అన్వేషించండి

Tirumala Electric Buses : తిరుమలలో కాలుష్య రహిత ప్రయాణం, 10 ఉచిత ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన టీటీడీ

Tirumala Electric Buses : తిరుమలలో భక్తుల కోసం పది ఉచిత ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ బస్సులను మెగా సంస్థ టీటీడీకి ఉచితంగా ఉందించింది.

Tirumala Electric Buses : తిరుమలలో సామాన్య భక్తుల కోసం 10 ఉచిత ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మెన్ వైవీ.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ధర్మరథాల పేరుతో సామాన్య భక్తుల సౌకర్యార్థం డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తిరుమలలో భక్తులను ఉచితంగా గమ్యస్థానాలకు చేరుస్తాయని తెలిపారు. ఒక్కో బస్సు విలువ కోటి 80 లక్షల ఉంటుందని మొత్తం 18 కోట్లు విలువచేసే పది ఒలెక్ట్రా  కంపెనీ బస్సులను మెగా ఇంజినీరింగ్ సంస్థ  విరాళంగా అందజేసిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో పర్యావరణ కాలుష్యం నివారించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఏడాది క్రితమే ప్రారంభించామని అన్నారు. అందులో భాగంగా అధికారులు సిబ్బందికి విధి నిర్వహణ కోసం ఎలక్ట్రిక్ కార్లను ఇచ్చామని తెలిపారు. అనంతర కాలంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ చొరవతో 65 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ప్రతిరోజు తిరుపతి నుంచి తిరుమల మధ్య నడుపుతోందని అన్నారు. తాజాగా పది ఎలక్ట్రిక్ బస్సుల కూడా ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. లడ్డు కౌంటర్లలో ప్లాస్టిక్ రహిత కవర్లతో పాటు తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్లను పూర్తిస్థాయిలో నిషేధించామని తెలిపారు.రాబోయే రోజుల్లో తిరుమలలో పర్యావరణం కాపాడేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

"భక్తుల కోసం ఉచిత బస్సులను టీటీడీ నడుపుతుంది. తిరుమల కొండపై పర్యావరణ కాపాడేలా పది ఎలక్ట్రిక్ బస్సులు మెగా సంస్థ టీటీడీకి అందించింది. వారంలో రోజుల్లో ఈ బస్సులు తిరుమలలో అందుబాటులోకి రానున్నాయి. తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ  వల్ల గదుల కేటాయింపు పారదర్శంగా జరుగుతుంది. వేసవిలో భక్తులకు ఇబ్బందులు లేకుండా విసృత్త ఏర్పాట్లు చేస్తున్నాం. మాడ వీధుల్లో చల్లటి పాయింటింగ్, చలువపందిళ్లు, తాగునీరు ఏర్పాటు చేస్తున్నాం. వేసవిలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తాం. ఎఫ్.సి.అర్.ఏ నిభందనలకు విరుద్ధంగా విదేశాల నుంచి విరాళాలు స్వీకరించినందుకు టీటీడీ ఆర్బీఐ 3 కోట్ల జరిమానా వేసింది. ఆర్బీఐ వేసినా జరిమానాను త్వరలో కట్టేస్తాం. త్వరలో విదేశాల నుంచి వచ్చే ఎఫ్.సి.ఆర్.ఏ లైసెన్స్ ద్వారా విరాళాలు తిరిగి తీసుకుంటాం. టీటీడీకి ఉన్న ఎఫ్.సి.ఆర్.ఏ లైసెన్స్ కాలపరిమితి ముగియడంతో రెన్యూవల్ చేయమని ఆర్బీఐను కోరాం. హుండీలో కానుకల ద్వారా టీటీడీ ఖజనాలో రూ.30 కోట్లు విదేశీ కరెన్సీ ఉంది."-వైవీ.సుబ్బారెడ్డి 

పర్యావరణహిత ప్రయాణమే లక్ష్యం  

 మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్)  తిరుమలను సందర్శించే భక్తుల సౌకర్యార్ధం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచితంగా పది ఎలక్ట్రిక్  బస్సుల అందించింది. ఎంఈఐఎల్ గ్రూప్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్​ లిమిటెడ్ ఈ బస్సులను హైదరాబాద్ సమీపంలోని తన ప్లాంట్ లో తయారు చేసింది. టీటీడీ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన తొలి బస్సును ఇటీవల దేవస్థానం రవాణా విభాగం జనరల్ మేనేజర్ పీవీ శేషారెడ్డి  సమగ్రంగా పరిశీలించారు. ఒలెక్ట్రా తయారు చేసిన  అత్యాధునిక సౌకర్యాలు కలిగిన 10 ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానానికి  అందించాలని ఎంఈఐఎల్ నిర్ణయించిన విషయం తెలిసిందే. వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చే  భక్తులకు పరిశుభ్రమైన, వాయు, శబ్ధ కాలుష్యంలేని ప్రయాణాన్ని ఈ విద్యుత్ బస్సుల ద్వారా  అందించాలేని ఈ బస్సులు అందించినట్లు ఒలెక్ట్రా ప్రతినిధులు తెలిపారు. ఒలెక్ట్రా అందిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు తిరుమలను పర్యావరణ హితంగా మార్చుతాయన్న  ఆశాభావాన్ని  వ్యక్తం చేశారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
Embed widget