అన్వేషించండి

TTD News: శ్రీవారి భక్తులకు అలెర్ట్, రేపు ఆ దర్శనాలు రద్దు

Tirumala News Today : తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినం సందర్భంగా ఆదివారం ఆస్థానాన్ని టీటీడీ శాస్ర్తోక్తంగా నిర్వహించనుంది. కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేశారు.

TTD News: తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో దీపావళి(Diwali 2023) పర్వదినం సందర్భంగా ఆదివారం (Sunday ) దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్ర్తోక్తంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. అలాగే ప్రొటోకాల్‌ దర్శనం మినహా బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశారు. శనివారం బ్రేక్‌ దర్శనం సిఫారసు లేఖలు స్వీకరించడం లేదని టీటీడీ పేర్కొంది.

వైకుంఠ ద్వార దర్శనానికి ఫుల్ డిమాండ్
శ్రీవారి వైకంఠ ద్వార దర్శన టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఆన్‌లైన్‌లో ఉంచిన 2.25 లక్షల టికెట్లను 21 నిమిషాల్లోనే భక్తులు బుక్‌ చేసుకున్నారు. డిసెంబర్‌ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారదర్శనానికి సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనం, గదుల కోటా టికెట్లను శుక్రవారం ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేసింది. 2.25 లక్షల రూ.300 దర్శన టికెట్లను ఉదయం 10 గంటలకు విడుదల చేయగా, కేవలం 21 నిమిషాల్లోనే పూర్తయ్యాయి. వీటి ద్వారా టీటీడీకి రూ.6.75 కోట్ల ఆదాయం సమకూరింది. శ్రీవాణి దర్శన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు, గదుల కోటాను సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. 

పెద్ద శేషుడిపై అమ్మవారి దర్శనం
పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శనివారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై శ్రీ బద్రి  నారాయణుడి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు  ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారు హంస వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు.

వాహన సేవల్లో ప్రముఖులు
వాహనసేవల్లో తిరుమల పెద్దజీయర్‌ స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, జేఈవో వీరబ్రహ్మం దంపతులు, ఆలయ  డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, వీజివో  బాలి రెడ్డి, ఏఈవో రమేష్, ఆలయ అర్చకులు బాబు స్వామి, సూపరిండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్, గణేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మూడు ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు. 

తిరుమల హుండీ ఆదాయం
తిరుమల శ్రీవారిని శుక్రవారం 56,978 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,617 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.87 కోట్లు ఆదాయం వచ్చింది. నేరుగా శ్రీవారి దర్శనం చేసుకోచ్చు. దర్శన టోకెన్లు లేని వారికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Crime News: కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
Jubilee Hills by-elections: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
Vande Bharat Trains:నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
Bike Fuel Efficiency Tips: రోజువారీ రైడింగ్‌లో మీ బైక్‌ మైలేజ్‌ పెంచుకోవడానికి 10 సులభమైన చిట్కాలు
ఇంధన ఖర్చు తగ్గించ్చేద్దాం?, మీ బైక్‌ మైలేజ్‌ పెంచే 10 సింపుల్‌ మార్గాలు
Advertisement

వీడియోలు

Harman Preet Kaur Smriti Mandhana | చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి | ABP Desam
గంభీర్ భాయ్.. నీకో దండం! బ్యాటింగ్‌ పొజిషన్ ఇలా సెలక్ట్ చేస్తున్నావా?
చిరస్మరణీయ విజయం చిరకాలం గుర్తుండాలని టాటూలు వేయించుకున్న హర్మన్, స్మృతి
పీఎం మోదీని కలిసినప్పుడు అలా ఎందుకు చేసానంటే..!
అల్లటప్పా ఆటగాడనుకున్నారా.. రీప్లేస్ చేయాలంటే బాబులు దిగిరావాల!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Crime News: కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
కాకినాడ జిల్లా సోమవరంలో కారు బీభత్సం- ముగ్గురు మృతి- ఏడుగురు చిన్నారులకు గాయాలు 
Jubilee Hills by-elections: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
Vande Bharat Trains:నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
నాలుగు మార్గాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా! ఐదు పుణ్యక్షేత్రాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్‌
Bike Fuel Efficiency Tips: రోజువారీ రైడింగ్‌లో మీ బైక్‌ మైలేజ్‌ పెంచుకోవడానికి 10 సులభమైన చిట్కాలు
ఇంధన ఖర్చు తగ్గించ్చేద్దాం?, మీ బైక్‌ మైలేజ్‌ పెంచే 10 సింపుల్‌ మార్గాలు
Mental Stress Relief Tips : మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యూజ్ అయ్యే ఎఫెక్టివ్‌ టిప్స్‌ ఇవే!
మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యూజ్ అయ్యే ఎఫెక్టివ్‌ టిప్స్‌ ఇవే!
శ్రీ చరణి నుంచి స్మృతి మంధాన వరకు ప్రభుత్వాలు ఇచ్చిన ప్రైజ్‌మనీ ఇదే! ఏ రాష్ట్రం ఎన్ని కోట్లు ఇచ్చింది?
శ్రీ చరణి నుంచి స్మృతి మంధాన వరకు ప్రభుత్వాలు ఇచ్చిన ప్రైజ్‌మనీ ఇదే! ఏ రాష్ట్రం ఎన్ని కోట్లు ఇచ్చింది?
Car Safety Tips: కారు 1.20 లక్షల కిలోమీటర్లు నడిస్తే ఏయే విడిభాగాలను మార్చడం చాలా అవసరం?
కారు 1.20 లక్షల కిలోమీటర్లు నడిస్తే ఏయే విడిభాగాలను మార్చడం చాలా అవసరం?
Arjun Sarja Family in Tirumal
Arjun Sarja Family in Tirumal
Embed widget