అన్వేషించండి

Snake Catcher Bhaskar Naidu: టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఆరోగ్యంపై వైద్యులు ఏమన్నారంటే..

Tirumala Snake Catcher Bhaskar Naidu: తిరుమలలో పది వేలకు పైగా పాములను పట్టుకున్న టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఇటీవల పాము కాటుకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందించారు.

Tirumala Snake Catcher Bhaskar Naidu: పామును చూస్తే చాలు భయంతో పరుగులు తీస్తాం.. కలోలో కనిపించినా ఏదో ఆపద వస్తుందని ఆలయాలలో పరిహారాలు చేస్తుంటాం. కానీ ఆయన మాత్రం పాము కనిపిస్తే చాలు నేను ఉన్న అంటు ముందుకు వస్తాడు. పిల్ల పాముల వద్ద నుండి కాలనాగుల వరకు పట్టుకుంటూ.. మానవ సేవే మాధవ సేవ రూపంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి కొలువులో స్నేక్ క్యాచర్ గా అవతారం ఎత్తి దాదాపు పది వేలకు పైగా పాములను పట్టి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలి పెట్టాడు. తన ప్రాణాలను పనంగా పెట్టి విష సర్పాల నుండి భక్తులను కాపాడిన వ్యక్తి నేడు విష సర్పం కాటుకు గురై ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తిరుమలలో పది వేలకు పైగా పాములను పట్టుకున్న టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఇటీవల పాము కాటుకు గురయ్యారు. దీంతో భాస్కర్ నాయుడిని హుటాహుటిన స్విమ్స్ ఆసుపత్రి తరలించారు. పరిస్ధితి విషమంగా ఉండడంతో స్నేక్ క్యాచర్‌ను మెరుగైన వైద్యం కోసం అమర్ రాజా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. టీటీడీ అధికారులు దగ్గరుండి ఆయన ఆరోగ్య‌ పరిస్ధితిపై ఆరా తీస్తున్నారు. ఇప్పుడిప్పుడే భాస్కర్ నాయడు ఆరోగ్య పరిస్ధితి కుదుట పడుతుందని వైద్యులు వెల్లడించారు. తిరుమలలో భక్తులను పాముల నుంచి కాపాడుతూ కొన్ని దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న భాస్కర్ నాయుడు త్వరగా కోలుకోవాలని భక్తులు, స్థానికులు శ్రీ వేంకటేశ్వరుడిని ప్రార్ధిస్తున్నారు.

అలా మొదలైంది..
నేను ఉన్నానంటూ తిరుమలలో శ్రీవారి భక్తులను కాపాడేందుకు తన ప్రాణాలను అడ్డు పెట్టి మరి చాకచక్యంగా కాలనాగులను సైతం పట్టి బంధించేవారు భాస్కర్ నాయుడు. వాటిని తిరుమలకు దూరంగా ఉన్న అవ్వాచారి కోనలో వదిలి‌ పెడుతుంటారు. తొలుత 1982లో‌ టీటీడీ అటవీ శాఖలో‌ ఉద్యోగిగా చేరాడు. 10 ఏళ్ల తరువాత ఆయన్ను టీటీడీ శాశ్వత ఉద్యోగిగా తీసుకుంది. అయితే విష సర్పాల వల్ల ఆపద అన్న సమయంలో నేరుగా వచ్చి పాములను చాకచక్యంగా పట్టుకోవడంతో టీటీడీ ఆయన సరైన వ్యక్తి అని భావించింది. అప్పటి‌ నుండి భక్తులను కాపడేందులు భాస్కర్ నాయుడు పూర్తి స్తాయిలో స్నేక్ క్యాచర్ గా మారిపోయారు.

దాదాపు 25 ఏళ్లలో స్నేక్ క్యాచర్‌గా 10 వేలకు పైగా పాములను పట్టుకున్నారు. భక్తులను విష సర్పాల‌ నుండి కాపాడినందుకు టీటీడీ పలుసార్లు భాస్కర్ నాయుడుని సన్మానించి అవార్డులను ప్రధానం చేసింది. దీంతో‌ భాస్కర్ నాయుడికి టీటీడీలో ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అటుతరువాత 2016లో భాస్కర్ నాయుడు ఉద్యోగ విరమణ పొందినా.. ఆయన సేవలు అవసరమని భావించి ఆయన్ను ప్రత్యేకంగా టీటీడీ నియమించుకుంది. 

