By: ABP Desam | Updated at : 23 Feb 2022 08:13 AM (IST)
చంద్రబాబు నాయుడు (File Photo)
అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటపై టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కలుషిత ఆహారం విద్యార్థులకు సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ద్రవిడ వర్సిటీలో ఫుడ్ పాయిజన్ కావడంపై కుప్పం పార్టీ నేతలను చంద్రబాబు ఆరా తీశారు. ద్రవిడ యూనివర్సిటీలోని అక్కమహాదేవి లేడీస్ హాస్టల్ విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ అయిన కారణంగా అసుపత్రి పాలయ్యారు. మధ్యాహ్నం భోజనం చేసిన వారిలో దాదాపు 25 మంది అసుపత్రి పాలైనట్లు స్థానిక నేతలు చంద్రబాబుకు వివరించారు.
ఫుడ్ పాయిజన్కు గురైన విద్యార్థినుల ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న వైద్య సాయంపై చంద్రబాబు నేతలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ముగ్గురు విద్యార్థినులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారని నేతలు వివరించారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించేందుకు తగిన సహాయ సహకారాలు అందించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. విద్యార్థులు తినే ఆహారం కలుషితం అయిన ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం స్పందించాలని చంద్రబాబు అన్నారు.
Koo Appచిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటపై టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు స్పందించారు. కలుషిత ఆహారం సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారికి మెరుగైన వైద్యానికి తగిన సహాయ సహకారాలు అందించాలని పార్టీ నేతలకు సూచించారు. ఫుడ్ పాయిజన్పై వర్సిటీ యాజమాన్యం స్పందించాలన్నారు. #Chandrababu #Kuppam #DravidianUniversity https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/chandrababu-naidu-on-food-poisoning-in-dravidian-university-in-kuppam-andhra-pradesh-23590 - Shankar (@guest_QJG52) 23 Feb 2022
కలుషిత ఆహారం సరఫరాకు కారణం అయిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ నిర్లక్ష్యంతో విద్యార్ధినుల ప్రాణాల మీదకు తెచ్చిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థినులు ఆసుపత్రి పాలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చంద్రబాబు అన్నారు. విద్యార్థినులు చికిత్స పొందుతున్న కేసీ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ డాక్టర్లతో చంద్రబాబు స్వయంగా మాట్లాడి వివరాలు ఆరా తీశారు. ద్రవిడ వర్సిటీ ఘటనను దాచిపెట్టేందుకు అధికారులు ప్రయత్నం చేశారన్న సమాచారంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: CBI Vs AP Police : వివేకా కేసు విచారిస్తున్న సీబీఐ ఎస్పీపై పోలీస్ కేసు ! తర్వాత ఏంటి ?
Subrahmanyam Death Case: ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడి
Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల, జులై, ఆగస్టు కోటా రిలీజ్
Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా
TTD Darshan Tickets For July, August : జూలై, ఆగస్టులో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా ? అయితే మీ కోసమే ఈ సమాచారం
Chittoor Crime: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను లాక్కెళ్లిన వృద్ధుడు, ఆపై దారుణం ! తల్లి రాగానే అక్కడినుంచి పరార్
BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్బాడీ అప్పగింత
Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !
Tattoo Child: ఆ పసివాడి ఒళ్లంతా పచ్చబొట్లే, తల్లిని తిట్టిపోస్తున్న జనం, కానీ అసలు కథ వేరే ఉంది!
MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !