అన్వేషించండి

AP Financial Crisis: ఏపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, వడ్డీలు చెల్లించడం కూడా కష్టమే: సీఎం రమేష్

ఎక్కడైనా సరే ఉద్యోగాలు, రెవెన్యూ జనరేషన్ ఉండాలి కానీ అలాంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అభిప్రాయపడ్డారు.

తిరుపతి : ఏపీ పరిస్థితి చాల క్లిష్టంగా ఉందని, ఇదే అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మల సీతారామన్ ప్రస్తావించారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చెప్పారు. అప్పులు తీసుకొని వచ్చి, వడ్డీలు కట్టే స్థితిలో ఏపీ ప్రభుత్వం లేదని విమర్శించారు. ప్రజలకు ప్రయోజనం ఉండే పనులు సైతం ఏపీ ప్రభుత్వం చేపట్టడం లేదని ఆరోపించారు. ఎక్కడైనా సరే ఉద్యోగాలు, రెవెన్యూ జనరేషన్ ఉండాలి కానీ అలాంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. 
తిరుమల శ్రీవారిని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు సీఎం రమేష్ కు స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ..‌ రాష్ట్రంలో చిచ్చు పెట్టి, రాజధాని మార్చాలని చూస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలపై ఆరోపణలు చేశారు. అమరావతిని రాజధానిగా గత ప్రభుత్వంలో తీర్మానం చేయగా అన్ని పార్టీలు అప్పుడు అంగీకరించాయన్నారు. ఇప్పుడు భేషజాలకు పోయి వైసీపీ మంత్రులు, నేతలు రకరకాలుగా బయట మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రజా రాజధాని కేవలం అమరావతి మాత్రమేనని, కేంద్ర ప్రభుత్వం సైతం అమరావతి కోసం సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందని సీఎం రమేష్ స్పష్టం చేశారు.

అందుకే మూడు రాజధానులు నిర్ణయం: ఏపీ డిప్యూటీ సీఎం
తిరుపతి :  నిత్యం ప్రజా సేవకు అంకితమై సేవచేస్తున్న సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల సంక్షేమం కొరకేనన్నారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. అన్ని ప్రాంతాలు సమానంగా చూడాలని ఆలోచనతోనే మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనేదే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన లక్ష్యమన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తిరుమల శ్రీవారిని  దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. 
ఆలయం వెలుపల డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ..‌ రాయలసీమ ప్రజల మదిలో ఏముందో ఇప్పుడైనా ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలుసుకోవాలని సూచించారు. చంద్రబాబుకి తోడునీడగా ఉండే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మూడు రాజధానుల అవసరం తెలియాలన్నారు. ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి కష్టాలు పడుతున్నామని, మల్లి అదే పరిస్థితి రాకుండా చూడాలనే మూడు రాజధానులు సీఎం జగన్ తీసుకొచ్చారని అన్నారు. నవరత్నాలు, మూడు రాజధానులను వక్రీకరిస్తున్న చంద్రబాబు, ఎల్లో మీడియాకు కనువిప్పు కావాలని దేవుడిని ప్రార్ధించినట్లు నారాయణ స్వామి తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada - Hyderabad Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
AP SMAM 2026 Applications : ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు.. దరఖాస్తు విధానం ఇలా!
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు.. దరఖాస్తు విధానం ఇలా!
Hyderabad Drug Tests: హైదరాబాద్‌లో 75 శాతం రౌడీషీటర్లకు డ్రగ్స్ పాజిటివ్.. పోలీస్ అధికారులు షాక్!
హైదరాబాద్‌లో 75 శాతం రౌడీషీటర్లకు డ్రగ్స్ పాజిటివ్.. పోలీస్ అధికారులు షాక్!
Nara Lokesh: టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada - Hyderabad Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
AP SMAM 2026 Applications : ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు.. దరఖాస్తు విధానం ఇలా!
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు.. దరఖాస్తు విధానం ఇలా!
Hyderabad Drug Tests: హైదరాబాద్‌లో 75 శాతం రౌడీషీటర్లకు డ్రగ్స్ పాజిటివ్.. పోలీస్ అధికారులు షాక్!
హైదరాబాద్‌లో 75 శాతం రౌడీషీటర్లకు డ్రగ్స్ పాజిటివ్.. పోలీస్ అధికారులు షాక్!
Nara Lokesh: టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
Whatsapp మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
వాట్సాప్ మీ మెస్సేజ్‌లు చదువుతోంది, ఇక X చాట్‌కు మారండి: మెటాపై ఎలాన్ మస్క్ ఆరోపణలు
TDP Rajya Sabha seat race: టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
టీడీపీలో రాజ్యసభ అభ్యర్థిత్వాలకు భారీ పోటీ - చంద్రబాబు ఆలోచనల్లో ఉన్నది వాళ్లేనా?
EVM Checking: భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
Chia Seeds Side Effects : చియా సీడ్స్ సరిగ్గా తీసుకోకుంటే ప్రమాదకర సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.. ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే
చియా సీడ్స్ సరిగ్గా తీసుకోకుంటే ప్రమాదకర సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.. ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే
Embed widget