స్నేక్‌ క్యాచర్‌ను పాము ఎలా కాటు వేసిందంటే...
నాగుపాము, జెర్రిపోతు, కొండచిలువ, గుడ్డి పింజరి, కట్లపాము, దాసరి పాము, బిల్లెరికి వంటి ప్రమాదకరమైన పాములను భాస్కర్ నాయుడు బంధించేవారు. ఈ క్రమంలో ఆయన మూడుసార్లు పాము కాటుకు గురయ్యారు. ఓసారి వేలుకు విషం ఎక్కడంతో ఆ వేలు చివరి భాగం వరకు వైద్యులు తొలగించారు. అయినా భక్తుల సేవ పరమావధిగా భావించి భాస్కర్ నాయుడు పాములకు భయపడకుండా నిరంతరం భక్తులకు సేవలు అందించారు. టీటీడీ అనుబంధ ఆలయాలు, టీటీడీకి సంబంధిన కార్యాలయాల్లో, స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీల్లో పాములు వస్తే ముందుగా భాస్కర్ నాయుడికే ఫోన్ కాల్ వస్తుంది. ఇలానే రెండు రోజుల క్రితం ఎస్వీ యూనివర్సిటీ నుండి ఫోన్ వచ్చింది. వర్సిటీలో ఓ గదిలో పాము వచ్చిందని అక్కడి సిబ్బంది చెప్పడంతో హుటాహుటినా అక్కడికి చేరుకున్న భాస్కర్ నాయుడు పామును పట్టేందుకు ప్రయత్నించే సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలో చేతిలోని ఫోన్ లో టార్చ్ లైట్ వేసుకుని పామును పట్టేందుకు ప్రయత్నించారు.. ఇంతలో చేతికి వేసుకున్న గ్లౌజ్ జారి పోయింది. అదే సమయంలో పాము అతని చేతిపై కాటు చేసింది.

Also Read: February 2022 Horoscope : ఫిబ్రవరి నెలలో ఈ నాలుగు రాశులవారి జాతకమే మారిపోతుంది..మీరున్నారా ఇందులో...

Also Read: Weather Updates: ఏపీ, తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అకాల వర్షాలతో పెరిగిన చలి తీవ్రత..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala: తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Ayodhya Ram Mandir : అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
Advertisement

వీడియోలు

Tamilnadu Deputy CM Udhayanidhi Stalin Full Speech | ABP Southern Rising Summit 2025 లో ఉదయనిధి స్టాలిన్ పూర్తి ప్రసంగం | ABP Desam
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Dravidian Algorithm ABP Southern Rising Summit 2025 | ద్రవిడయన్ ఆల్గారిథంపై మాట్లాడిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Speech | ABP Southern Rising Summit 2025 లో తమిళనాడు గవర్నర్ పై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఫైర్  | ABP Desam
ABP Director Dhruba Mukherjee Speech | ABP Southern Rising Summit 2025 లో ప్రారంభోపన్యాసం చేసిన ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ | ABP Desam
ABP Southern Rising Summit 2025 Begins | ప్రారంభమైన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025 | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Ayodhya Ram Mandir : అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
నెలకు 1000 km డ్రైవ్‌ చేసే సీనియర్‌ సిటిజన్లకు రూ.15 లక్షల్లో పర్‌ఫెక్ట్‌ ఆటోమేటిక్‌ కార్‌ - దీనిని మిస్‌ అవ్వొద్దు!
సీనియర్‌ సిటిజన్లు ఈజీగా హ్యాండిల్‌ చేయగల సేఫ్‌, ఆటోమేటిక్‌ కార్‌ - రూ.15 లక్షల బడ్జెట్‌లో
Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
Snack for Weight Loss : ప్రతిరోజూ బెల్లం-శనగలు తింటే కలిగే లాభాలివే.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు
ప్రతిరోజూ బెల్లం-శనగలు తింటే కలిగే లాభాలివే.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు
ABP Southern Rising Summit 2025: దక్షిణ భారత్ నుంచి లభించిన ప్రేమ ఎంతో స్ఫూర్తిదాయకం - ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ
దక్షిణ భారత్ నుంచి లభించిన ప్రేమ ఎంతో స్ఫూర్తిదాయకం - ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ
Embed widget