అన్వేషించండి

Chittoor News: కర్ణాటకలో ఎన్నికల వేళ ఏపీలో దుండగుల మాస్టర్ ప్లాన్! పోలీసులకు అడ్డంగా బుక్

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నకిలీ పోలీసులు ముఠా అరెస్టుకర్ణాటక పోలీసులం అంటూ లక్షల్లో నగదు కాజేసిన నకిలీ పోలీసు ముఠా

AP - Karnataka Boarder: ఆంధ్రా - కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో నకిలీ పోలీసులు హల్ చల్ చేశారు.. ఖాకీ‌ చొక్కా ముసుగులో ఆంధ్ర - కర్ణాటక సరిహద్దులో వాహనాలను తనిఖీ‌ చేసి నగదు వసూలు చేసేవారు. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులం (Fake Police) అంటూ నాయకులను టార్గెట్ చేసుకుని నగదును అందిన వరకూ దోచుకుని పరార్ అవుతారు.. చిత్తూరు జిల్లా పోలీసులకు వచ్చిన సమాచారం మేరకూ ఆంధ్ర సరిహద్దులో కాపు కాసిన నకిలీ పోలీసుల ముఠాను పట్టుకున్నారు.

పలమనేరు (Palamanair) డీఎస్పీ సుధాకర్ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నేడు ఉదయం (మే 4) వీ కోటలోని పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి నిందితులను చూపించారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా, వీకోట మండలం సరిహద్దు ప్రాంతంలోని కర్ణాటక బార్డర్ సమీపంలో గత నెల‌ 5వ తేదీన కర్ణాటక పోలీసులు అంటూ కర్ణాటక రాష్ట్రం, శ్రీనివాసపురానికి చెందిన రియాజ్ భాషా అనే వ్యక్తి నుంచి ఐదు లక్షలు రూపాయల నగదును నకిలీ‌ పోలీసు‌ ముఠా సభ్యులు మోసం చేసి లాక్కెళ్లారు.. గత కొద్ది నెలలుగా వి.కోట మండలం, దాసర్లపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో నకిలీ పోలీసులు దోపిడీలకు పాల్పడుతున్నట్లు వికోట పోలీసులకు సమాచారం వచ్చింది. ఆ మేరకు డీఎస్పీ సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో వి.కోట సీఐ ప్రసాద్ బాబు నేత్రుత్వంలో బాధితుడు ఇచ్చిన సమాచారం మేరకు పట్రపల్లి చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేశారు. కేజీ ఆఫ్ రోడ్డు వైపు నుంచి వీకోట వైపుకు వస్తున్న ఓ వాహనం పోలీసులను చూసి తిరిగి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా వీకోట పోలీసులు అడ్డుకొని నకిలీ పోలీసు‌ ముఠాను అదుపులో తీసుకున్నారు.

పోలీసుల‌ స్టైల్‌లో విచారణ జరిపితే బయట పడిన అసలు విషయం..

నకిలీ పోలీసు ముఠాలను (Fake Police) పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా, తాము కర్ణాటక నుంచి వచ్చామని, ఆంధ్ర- కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో పరిసర ప్రాంతాల్లో రాక పోకలు సాగించే వాహనదారులను నిలిపి వారిని బెదిరించి వారి దగ్గర నుండి నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటుగా, ఐదు వందల రూపాయల నోట్లకు బదులుగా రెండు వేల రూపాయల నోట్లను ఇస్తామని నమ్మిబలికేవారమని తెలిపారు. వారి వద్ద నుండి నగదును తీసుకుని అక్కడ నుండి‌ పరార్ అయ్యే వాళ్ళమని పోలీసుల విచారణలో నకిలీ పోలీసులు వెల్లడించారు. 

రూ.500 నోట్లను 2 వేల నోట్లుగా మార్చే క్రమంలో కర్ణాటక శ్రీనివాస పురానికి చెందిన రియాజ్ 500 రూపాయలు నోట్లతో కూడిన ఐదు లక్షల రూపాయలు తీసుకెళ్లగా అవి కాజేసినట్లుగా నిందితులు తెలిపారు. బాధితుడి‌ ఫిర్యాదు మేరకు నకిలీ పోలీసుల ముఠాపై ప్రత్యేక‌ దృష్టి సారించిన చిత్తూరు జిల్లా పోలీసులు, ఓ డీఎస్పీ, ఓ సీఐ, ఓ ఎస్సై, ముగ్గురు కానిస్టేబుల్స్ ను అదుపులోకి తీసుకు‌ని కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Shocked: మధ్యప్రదేశ్ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, సాయం అందించాలని అధికారులకు ఆదేశాలు
CM Chandrababu Shocked: మధ్యప్రదేశ్ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, సాయం అందించాలని అధికారులకు ఆదేశాలు
Ramarajyam Raghav Reddy: చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన
చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన "రామరాజ్యం " రాఘవ రెడ్డి, అతడి లక్ష్యం ఇదే!
Sankranthiki Vasthunam: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
New Ration Cards: మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Attack on Chilkur Balaji Temple Rangarajan | రామరాజ్యం స్థాపించటానికి వచ్చాం అంటూ దాడి | ABP DesamVishwak sen on Prudhviraj Controversy | 11 గొర్రెలు కాంట్రవర్సీపై విశ్వక్ సారీ | ABP DesamAllu Aravind on Ram Charan | రామ్ చరణ్ పై వ్యాఖ్యల వివాదం మీద అల్లు అరవింద్ | ABP DesamPresident Murmu in Maha kumbh 2025 | మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Shocked: మధ్యప్రదేశ్ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, సాయం అందించాలని అధికారులకు ఆదేశాలు
CM Chandrababu Shocked: మధ్యప్రదేశ్ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, సాయం అందించాలని అధికారులకు ఆదేశాలు
Ramarajyam Raghav Reddy: చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన
చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన "రామరాజ్యం " రాఘవ రెడ్డి, అతడి లక్ష్యం ఇదే!
Sankranthiki Vasthunam: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ పై హింట్ ఇచ్చిన వెంకటేష్... రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
New Ration Cards: మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
Rana Daggubati: తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
Crime News: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది ఏపీ వాసులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది ఏపీ వాసులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
Allu Aravind: 'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
Brahma Anandam Trailer: ప్రభాస్ వదిలిన ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్... తండ్రీకొడుకులు, తాతామనవళ్లులా ఏడిపించేశారు కదయ్యా!
ప్రభాస్ వదిలిన ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్... తండ్రీకొడుకులు, తాతామనవళ్లులా ఏడిపించేశారు కదయ్యా!
Embed widget