వ్యవసాయం బియ్యంతో నైవేద్యం పెట్టకూడదని గతంలోనే చెప్పాను. వందల సంవత్సరాలుగా వస్తోన్న ఆచారం మార్చవద్దని చెప్పాను. గతంలో అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగి ఉండవు.' అని రమణ దీక్షితులు పేర్కొన్నారు.

కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని సీఎం చంద్రబాబు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. దీనికి సంబంధించిన రిపోర్టులను తాజాగా టీడీపీ నేత ఆనం బయటపెట్టారు. జగన్ హయాంలో టీటీడీ లడ్డూల తయారీలో వాడే నెయ్యిలో.. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలగలిసి ఉండొచ్చనే అనుమానాన్ని గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (NDDB) కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్లు టీడీపీ తెలిపింది. నెయ్యి పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని.. అందులో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు కలగలిసి ఉన్నట్లు ఆ పరీక్షల్లో వెల్లడైనట్లు పేర్కొంది. మరోవైపు, ఈ అంశంపై టీటీడీ విచారణకు ఆదేశించింది. 

Also Read: Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదంపై తొలిసారి స్పందించిన పవన్ కల్యాణ్ - బాధ్యులపై కఠినచర్యలు ఉంటాయన్న డిప్యూటీ సీఎం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Share Market Record 20 Sept: స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!
రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా క్యూలు​!
IND vs BAN : బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
Embed widget