అన్వేషించండి

Tirumala News : శ్రీవారికి విదేశీ కాసులు కానుక, హుండీలో 15 దేశాల నాణేలు

Tirumala News : శ్రీవారి హుండీలో 15 దేశాల నాణేలను టీటీడీ అధికారులు గుర్తించారు. వీటిని వేలం వేయడంతో రూ.1.31 కోట్ల ఆదాయం వచ్చింది.

Tirumala News : తిరుమల శ్రీనివాసుడికి విదేశీ కరెన్సీ, నాణేలను భక్తులు కానుకగా సమర్పించారు. తిరుమల హుండీలో దాదాపు 15 దేశాల నాణేలు ఉన్నట్లు టీటీడీ అధికారులు గుర్తించారు. వీటిని వేలం వేయడంతో దాదాపు 1.31 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందని టీటీడీ తెలిపింది.  శ్రీనివాసుడి దర్శనార్ధం ప్రతి నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇలా వచ్చిన భక్తులు భక్తి భావంతో తలనీలాలు సమర్పించిన అనంతరం బంగారు నగలు, వెండి, నగదు వంటికి కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు. కోవిడ్ ముందు వరకూ రోజుకు యనభై నుంచి తొంభై వేల మంది భక్తులకు టీటీడీ స్వామి వారి దర్శనభాగ్యం కల్పించేది. అయితే కోవిడ్ అనంతరం పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాల భక్తులు స్వామి వారి దర్శన భాగ్యం చేసుకునేందుకు కొంత కష్టతరంగా మారింది. కోవిడ్ నిబంధనలను సడలించిన అనంతరం దేశ విదేశాల నుంచి విచ్చేసే భక్తుల సంఖ్య క్రమేపి పెరుగుతూ వస్తోంది. 

తిరుమలకు అంతర్జాతీయ భక్తులు క్యూ 

బ్రహ్మోత్సవాలు, గరుడ వాహన సేవ సమయంలో ఏడుకొండలు జనసంద్రంగా మారిపోతుంది. ప్రపంచంలో అధిక సంఖ్యలో విచ్చేసే ఆధ్యాత్మిక క్షేత్రం‌ కావడంతో పాటుగా, అత్యధిక ఆదాయం‌ లభించే ధార్మిక క్షేత్రాల్లో ఒక్కటిగా ప్రసిద్ధి కెక్కడంతో పాటుగా అగ్రస్థానంలో‌ నిలిచింది. దేశ విదేశాల నుంచి విచ్చేసే భక్తుల సంఖ్య అధికం కావడంతో స్వామి వారి హుండీ విదేశీ నాణేలు ప్రత్యక్షం అవుతూవచ్చాయి. గతంలో అతి తక్కువ విదేశీ నాణేలు మాత్రమే స్వామి వారి హుండీలో కనిపించేవి. అయితే ప్రస్తుతం వివిధ దేశాల నాణేలు స్వామి వారి హుండీలో కానుకులు కనిపిస్తున్నాయి. ముస్లిం దేశాలతో పాటుగా, క్రైస్తవ దేశాల నాణేలు కూడా శ్రీవారి హుండీలో కనిపిస్తుండడం విశేషం. ఈ విదేశీ నాణేల కనుకల బట్టే అంతర్జాతీయంగా భక్తుల తాకిడి తిరుమలకుఎలా ఉందో అని ఇట్టే అర్థం అవుతుంది. 

