అన్వేషించండి

Tirumala News : శ్రీవారికి విదేశీ కాసులు కానుక, హుండీలో 15 దేశాల నాణేలు

Tirumala News : శ్రీవారి హుండీలో 15 దేశాల నాణేలను టీటీడీ అధికారులు గుర్తించారు. వీటిని వేలం వేయడంతో రూ.1.31 కోట్ల ఆదాయం వచ్చింది.

Tirumala News : తిరుమల శ్రీనివాసుడికి విదేశీ కరెన్సీ, నాణేలను భక్తులు కానుకగా సమర్పించారు. తిరుమల హుండీలో దాదాపు 15 దేశాల నాణేలు ఉన్నట్లు టీటీడీ అధికారులు గుర్తించారు. వీటిని వేలం వేయడంతో దాదాపు 1.31 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందని టీటీడీ తెలిపింది.  శ్రీనివాసుడి దర్శనార్ధం ప్రతి నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇలా వచ్చిన భక్తులు భక్తి భావంతో తలనీలాలు సమర్పించిన అనంతరం బంగారు నగలు, వెండి, నగదు వంటికి కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు. కోవిడ్ ముందు వరకూ రోజుకు యనభై నుంచి తొంభై వేల మంది భక్తులకు టీటీడీ స్వామి వారి దర్శనభాగ్యం కల్పించేది. అయితే కోవిడ్ అనంతరం పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాల భక్తులు స్వామి వారి దర్శన భాగ్యం చేసుకునేందుకు కొంత కష్టతరంగా మారింది. కోవిడ్ నిబంధనలను సడలించిన అనంతరం దేశ విదేశాల నుంచి విచ్చేసే భక్తుల సంఖ్య క్రమేపి పెరుగుతూ వస్తోంది. 

తిరుమలకు అంతర్జాతీయ భక్తులు క్యూ 

బ్రహ్మోత్సవాలు, గరుడ వాహన సేవ సమయంలో ఏడుకొండలు జనసంద్రంగా మారిపోతుంది. ప్రపంచంలో అధిక సంఖ్యలో విచ్చేసే ఆధ్యాత్మిక క్షేత్రం‌ కావడంతో పాటుగా, అత్యధిక ఆదాయం‌ లభించే ధార్మిక క్షేత్రాల్లో ఒక్కటిగా ప్రసిద్ధి కెక్కడంతో పాటుగా అగ్రస్థానంలో‌ నిలిచింది. దేశ విదేశాల నుంచి విచ్చేసే భక్తుల సంఖ్య అధికం కావడంతో స్వామి వారి హుండీ విదేశీ నాణేలు ప్రత్యక్షం అవుతూవచ్చాయి. గతంలో అతి తక్కువ విదేశీ నాణేలు మాత్రమే స్వామి వారి హుండీలో కనిపించేవి. అయితే ప్రస్తుతం వివిధ దేశాల నాణేలు స్వామి వారి హుండీలో కానుకులు కనిపిస్తున్నాయి. ముస్లిం దేశాలతో పాటుగా, క్రైస్తవ దేశాల నాణేలు కూడా శ్రీవారి హుండీలో కనిపిస్తుండడం విశేషం. ఈ విదేశీ నాణేల కనుకల బట్టే అంతర్జాతీయంగా భక్తుల తాకిడి తిరుమలకుఎలా ఉందో అని ఇట్టే అర్థం అవుతుంది. 

15 దేశాలకు చెందిన నాణేలు 

ఇటీవల స్వామి వారి హుండీ లెక్కింపులో భాగంగా 15 దేశాలకు చెందిన నాణేలను టీటీడీ పరకామణి అధికారులు గుర్తించారు. విదేశీ నాణేల అమ్మకానికి టెండర్ల ప్రక్రియ నిర్వహించిన అధికారులు మొదటగా ఏడు దేశాలకు.. బ్రిటన్, యూరో, కువైట్, థాయిలాండ్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన నాణేలకు టెండర్లు పిలువగా రూ.1,14,85,814, మిగిలిన 8 దేశాలు శ్రీలంక, ఒమాన్, నేపాల్, చైనా, ఖతర్, దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్ కు చెందిన నాణేలు రూ.16,34,326 ధర పలికినట్లు తెలుస్తోంది. మొత్తం మీద 15 దేశాలకు చెందిన కరెన్సీకి టెండర్ల ద్వారా టీటీడీకి రూ.1.31 కోట్ల ఆదాయం లభించింది. టెండర్లలో పాల్గొని హెచ్1గా ఎంపికైన కంపెనీలకు విదేశీ నాణేలను అధికారులు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇటీవల అంతర్జాతీయంగా భక్తుల తాకిడి అధికం కావడంతో విదేశీ నాణేలు తరచూ స్వామి వారి హుండీలో ప్రత్యక్షం అవుతున్నాయి. 

Tirumala News : శ్రీవారికి విదేశీ కాసులు కానుక, హుండీలో 15 దేశాల నాణేలు

శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

 ధనుర్మాసం ప్రారంభం కావడంతో తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదించారు ఆలయ అర్చకులు.  జనవరి 14వ తేదీ వరకు తిరుప్పావై పారాయణం కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభమయ్యాయి.  పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్ర లేచి బ్రహ్మ ముహూర్తంలో మహా విష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.  12 మంది ఆళ్వార్లలో ఆండాళ్‌(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. వేంకటేశ్వర స్వామి వారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్‌ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగంగా ఉంది. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా కృష్ణ స్వామి వారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. పవిత్ర ధనుర్మాసం సంద‌ర్భంగా పెద్దజీయర్ మ‌ఠంలో తిరుప్పావై పారాయ‌ణం శనివారం ప్రారంభమైంది.  పెద్దజీయర్‌ స్వామి, చిన్నజీయర్ స్వామి ఈ సేవలో పాల్గొన్నారు. జ‌న‌వ‌రి 14వ తేదీ వ‌ర‌కు నెల రోజుల పాటు  తిరుప్పావై పాశురాల‌ను పారాయ‌ణం చేస్తారు. 

టాప్ హెడ్ లైన్స్

YSRCP DSC Protests: ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget