అన్వేషించండి

Tirumala Electric Buses : తిరుమలలో కాలుష్య రహిత ప్రయాణం, 10 ఉచిత ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన టీటీడీ

Tirumala Electric Buses : తిరుమలలో భక్తుల కోసం పది ఉచిత ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ బస్సులను మెగా సంస్థ టీటీడీకి ఉచితంగా ఉందించింది.

Tirumala Electric Buses : తిరుమలలో సామాన్య భక్తుల కోసం 10 ఉచిత ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మెన్ వైవీ.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ధర్మరథాల పేరుతో సామాన్య భక్తుల సౌకర్యార్థం డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తిరుమలలో భక్తులను ఉచితంగా గమ్యస్థానాలకు చేరుస్తాయని తెలిపారు. ఒక్కో బస్సు విలువ కోటి 80 లక్షల ఉంటుందని మొత్తం 18 కోట్లు విలువచేసే పది ఒలెక్ట్రా  కంపెనీ బస్సులను మెగా ఇంజినీరింగ్ సంస్థ  విరాళంగా అందజేసిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో పర్యావరణ కాలుష్యం నివారించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఏడాది క్రితమే ప్రారంభించామని అన్నారు. అందులో భాగంగా అధికారులు సిబ్బందికి విధి నిర్వహణ కోసం ఎలక్ట్రిక్ కార్లను ఇచ్చామని తెలిపారు. అనంతర కాలంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ చొరవతో 65 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ప్రతిరోజు తిరుపతి నుంచి తిరుమల మధ్య నడుపుతోందని అన్నారు. తాజాగా పది ఎలక్ట్రిక్ బస్సుల కూడా ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. లడ్డు కౌంటర్లలో ప్లాస్టిక్ రహిత కవర్లతో పాటు తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్లను పూర్తిస్థాయిలో నిషేధించామని తెలిపారు.రాబోయే రోజుల్లో తిరుమలలో పర్యావరణం కాపాడేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

"భక్తుల కోసం ఉచిత బస్సులను టీటీడీ నడుపుతుంది. తిరుమల కొండపై పర్యావరణ కాపాడేలా పది ఎలక్ట్రిక్ బస్సులు మెగా సంస్థ టీటీడీకి అందించింది. వారంలో రోజుల్లో ఈ బస్సులు తిరుమలలో అందుబాటులోకి రానున్నాయి. తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ  వల్ల గదుల కేటాయింపు పారదర్శంగా జరుగుతుంది. వేసవిలో భక్తులకు ఇబ్బందులు లేకుండా విసృత్త ఏర్పాట్లు చేస్తున్నాం. మాడ వీధుల్లో చల్లటి పాయింటింగ్, చలువపందిళ్లు, తాగునీరు ఏర్పాటు చేస్తున్నాం. వేసవిలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తాం. ఎఫ్.సి.అర్.ఏ నిభందనలకు విరుద్ధంగా విదేశాల నుంచి విరాళాలు స్వీకరించినందుకు టీటీడీ ఆర్బీఐ 3 కోట్ల జరిమానా వేసింది. ఆర్బీఐ వేసినా జరిమానాను త్వరలో కట్టేస్తాం. త్వరలో విదేశాల నుంచి వచ్చే ఎఫ్.సి.ఆర్.ఏ లైసెన్స్ ద్వారా విరాళాలు తిరిగి తీసుకుంటాం. టీటీడీకి ఉన్న ఎఫ్.సి.ఆర్.ఏ లైసెన్స్ కాలపరిమితి ముగియడంతో రెన్యూవల్ చేయమని ఆర్బీఐను కోరాం. హుండీలో కానుకల ద్వారా టీటీడీ ఖజనాలో రూ.30 కోట్లు విదేశీ కరెన్సీ ఉంది."-వైవీ.సుబ్బారెడ్డి 

పర్యావరణహిత ప్రయాణమే లక్ష్యం  

 మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్)  తిరుమలను సందర్శించే భక్తుల సౌకర్యార్ధం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచితంగా పది ఎలక్ట్రిక్  బస్సుల అందించింది. ఎంఈఐఎల్ గ్రూప్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్​ లిమిటెడ్ ఈ బస్సులను హైదరాబాద్ సమీపంలోని తన ప్లాంట్ లో తయారు చేసింది. టీటీడీ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన తొలి బస్సును ఇటీవల దేవస్థానం రవాణా విభాగం జనరల్ మేనేజర్ పీవీ శేషారెడ్డి  సమగ్రంగా పరిశీలించారు. ఒలెక్ట్రా తయారు చేసిన  అత్యాధునిక సౌకర్యాలు కలిగిన 10 ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానానికి  అందించాలని ఎంఈఐఎల్ నిర్ణయించిన విషయం తెలిసిందే. వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చే  భక్తులకు పరిశుభ్రమైన, వాయు, శబ్ధ కాలుష్యంలేని ప్రయాణాన్ని ఈ విద్యుత్ బస్సుల ద్వారా  అందించాలేని ఈ బస్సులు అందించినట్లు ఒలెక్ట్రా ప్రతినిధులు తెలిపారు. ఒలెక్ట్రా అందిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు తిరుమలను పర్యావరణ హితంగా మార్చుతాయన్న  ఆశాభావాన్ని  వ్యక్తం చేశారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh Slams Jagan: జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
e- Shram Card 2026: అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vaibhav Suryavanshi Records: ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
IPL 2026 Prize Money Details: ఐపీఎల్ విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?
ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్: విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?
KTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
Nara Lokesh Slams Jagan: జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
OTT Movies : గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
IPL 2026 GT vs RCB Grand Final: బ్యాక్ టూ బ్యాక్ టైటిల్ పై ఆర్సీబీ గురి.. ఫైన‌ల్లో జీటీని త‌క్కువ స్కోరుకే ప‌రిమితం.. రాణించిన వాషింగ్ట‌న్, ర‌సిక్
బ్యాక్ టూ బ్యాక్ టైటిల్ పై ఆర్సీబీ గురి.. ఫైన‌ల్లో జీటీని త‌క్కువ స్కోరుకే ప‌రిమితం.. రాణించిన వాషింగ్ట‌న్, ర‌సిక్
Embed widget