15 దేశాలకు చెందిన నాణేలు 

ఇటీవల స్వామి వారి హుండీ లెక్కింపులో భాగంగా 15 దేశాలకు చెందిన నాణేలను టీటీడీ పరకామణి అధికారులు గుర్తించారు. విదేశీ నాణేల అమ్మకానికి టెండర్ల ప్రక్రియ నిర్వహించిన అధికారులు మొదటగా ఏడు దేశాలకు.. బ్రిటన్, యూరో, కువైట్, థాయిలాండ్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన నాణేలకు టెండర్లు పిలువగా రూ.1,14,85,814, మిగిలిన 8 దేశాలు శ్రీలంక, ఒమాన్, నేపాల్, చైనా, ఖతర్, దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్ కు చెందిన నాణేలు రూ.16,34,326 ధర పలికినట్లు తెలుస్తోంది. మొత్తం మీద 15 దేశాలకు చెందిన కరెన్సీకి టెండర్ల ద్వారా టీటీడీకి రూ.1.31 కోట్ల ఆదాయం లభించింది. టెండర్లలో పాల్గొని హెచ్1గా ఎంపికైన కంపెనీలకు విదేశీ నాణేలను అధికారులు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇటీవల అంతర్జాతీయంగా భక్తుల తాకిడి అధికం కావడంతో విదేశీ నాణేలు తరచూ స్వామి వారి హుండీలో ప్రత్యక్షం అవుతున్నాయి. 

Tirumala News : శ్రీవారికి విదేశీ కాసులు కానుక, హుండీలో 15 దేశాల నాణేలు

శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

 ధనుర్మాసం ప్రారంభం కావడంతో తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదించారు ఆలయ అర్చకులు.  జనవరి 14వ తేదీ వరకు తిరుప్పావై పారాయణం కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభమయ్యాయి.  పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్ర లేచి బ్రహ్మ ముహూర్తంలో మహా విష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.  12 మంది ఆళ్వార్లలో ఆండాళ్‌(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. వేంకటేశ్వర స్వామి వారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్‌ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగంగా ఉంది. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా కృష్ణ స్వామి వారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. పవిత్ర ధనుర్మాసం సంద‌ర్భంగా పెద్దజీయర్ మ‌ఠంలో తిరుప్పావై పారాయ‌ణం శనివారం ప్రారంభమైంది.  పెద్దజీయర్‌ స్వామి, చిన్నజీయర్ స్వామి ఈ సేవలో పాల్గొన్నారు. జ‌న‌వ‌రి 14వ తేదీ వ‌ర‌కు నెల రోజుల పాటు  తిరుప్పావై పాశురాల‌ను పారాయ‌ణం చేస్తారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP Issue: నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
Andhra Pradesh TET Results 2025: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
Mamata Banerjee: 'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు
'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు" నిరసన మార్చ్‌లో మమత నిప్పులు!
Crime News: కూతురి మామగారితో తల్లి లవ్‌! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!
కూతురి మామగారితో తల్లి లవ్‌! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!

వీడియోలు

Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam
Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP Issue: నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
Andhra Pradesh TET Results 2025: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
Mamata Banerjee: 'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు
'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు" నిరసన మార్చ్‌లో మమత నిప్పులు!
Crime News: కూతురి మామగారితో తల్లి లవ్‌! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!
కూతురి మామగారితో తల్లి లవ్‌! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!
US proposing 500 percent tax:500 శాతం సుంకాలంటూ అమెరికా బెదిరింపు - భారత్ రియాక్షన్ అదుర్స్
500 శాతం సుంకాలంటూ అమెరికా బెదిరింపు - భారత్ రియాక్షన్ అదుర్స్
Sabarimala gold theft case: శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడు అరెస్ట్ - గోల్డ్ గోల్ మాల్ కేసులో సంచలనం !
శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడు అరెస్ట్ - గోల్డ్ గోల్ మాల్ కేసులో సంచలనం !
Mahindra XUV 7XO ప్రోస్‌ అండ్‌ కాన్స్‌: ఈ SUV మీకు సరిపోతుందా? మీ డబ్బుకు తగిన విలువ ఇస్తుందా?
Mahindra XUV 7XO ప్లస్‌లు-మైనస్‌లు: కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
IPAC Case in High Court:'న్యాయమూర్తిని మార్చండి' IPAC కేసులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి ED విజ్ఞప్తి!
'న్యాయమూర్తిని మార్చండి' IPAC కేసులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి ED విజ్ఞప్తి!
Embed widget