అన్వేషించండి

Tirumala News: తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణం సహా టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలివే

టీటీడీలో పలు అభివృద్ధి పనులకు దాదాపు 250 కోట్లు నిధులు కేటాయించడం జరిగిందని, తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ నిర్మాణానికి 4.15 కోట్ల రూపాయలను కేటాయించామని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  

TTD Key Decisions: తిరుమల: సనాతన ధర్మాన్ని కాపాడే లక్ష్యంతో తిరుమలలో శ్రీవాణి ట్రస్టును తీసుకొచ్చామని టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన టీటీడీ పాలక‌మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీలో పలు అభివృద్ధి పనులకు దాదాపు 250 కోట్లు నిధులు కేటాయించడం జరిగిందని, తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ నిర్మాణానికి 4.15 కోట్ల రూపాయలను కేటాయించామని తెలిపారు.  హెచ్.వి.సి లో 144 గదుల ఆధునికీకరణ రూ 2.35 కోట్ల రూపాయలను మంజూరు చేశాంమని చెప్పిన ఆయన, కాటేజీల ఉపవిచారణ కార్యాలయాలు ఆధునీకరణకు 1.68 కోట్లు అమోదం తెలిపాంమన్నారు
3 ఏళ్ల పాటు వేస్ట్ మ్యానేజ్మెంట్ నిర్వహణకు 40.50 కోట్లతో ఓ ప్రైవేటు కంపెనీకి టెండర్ ఖరారు చేశాం, ఎఫ్.ఎం.ఎస్ సేవలకు 29.50కోట్ల రూపాయల నిధులు కేటాయించాం అన్నారు. ఒంటిమిట్టలో దాతల సహకారంతో 4 కోట్ల అన్నదాన భవనంను నిర్మించనున్నామని, 3.55 కోట్లతో తిరుమలలో పోలీస్ క్వార్టర్స్ లో మరమ్మత్తులు నిర్వహించేందుకు నిధులు కేటాయించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రూ.3.10 కోట్లతో వివిధ ప్రాంతాల్లో స్టెయిన్ లెట్ స్టీల్ చెత్త కుండీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని, తిరుపతి ఎస్వీ వేదిక వర్సిటీలో స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి 5 కోట్లు రూపాయలు ఇవ్వాలని, 7.44 కోట్లతో టీటీడీకి అవసరపడ్డ అధునాతన కంప్యూటర్లు కొనుగోలు చేశామన్నారు. 

టీటీడీ పరిపాలన భవనంలో సెంట్రలైజ్డ్ రికార్డు స్టోర్ నిర్మాణానికి రూ 3.80 కోట్ల రూపాయల నిధులకు గానీ పాలక మండలి ఆమోదం తెలిపింది. ఇక నగరి నియోజకవర్గంలోని బుగ్గలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో కళ్యాణమండపం నిర్మాణానికి 2 కోట్లు రూపాయలు మంజూరు ‌చేశాం. తిరుపతిలోని‌ స్విమ్స్ నిర్వహణను పూర్తి స్థాయిలో టీటీడీ తీసుకునే విధంగా పాలక మండలి నిర్ణయం తీసుకుందన్నారు. 1,200 పడకలతో స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధి, 97 కోట్లతో నూతన భవనాలు నిర్మాణం చేపట్టేందుకు పాలక మండలి ఆమోదం తెలపడంతో పాటుగా, తిరుచానూరు పుష్కరిణికి ఇత్తడి గ్రిల్స్ అమరిక 6 కోట్ల రూపాయల నిధులను ఇస్తామన్నారు. 

తిరుపతి రామానుజ సర్కిల్ నుండి రేణిగుంట వరకు బిటి రోడ్డు నిర్మాణానికి 5.16 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని, జమ్మూలో 24 నెలల వ్యవధిలో శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తి చేసి, వైభవంగా ఆలయాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. పట్టణాలతో సమానంగా గిరిజన ప్రాంతాల్లో కూడా శ్రీవారి ఆలయాలు, కళ్యాణమండపాలు నిర్మిస్తున్నాంమని, గుజరాత్ గాంధీనగర్, ఛత్తీస్‌గఢ్ రాయపుర్ లో త్వరలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేస్తాంమని ఆయన తెలిపారు. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగం జరుగుతొందని దుష్ప్రచారం చేస్తున్నారని, కొందరు వైసిపీ నాయకులు శ్రీవాణి ట్రస్ట్ నిధులు దోచుకుంటున్నారని అబద్ధపు ప్రచారం జరుగుతుందని, సనాతన ధర్మాన్ని కాపాడే గొప్ప లక్ష్యంతో శ్రీవాణి ట్రస్ట్ తీసుకొచ్చాం అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 2600 ఆలయాలు నిర్మాణం చేస్తున్నాంమని, ఇప్పటి వరకూ శ్రీవాణి ‌నిధులతో దాదాపు 300 పురాతన ఆలయాల‌ జీర్ణోద్ధరణ చేస్తున్నామని, ఆలయాల్లో దీపధూప నైవేద్యాలకు, గోశాలలు సంరక్షణ, హిందూ ధర్మప్రచారాలకు శ్రీవాణి నిధులు ఖర్చు చేస్తున్నట్లు ఆయన అన్నారు. 

పారదర్శకంగా శ్రీవాణి ట్రస్ట్ నడుపుతుంటే, రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తులపై న్యాయ సలహా మేరకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మాదక ద్రవ్యాలు, పేలుడు పద్ధార్థాలను గుర్తించే పరికరాలను రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కొనుగోలు చేస్తామని చెప్పారు. కర్నూలు జిల్లా యాగంటిలో 2.45 కోట్లతో కళ్యాణమండపం నిర్మాణం చేపట్టేందుకు పాలక మండలి ఆమోదం తెలిపిందని టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు.



ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Railway Guidelines For Ghee : రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
హైబ్రిడ్ SUVని లాంచ్ చేసిన చైనా కంపెనీ, పూర్తి ట్యాంక్‌తో 1700 KM జర్నీ చేయవచ్చు.. ధర ఎంతంటే
హైబ్రిడ్ SUVని లాంచ్ చేసిన చైనా కంపెనీ, పూర్తి ట్యాంక్‌తో 1700 KM జర్నీ చేయవచ్చు.. ధర ఎంతంటే
Embed widget